#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్
*గతమంతా ఘణమే.ప్రస్తుతం ధీనస్థితిలో డ్వాక్రా...*
*✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️*
పనిచేయని ఎపియంలు. పట్టించుకోని జిల్లా అధికారులు..
ఎక్కడ చూసినా అప్పుల - కుప్పలే..మొండి బకాయిల పేరుతో రుణాలు ఇవ్వడం లేదు.
*పనిభారంతో మూలుగుతున్న వివోఏలు..*
మహిళా శక్తి సంఘాల పేరుతో అబలలను - సబలలుగా చేసి మహోన్నత స్త్రీ శక్తి పధకం డ్వాక్రా సంఘాలు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాల్లో మహిళలను చైతన్యవంతం చేసి,పొదుపు సంఘాలపేరుతో మహిళలను చైతన్యవంతం చేసే దిశగా ఆర్థిక పరిపుష్టి కల్గించేందుకు ఆనాడు అంకురార్పణ చేసిన అద్భుతమైన పథకం డ్వాక్రా సంస్థ.ఇప్పుడా డ్వాక్రా సంస్థ ప్రజాదారణ ఎక్కువై రాను-రాను గ్రామాల్లో మహిళా సంఘాలు బలోపేతమై ఆర్థికవనరుగా మారడంతో, అవినీతి అధికారులు ఎక్కువై ప్రభుత్వ పథకాలను సామాన్యులకు అంధనివ్వకుండా హరించేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మహిళలను ఐక్యంచేసి పొదుపు సంఘాల్లో చేరమని బాకా ఉధి,డ్వాక్రా యొక్క పథకాలను సవివరంగా తెలియజేసి డ్వాక్రా ను పటిష్టం పరిచిన ఘనత ముమ్మాటికీ వివోఏ లదే.అలాంటి వివోఏ లను సరైన మార్గంలో నడిపించవలసిన ఎపిఎంలు అవినీతికి అలవాటై, కాసులకు కక్కుర్తిపడి,రాజకీయ నాయకులతో జతకట్టి మీరు సగం తినండి,మేం సగం తింటాం అంటూ వివోఎలతో కుమ్మక్కై బ్యాంకులకు చెల్లించవలసిన పొదుపు సంఘాల సొమ్మును అందినకాడికి తినేస్తున్నారు అంటూ అనేక ఫిర్యాదులు వెల్లువల వస్తున్నాయి.ముఖ్యంగా ముమ్మిడివరం నియోజవర్గంలో కాట్రేనికోన,ఐ.పోలవరం,ముమ్మిడి
వరం మండలాల్లో ఎపియంలుగా పనిచేసిన,పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఆయా గ్రామాల్లోనీ అనేకమంది నాయకులు ప్రియల రూపంలో తెలియజేశారు.. గ్రామాల్లో పొదుపు సంఘాల డబ్బులను బ్యాంకులకు చెల్లించకుండా,మొండి బకాయిలు వసూలు చేయకుండా,రాజకీయ నాయకుల అండదండలతో వివోఏలు,సిసిలు,ఎపియంలు అందినకాడికి దోచేశారనీ ఐ. పోలవరం మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఇప్పటికే జిల్లా అధికారులకు తెలియజేశారు. బ్యాంక్ లింకేజి రుణాలు,శ్రీనిధి రుణాలు వసూళ్ళు చేయడంలో మండల మహిళా సమైక్య సిబ్బంది నోరు మెదపకుండా కడదాంలే మనల్ని ఎవడు అడుగుతాడు అన్నట్టు కాలయాపన చేసేస్తున్నారనీ నాయకులు ఆవేదన.మహిళా సమైక్యలో సిబ్బంది చేతివాటం వలన,మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో కొత్తగా రుణాలు దరఖాస్తు చేసుకునే డ్వాక్రాసంఘాలకు రుణాలు మంజూరు కావడంలేదు. ఇటీవల కాట్రేనికోన మండలంలో పల్లంకుర్రు,పెనుమల్లె క్లస్టర్లల్లో, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు,టి.కొత్తపల్లి పరిధిలో లక్షల్లో బకాయిలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. జిల్లా ఉన్నతాధికారి సమావేశాలు సభలో పెట్టినప్పటికీ మండల మహిళా సమాఖ్యలో ఇసుమంతైన మార్పు రాకపోవడంతో కొంతమంది ఎపియంలను స్థానచలనం చేశారు.ఐ.పోలవరం మండలం ఇంచార్జ్ ఎపియం గా చేస్తున్న రమాకాంత్ కాట్రేనికోన మండలంలో సిసిగా చేసేటప్పుడు ఆర్ ఆర్ మార్టు పేరుతో లక్షల్లో మాయాజాలం చేసారని,ఇప్పటికీ మార్కు సంబంధించిన లెక్కలు సంబంధిత మహిళా సమైక్యకు తెలియజేయలేదని,అధికారులు అండదండలతో,రాజకీయ నాయకులు చెలిమితో బకాయిలు వదిలేసి తెలివిగా తప్పించుకుని తిరిగుతున్నాడనీ, రమాకాంత్ వలనే కాట్రేనికోన మండలంలో తక్కువ దొరకలభించే మార్ట్ లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. మండల మహిళా సమైక్యకు వచ్చే ప్రభుత్వ నిధులను హాయిగా అందిన కాడికి తినేస్తూ,సమావేశాలు పేరుతో, అల్పాహారం,భోజనాలు కూడా సిబ్బందికి పెట్టకుండా వివోఏలను ఉసురుమర్పించేలా చేస్తున్నారనీ కొంతమంది వివోలు బహిరంగ చెబుతున్నారు. సర్వేల పేరుతో ప్రభుత్వం వివోఏలకు చెల్లించే పారితోశాఖన్ని సైతం మండల మహిళా సమైక్య లో పనిచేసే సిబ్బంది వాటాలు వేసుకుంటున్నారనీ ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎవరైనా వివో ఏ గట్టిగా మాట్లాడితే నీ సంగతిచూస్తాను,నువ్వు ఇంకా లోన్ రికవరీ చేయలేదు,సరిగా పనిచేయడం లేదు,నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఐ పోలవరం మండలానికి చెందిన ఎపియం అయితే ఒక అడుగు ముందుకు వేసి వివోఎలను ఇతర శాఖల అధికారులు చూస్తుండగానే, గేలి చేసినట్టుగా ఏ పిల్ల ఏంటి ఇంకా పనిచేయలేదు,ఏరా ఏంటి ఇంకా రాలేదు ఏ పిల్ల-పిల్ల అంటూ సంబోధించడం చుసిన మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బంది అవక్కాయ్యరనీ ఇదే విషయం మహిళా సమైక్ లో పనిచేసే సిబ్బంది దగ్గర తెలపగా అతను అంతే అలాగే మాట్లాడతాడని తప్పించుకున్న పరిస్థితి ఐ పోలవరం మండలంలో నేలకొంది.ఉదయం కార్యాలయానికి రావలసిన ఎపియంలు,అమలాపురంలో హాజరువేసి మధ్యాహ్నం వచ్చి హడావిడి చేస్తూ,రికవరీల కోసం రాత్రి ఎనిమిది అయ్యేవరకు కార్యాలయంలో టైం పాస్ చేయడం చేస్తుంటే డ్వాక్రా ఆఫీస్ వాళ్ళు ఎంత పనిచేస్తున్నారో అంటూ ప్రజలు నవ్విపోతున్నారు. ఇంత కష్టపడి పనిచేసిన చాలా గ్రామాల్లో రికవరీ చేయడంలో, వివోఏలతో పనిచేయించడంలో ఏపీయంలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఐ పోలవరం మండలానికి చెందిన కొందరు నేతలు బహిరంగంగానే తెలియజేస్తున్నారు.కొంతమంది ఏపీయంలపై అనేక ఆర్థిక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఉన్నత అధికారులు పట్టించుకోకుండా ఉండటం వెనుక,అసలు పాత్రధారులు ఎవరో అర్థం కావడం లేదు.ఎప్పటికైనా ఇలాంటి అధికారులు పట్ల సమగ్ర విచారణ కోరుతూ ఆయా మండలాల్లోని నాయకులు జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లిన చర్యలు మాత్రం లేకపోవడం విచిత్రం.
__________________________
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :-
ముమ్మిడివరం - నియోజకవర్గం
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼