DUDEKULA DASTAGIRI
580 views
2 days ago
*"ప్రత్యేక అధికారుల సమావేశాన్ని నిర్వహించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు."* *మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రత్యేక క్యాంపు కార్యాలయం నందు "ప్రాంత అభివృద్ధి "ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు.* *గౌ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గౌ " ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అభివృద్ధి , ప్రజా సమస్యల కోసం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.* *ఎండలు అధికంగా ఉన్నాయని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడా నీటి సమస్య లేకుండా అధికారులు ప్రతీ గ్రామంలో స్వయంగా వెళ్లి సమస్య తెలుసుకొని వెంటనే నీరు అందేలా చూడాలి అని RWS అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు.* *గత కొన్ని రోజులుగా పాఠశాల , హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ లో భాగంగా విద్యార్థులు , త్రాగునీరు అందించు R.O వాటర్ ప్లాంట్లను పరిశీలించగా అన్ని నిరుపయోగంగా ఉన్నాయని , తరగతి గదులు , బాత్రూమ్ లు అపరిశుభ్రత , కొరత ఉన్నాయని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సత్వరమే పరిష్కారం చేయాలి అని MEO లకు ఆదేశించారు* *రెవిన్యూ శాఖ కి సంబంధించిన పొలం , పట్టాదారు , online , pass Book సమస్యలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమావేశంలో ఎమ్మెల్యే గారు తెలిపారు* *అనంతరం కూటమి ప్రభుత్వం మన వెనుకబడిన నియోజకవర్గo పై ప్రత్యేక దృష్టి పెట్టడం అభివృద్ధి లో రాష్ట్రం లో 6 వ స్థానంలో జిల్లాలో మొదటి స్థానంలో ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయం అని అందుకు అనుగుణంగా తోడ్పాటు అందించిన అధికారుల అందరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రాబోవు స్థానిక ఎన్నికల సమయానికల్ల మిగతా సమస్యలు పరిష్కారం కావాలని గౌ " ఎమ్మెల్యే గారు ఆదేశించారు* #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్