Mohan
733 views
2 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party ⚖️ నెలరోజులైనా కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కార్❗ 🌾 పంటను ఎవరు కొనాలి❓ 🚨 గన్నీ సంచులియ్యరు.. దోపిడీని అరికట్టరు 👨🏻‍🌾 రోజూ కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నం ✊🏻 రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళన. రాస్తారోకో, ధర్నాలతో నిరసన ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నీ బస్తాలు లియ్యరు.. కాంటా పెట్టరు.. తరుగు పేరిట దోపిడీతో సతమతమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వినూత్న నిరసనలు చేపట్టారు. ఆలస్యంగా కాంటా అయినప్పటికి మూడు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధాన్యాన్ని రహదారిపై వేసి నిప్పంటించారు. ధాన్యం కొనుగోలులో రేవంత్‌రెడ్డి సర్కార్‌ విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఉసురు ఊకనే పోదని హెచ్చరించారు.