P.Venkateswara Rao
505 views
5 days ago
#చంద్రబాబు #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *మోదీపై తీవ్ర పొగడ్తలు, తెగడ్తలు.. బాబుకే సొంతం❗* APRIL 21, 2026🎯 ప్రధాని నరేంద్ర మోదీపై విపరీత పొగడ్తలు, అలాగే తెగడ్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రమే సొంతం. రాజకీయంగా మోదీతో అవసరం ఏర్పడినప్పుడు ఆయన్ను ఆకాశమే హద్దుగా చంద్రబాబు ప్రశంసించడాన్ని యావత్ భారతదేశం చూసింది, వినింది. అలాగే మోదీ వల్ల రాజకీయంగా నష్టమని భావించినప్పుడు, ఆయన్ను తీవ్రస్థాయిలో చంద్రబాబు తిట్టడాన్ని కూడా మన దేశ ప్రజానీకం చూసింది. ఇటు పొగడ్తల్లోనూ, అటు తెగడ్తల్లోనూ రికార్డులు మాత్రం చంద్రబాబుకే సొంతం. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిమిత్తం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. రెండు రోజుల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేవలం మోదీ గుడ్ లుక్స్లో పడేందుకు, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెప్పుకోసమే తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లారని, ఆయన మాటలు విన్న వారెవరికైనా అర్థమవుతుంది. ప్రధాని మోదీ జాతీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుండడంతో తాను మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో వుందన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకత్వం వుందని ప్రశంసలతో ముంచెత్తారు. కేంద్రం ఉదారంగా నిధులిస్తుంటే, వినియోగించుకోవాలి కదా అని స్టాలిన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం మోదీ సర్కార్ రూ.14 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కేంద్ర నిధుల్ని దారి మళ్లించడం సమంజసమా? అని డీఎంకే ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, తమిళనాడులో అభివృద్ధి మందగించిందని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో విమానాశ్రయాలపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. ఇవన్నీ కూడా మోదీ మెప్పు కోసం తప్ప, మరే ఉద్దేశంతో కాదని జనానికి అర్థమైంది. ఇదే చంద్రబాబునాయుడు గతంలో మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఆయన దగ్గర చంద్రబాబు మాట బాగా చెల్లుబాటు అయ్యేది. అప్పట్లో గుజరాత్లో మత ఘర్షణలు జరగ్గా, నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఆయన్ను సీఎం గద్దె నుంచి తప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతెందుకు, 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి వచ్చారు. అంత వరకూ మోదీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ ఏం చేశారని నిలదీశారు. రాజధాని అమరావతికి తట్టెడు మట్టి, యమునా నీళ్లు తీసుకురావడం తప్ప, ఏమీ చేయలేదని తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఓడించి దేశం నుంచి బహిష్కరించాలన్న రేంజ్లో మండిపడ్డారు. మోదీ అవినీతికి పాల్పడుతు న్నారని, సీబీఐ, ఈడీలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నారని మోదీపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ప్రకటించి, హామీని అమలు చేయని 'ద్రోహి'గా అభివర్ణించారు. మోదీ పాలనలో దేశం బాగా వెనుకబడిందని ఆరోపించారు. పాలన చేయడం ఆయనకు చేతకాదన్నారు. మోదీ కుటుంబ సభ్యులపై కూడా బాబు నోరు పారేసుకున్నారు. రాజకీయంగా నచ్చకపోతే విమర్శలు చేయాలంటే చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం, వారి మెప్పు పొందేందుకు ఎలా పొగడ్తలతో ముంచెత్తాలో చంద్రబాబును చూసే నేర్చుకోవాలనే చర్చ జరుగుతోంది. ఒకే వ్యక్తి, రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాల్ని, స్వల్ప సమయం తేడాలో మాట్లాడితే ఏమైనా అనుకుంటారనే వెరపు కూడా లేకపోవడం చంద్రబాబు గొప్పతనం. అదే రాజకీయాల్లో ఆయన విజయ రహస్యం కూడా.