#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #ktr #ktrtrs 🎯 యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేస్తం 📢
🚘 బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రైతులకు యాప్ కష్టాలు తొలగిస్తం 👨🏻🌾
⛔ యూరియా ఇయ్యలేక రైతులను అరిగోస పెడ్తున్న కాంగ్రెస్ సర్కార్
💰 రాష్ట్రంలో రైతుబంధు పోయింది ఢిల్లీలో 'రాహుల్ బంద్' నడుస్తున్నది
📣 బుగ్గపాడు భూములను చౌకగా అమ్మాల్సిన అవసరం ఏమున్నది?
🚨 ముగ్గురు ఖమ్మం మంత్రుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది
💥 సత్తుపల్లి కార్యకర్తల సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రైతులకు యూరియా కష్టాలు తెచ్చింది, యాప్ పేరుతో వాటిని మరింత పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అసలు షాప్లో లేని యూరియా యాప్లోకి ఎలా వస్తుందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతులను అష్టకష్టాలు పెట్టే ఈ యూరియా యాప్ను బంగాళాఖాతంలో పడేస్తం.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మంత్రులు ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్లను కూల్చారు. పేదల కడుపులో తన్నిన నీచ చరిత్ర రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులది. వారి విల్లాలకు వీళ్ల గుడిసెలు అడ్డొస్తున్నాయని తొలగించుకున్నారు. అందుకే ‘దుర్మార్గపు కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.