DUDEKULA DASTAGIRI
539 views
6 days ago
*పోషణ పక్వాడ (09.04.2026 నుండి 23.04.2026 వరకు) కార్యక్రమం సందర్భంగా గిద్దలూరు శాసన సభ్యులు గౌరవ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు గిద్దలూరు క్యాంప్ కార్యాలయంలో పోస్టర్లను అధికారికంగా ఆవిష్కరించారు.* *ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అత్యంత ముఖ్యమని, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, అధిక చక్కెర (షుగర్) ఉన్న ఆహారాలను దూరంగా ఉంచాలని సూచించారు. అదేవిధంగా టీవీ, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల వంటి డిజిటల్ పరికరాల వినియోగాన్ని పిల్లలలో నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.* *పుట్టిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలలో పిల్లల మెదడు అభివృద్ధి సుమారు 80% వరకు జరుగుతుందని, ఈ దశలో శారీరక, భావోద్వేగ, సామాజిక, జ్ఞాన సంబంధ (కాగ్నిటివ్) మరియు సృజనాత్మక అభివృద్ధి వేగంగా జరుగుతుందని వివరించారు. పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం తల్లిదండ్రులు వారితో సమయం కేటాయించడం అత్యంత అవసరమని సూచించారు.* *ఈ కార్యక్రమంలో సీడీపీఓ శ్రీమతి కె. మహిత, సూపర్వైజర్ శ్రీమతి బి. జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు

More like this