*తంబళ్లపల్లె తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం, తంబళ్లపల్లె గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.*
*ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
*ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.*
*శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న అశోక్ రెడ్డి గారు, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.*
*పూజ అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారికి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక నాయకులు, జనసైనికులు, భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.*
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్