ఈరోజు #రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం, నేమకల్లు గ్రామంలోని కాలనీలో ‘ప్రధాన మంత్రి సూర్యఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాల్వ శ్రీనివాసులు గారు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారితో కలిసి విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ప్రారంభించడం జరిగినది. అనంతరం 'ప్రగతి పండుగ' కార్యక్రమంలో పాల్గొని రూ.30 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో 'పీఎం సూర్యఘర్' పథకం ద్వారా రూ.27 కోట్ల వ్యయంతో 2400 ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా అయ్యే రూ.1.25 లక్షల ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తూ పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. అంతేగాకుండా ఈ పథకం ద్వారా ఓసీ వినియోగదారులకు రూ.78,000, బీసీలకు రూ.98,000 రాయితీ అందిస్తున్నాం. విద్యుత్ రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు...
#GottipatiRavikumar #EnergyMinister #PMSuryaGhar #AndhraPradesh #IdhiManchiPrabhuthvam
#🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్