DUDEKULA DASTAGIRI
613 views
1 days ago
*వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *మార్కాపురం జిల్లా కంబం పట్టణంలో, కాప వీధి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.* *ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.* *ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.* *శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అశోక్ రెడ్డి గారు, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.* *పూజ అనంతరం అర్చకులు ఎమ్మెల్యే గారికి వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను , స్వామి ప్రతిమ ను అందజేశారు.* *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.* *ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కంబం మండల,స్థానిక నాయకులు, జనసైనికులు, భారీ సంఖ్యలో భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు