DUDEKULA DASTAGIRI
654 views
4 days ago
*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల* *మార్కాపురం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి 21వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను గౌరవనీయులైన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.* *​ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు టాస్ వేసి క్రికెట్ ​ప్రారంబించినారు ఎమ్మెల్యే గారు స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులతో క్రికెట్ ఆడి ఉత్సాహాన్ని నింపారు.* *​గౌ " ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక విల్లాసానికి మరియు యువత మధ్య స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.* *​"గ్రామీణ ప్రాంత యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో అవసరం. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి అని తెలిపారు* *స్వామి వారి వార్షికోత్సవం మరియు క్రికెట్ పోటీలు ఒకేసారి జరగడంతో కాలువపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.* *​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. యువతను ప్రోత్సహించడంలో ముత్తుముల అశోక్ రెడ్డి గారు చూపిస్తున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు