విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా, గత వారం ZPHS Co-Education High School పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ Muttumula Ashok Reddy గారిని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
*పాఠశాలలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విద్యార్థులు తెలియజేయగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు స్వయంగా 10 సీలింగ్ ఫ్యాన్లను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన భోజనం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.*
*విద్యార్థుల పట్ల ఎమ్మెల్యే గారి చూపుతున్న ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.*
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్