#📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
#🏛️రాజకీయాలు #🏛️రాజకీయాలు #👉నేరాలు - ఘోరాలు🚨 #👉నేరాలు - ఘోరాలు🚨
#Amaravati
ఈ రోజు ఈనాడు మెయిన్ పేజీ లో రాజధాని రోడ్ల పనులకు స్పీడ్ బ్రేకర్ లు పేరుతో ఒక వార్త వచ్చింది.
రాజధానిలో అతి ముఖ్యమైన ప్రధాన రోడ్ల కు అక్కడక్కడా అడ్డంగా వున్న ఇంకా సమీకరణ కి ఇవ్వని దాదాపు 200 ఎకరాల భూముల కారణంగా ప్రధాన రోడ్ల పనులకు ఎలా ఆటంకం కలుగుతుందో (ఫోటోల తోసహా), ఏ ఏ గ్రామాల్లో ఎంత భూమి రైతులు భూములు సమీకరణకు ఇవ్వని కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంది అనే వివరాలు వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఉండవల్లి 31 ఎకరాలు పెనుమాక 47 ఎకరాలు, నిడమర్రు 40 ఎకరాలు, నవులూరు 25 ఎకరాలు, రాయపూడి లో 19 ఎకరాలు వున్నాయి.
ఇలాంటి రైతులే మొన్న జగన్ రెడ్డి ని కలిసిన 27 మంది రైతుల్లో ఎక్కువ మంది. దాంట్లో 20 మంది ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు ఎందుకు కలిశారు అంటే ప్రభుత్వం ఇలాంటి భూములు కి భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి.
ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ భూములు భూసమీకరణ కింద తీసుకోడానికి సిద్దంగా వుంది.
ప్రభుత్వం రాజధానికి భూములు తీసుకునే విషయంలో ఎంత ఓపిక గా, సంయమనం తో, చట్టబద్ధం గా ఆచితూచి రైతులతో వ్యవహరిస్తుందో 12 ఏళ్ల తరువాత కూడా ప్రధాన రోడ్లకు అడ్డంగా వున్న ఈ భూములే నిదర్శనం.
జగన్ ను కలిసిన ఒకరిద్దరు రైతులు ఆరోపణలు చేసినట్లు నిజంగా ప్రభుత్వం దౌర్జన్యంగా , కక్షపూరితంగా వ్యవహరిస్తే ఇన్ని సంవత్సరాల తరువాత కూడా రోడ్ల కి అడ్డంగా ఆ భూములు అలా వుండేవా ?
కోర్టులు కూడా ప్రధాన రోడ్ల కు అడ్డంగా వున్న ఇలాంటి భూములు ప్రభుత్వం భూసేకరణలో తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పే అవకాశం లేదు..
విచిత్రంగా కొన్ని YouTube channels, కొందరు ముసుగు మేధావులు, paytm జర్నలిస్ట్ లు అమరావతి రైతులకు చంద్రబాబు అన్యాయం చేసినట్టు వాళ్లు న్యాయం కోసం జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లినట్టు విచిత్రమైన ప్రచారం చేస్తుంటే నవ్వు వస్తుంది.
2015 నుంచి అమరావతి కి భూములు ఇవ్వని 2 శాతం మంది రైతుల్లో ఒక పాతిక మంది రైతులు ఇప్పుడు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత భూములు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఏమి చేయాలో అర్థం కాక జగన్ దగ్గర కి వెళ్ళారు కానీ రాజధాని కి భూములు ఇచ్చిన 98 శాతం రైతుల్లో ఏ ఒక్క రైతు జగన్ ను కలవలేదు . కలిసే అవకాశం కూడా లేదు.
అధికారంలో వున్న ఐదేళ్లు చిత్రహింసలు పెట్టి, భూములు ఇచ్చిన రైతుల మీద అన్యాయం గా వందల కేసులు పెట్టి, జైలు కి పంపించి, అక్కడ రాజధాని లేకుండా చెయ్యాలి అని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి విఫలమై , ఇప్పటికి కూడా అమరావతి మీద విషం చిమ్ముతూ, సిగ్గు లేకుండా మావిగన్ అని మతి లేని మాటలు మాట్లాడే మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి దగ్గరకు బుద్ధి,జ్ఞానం వున్న వాళ్లు ఎవరైనా వెళ్తారా?