Follow
DUDEKULA DASTAGIRI
@149574575
22,173
Posts
23,410
Followers
DUDEKULA DASTAGIRI
651 views
1 hours ago
*“అన్నదాతల కోసం మరో అడుగు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడవ విడత పంపిణీ”* *మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు అన్నదాత సుఖీభవ – పి.యం. కిసాన్ 2025–26 మూడవ విడత పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.* *ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు గౌ. శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జాయింట్ కలెక్టర్ పులి . శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. నియోజకవర్గం లోని 37,649 రైతులకు ఒక్కో రైతు కి 6000 రూపాయల చొప్పున మొత్తం అభ్యున్నతే ప్రభుత్వ 22,58,94,000 రూపాయలు జమ చేయడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుంది అని తెలిపారు రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభించి పరిశీలించి తగు సూచనలు చేశారు రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తున్నందుకు , మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయ డమైనది.* *అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ – పీ.యం.కిసాన్ పథకం ద్వారా మూడవ విడత నిధులు విడుదల చేయడం రైతులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.* *ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు,రైతులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
554 views
10 hours ago
#ఇఫ్తార్_విందులో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా: #గిద్దలూరు పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్ నందు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు శ్రీ #సయ్యద్_షానేషావలి గారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో Giddalur Telugudesam పార్టీ శాసన సభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఉపవాసం (రోజ) ఉన్న ముస్లిం సోదరులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించినారు. అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వం, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, కౌన్సిలర్ లు , వార్డు ఇంచార్జ్ లు,పార్టీ నాయకులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
660 views
13 hours ago
కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ముత్తుముల #తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి , ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారన్నారు... ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి , దుగ్గా రమేష్ రెడ్డి, చలిచీమల శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు... #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
611 views
4 days ago
ప్రతి ఒక్కరూ తండ్రిని అభిమానిస్తారు, గౌరవిస్తారు కానీ తండ్రిని ఇంతగా అభిమానించే వ్యక్తి ఒక్క బాలయ్య మాత్రమే, ప్రతిఒక్కరి దగ్గర తన తండ్రి ఎన్టీఆర్ గురించి ఇంతగా మాట్లాడే వ్యక్తిని నేను చూడలేదు... #తెలుగు అనే మూడు అక్షరాలకు నా రక్తం ఉప్పొంగుతుంది. #NTR అనే మూడు అక్షరాలకు నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి స్వచ్ఛమైన మనసు మా Nandamuri Balakrishna గారిది... #జైబాలయ్య 👌 #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
633 views
5 days ago
#గిద్దలూరులో_ఘనంగా_మహిళా_దినోత్సవ_వేడుకలు మహిళల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని చీతీరాల కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మహిళామూర్తులందరికీ ఆయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ నిర్మాణంలోనూ, కుటుంబ పురోగతిలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. అనంతరం, మహిళల సంక్షేమం, వారి ఆర్థిక ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంటున్న వివిధ సంక్షేమ పథకాలను, నిర్ణయాలను ఆయన వారికి కూలంకషంగా వివరించారు. మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. "మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మీ అభివృద్ధి, శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం" అని తెలుపుతూ మహిళల్లో ఆయన భరోసా నింపారు. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. #womansday2026 #MuthumulaAshokReddy #GiddalurMLA #GiddalurTelugudesamparty #ముత్తుముల_అశోక్_రెడ్డి #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
2.1K views
5 days ago
స్త్రీ లేకపోతే జననం లేదు 🙏 స్త్రీ లేకపోతే గమనం లేదు 🙏 స్త్రీ లేకపోతే మనుగడలేదు 🙏 స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు 🙏 మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏💐💐💐💐😍😍 #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
592 views
7 days ago
#విద్యుత్_సమస్యలపై_అసెంబ్లీలో_గళమెత్తిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా :#అసెంబ్లీ #గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి మరియు సమస్యలపై Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు అసెంబ్లీలో గళం వినిపించారు. మా ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి రాయలసీమ జిల్లాల తర్వాత ల్యాండ్ అవైలబులిటీ ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా అధిక లోడ్లు ఉండటం వల్ల విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు ప్రాంతంలో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడితే విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గి పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని గౌరవ మంత్రివర్యులు Gottipati Ravikumar గారికి విజ్ఞప్తి చేశారు. అలాగే గిద్దలూరు ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు కోరారు. #AssemblySession #AndhraPradesh #IdhiManchiPrabhutvam #GiddalurMLA #GiddalurTelugudesamparty #ముత్తుముల_అశోక్_రెడ్డి #MuthumulaAshokReddy #ThankyouMlaMuthumulaAshokReddySir #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
885 views
8 days ago
మంత్రి #మండిపల్లిరాంప్రసాద్_రెడ్డి గారితో సమావేశమైన Muthumula AshokReddy #తాడేపల్లి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే #ముత్తుముల #మార్కాపురంజిల్లా: #గిద్దలూరు నియోజకవర్గంలో క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన సేవలు & క్రీడల శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కలసి #కొమరోలు మరియు #అర్ధవీడు మండలాల్లో అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియంల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే #గిద్దలూరు మరియు #కంభం మండలాల్లో నూతన స్టేడియంల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కూడా మంత్రి గారిని కోరారు. అదే విధంగా నియోజకవర్గంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా స్పోర్ట్స్ కిట్స్ అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు తెలిపారు. ఈ అంశాలపై మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుని నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. #IdhiManchiPrabhutvam #GiddalurTelugudesamparty #GiddalurMLA #MuthumulaAshokReddy #గిద్దలూరు #మనగిద్దలూరుమనముత్తుముల #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
See other profiles for amazing content