ఫాలో అవ్వండి
sarvathomukhi SATSANGAM
@73047715sarvathomukhi
4,247
పోస్ట్
6,215
ఫాలోవర్స్
sarvathomukhi SATSANGAM
582 వీక్షించారు
#😃మంచి మాటలు ఆంజనేయ స్వామి తోక పూజ లాంగూలము ఆంజనేయ స్వామి తోక పూజ లాంగూల పూజ హనుమంతుని శక్తులకు ప్రతీక తోక భాగంలో సింధూరం, మల్లె నూనె, కుంకుమతో పూజ చేస్తారు.భయంపోయి ధైర్యం ఆరోగ్యం,. శని దోష నివారణ కలుగుతుందనినమ్మకం. మంత్రం ఓం నమెా భగవత్ ఆంజనేయాయ మహా బలాయ స్వాహా లేదా హనుమాన్ చాలీసా పఠించాలి. శ్రీ హనుమల్లాంగూలాస్త స్తోత్రం జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే సౌమిత్రే జయదా త్రే చ రామ దూతాయ తే నమః రగులుతున్న బంగారు వర్ణంలో వెలుగుతూ , పొడవైన తోకను కల్గిన వాడా లక్ష్మణునికి విజయాన్ని చేకూర్చిన వాడా శ్రీ రామదూత ఆయన హనుమంతునికి నమస్కారము. పంచ వక్త్రం మహా భీమంత్రి పంచనయ నైర్యుతం బాహు భిర్దశ భి ర్యుక్తం ప్రణమామి ప్లవంగమం ఐదు ముఖా లతో పంచముఖ హనుమాన్ అత్యంత భయంకరమైన రూపుతో , పది కళ్లతో ,పది చేతులతో ప్రకాశించేఆ వానర శ్రేష్టునికి హనుమంతు నికి నమస్కారం. భక్త జ్ణానాంజనేయాయ వాయు పుత్రాయ నమః భక్తులకు జ్ణానాన్ని ప్రసాదించే అంజనీ పుత్రుడా,వాయుదేవుని హనుమంతుడా నీకు నమస్కారము. సర్వతో ముఖీ
sarvathomukhi SATSANGAM
550 వీక్షించారు
#😃మంచి మాటలు రుద్రాక్ష యెుక్కత్రిమూర్తి స్వరూపము రుద్యాక్ష మూలం తత్ బ్రహ్మ రుద్రాక్ష యెుక్క మూలము నందు సృష్టికర్త అగు బ్రహ్మ దేవుడు సంస్థితులు తత్ నాళం విష్ణు రేవచ నాళము మధ్య ప్రదేశము విష్ణు స్థానము తత్ ముఖమ్ రుద్ర ముఖము రుద్ర స్థానము బిందుః సర్వ దేవతా యితి బిందు స్థానము సర్వదేవతా నిలయం సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్సర్వమ్ ప్రతిష్టితమ్ రుద్రాక్షతాత్వికార్ధము ఈ జగత్తు ను రుద్ర సంకల్ప, వికల్ప చమత్కారము గా దర్శించటముసస్వరూపాత్మయే రుద్ర ప్రత్యక్ష రూపముగా భావించటము సమస్త జగత్తు రుద్రభూమిగాను,సర్వ భౌతిక రూపములు రుద్రుని ఆశ్రయించిన భూత గణముగాను, సమస్త మనస్సులను రుద్రుని సేవించు పిశాచ గణముగాను ఎరిగి వుండటము. సర్వముకేవలాత్మ యందు ఏకము లయము చేయు కనులు లేక దృష్టి అనునదేరుద్రాక్షశబ్ధార్ధము సదాశివుడు సంహార కాలములో సంహార లీలను నిర్వర్తించటానికై కనుల నుండి జనించటం చేత రుద్రాక్ష లుఅనబడుచున్నాయి. జాగ్రత్,స్వప్న. సుషుప్తుల వస్తుతః రాహిత్యము స్వతహాగా లేవుఅను తత్త్వార్ధ దృష్టియే రుద్రాక్షత రుద్రాక్ష ధరించిన వాడు జన్మ జన్మాంతర చక్రము నుండి విడి వడగలరు జన్మ కర్మల విషయంలో సర్వ స్వ తంత్రులై స్వస్వరూపానందము నందు ప్రతిష్ఠితము కాగలరు సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
552 వీక్షించారు
#😃మంచి మాటలు విష్ణు సహస్ర నామము నరః నశించనివాడు రఅనగానాశనము నాశనము లేనివాడు. నాశనము లేని చేతనా చేతనములను విభూతిగా గలవాడుప్రాణులను సృష్ట్యా దుల చేత తమ తమ వ్యాపార ములందు ముందుకు తీసుకొని పోయే వాడు. సృష్టి పరిణామము ఆరు విధాలు జాయతేస్తి పరిణమతే వర్ధ తేక్షీయతే వినశ్యతి అని నిరుక్తములో చెప్పబడినది. జాయతే పుడుతున్నది. అస్థి అస్థిత్వము పొందుతున్నది పరిణమతే పరిణామము పొందుతున్నది వర్ధతే వర్ధిల్లు తున్నది పెరుగుతున్నది క్షీయతే క్షీణిస్తున్నది నశ్యతి నశించుచున్నది అయితే ఈ ఆరు దశలు ఒక దానితో ఒకటి కలసి మెుత్తం మూడుదశలు అవుతున్నాయి. పుట్టుక. అస్థిత్వము, పరిణామము. పొందటము, వర్ధిల్లటము, స్థితి, క్షీణించటము, నశించటము, లయము ఈ దశ లన్నింటికీ కారణము పరబ్రహ్మ.అతడు ఈ దశలలో ఈ జగత్తును ముందుకు తీసుకు పోతున్నాడు. యిలా జరిగిన సృష్టి క్రమంలో మానవులు కొంతమంది పార లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తారు. అటువంటి వారికి తన భక్తులకు జ్ణా నోపదేశం చేస్తాడు ఆజ్ణానులలో అర్హులైన వారికి ముక్తిని ప్రసాదిస్తాడు.ముక్తి అంటే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి నేను, నాది అనే అహంకార, మమకారాలను వదలి పెట్టిన వాడికి అరిషడ్వర్గాలను జయించిన వాడికి ఆత్మసాక్షాత్కారమవుతుందిదాన్నే స్సస్వరూప జ్ణానము అంటారు. అంటే చరాచర జగత్తు తనలోనే వున్నది తనకు ఈ జగత్తులోని మిగిలిన జీవరాశి కి తేడా లేదు. తనలో వున్న తేజస్సే తనలో కూడా వున్నది. ఈ రకంగా జగత్తంతా పరమేశ్వర మయము.అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వాడు బ్రహ్మాత్మ సిద్ధి పొందుతాడు. బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడు అతడికి జననమరణాలు వుండవు అదే సాయుజ్యము, ముక్తి, అని చెప్పబడినది. సృష్టి, స్థితి, లయాదులను చెయ్యటం ద్వారా పరమేశ్వ రుడైన అర్హు లైన తన భక్తు లకు జ్ణానాన్ని ప్రసాదించి వారికి ముక్తిని యిస్తున్నాడుఅందుకే శ్రీ మన్నారాయణుడు నరః అనబడుతున్నాడు. సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
553 వీక్షించారు
#😃మంచి మాటలు విష్ణు సహస్ర నామము నరః నశించనివాడు రఅనగానాశనము నాశనము లేనివాడు. నాశనము లేని చేతనా చేతనములను విభూతిగా గలవాడుప్రాణులను సృష్ట్యా దుల చేత తమ తమ వ్యాపార ములందు ముందుకు తీసుకొని పోయే వాడు. సృష్టి పరిణామము ఆరు విధాలు జాయతేస్తి పరిణమతే వర్ధ తేక్షీయతే వినశ్యతి అని నిరుక్తములో చెప్పబడినది. జాయతే పుడుతున్నది. అస్థి అస్థిత్వము పొందుతున్నది పరిణమతే పరిణామము పొందుతున్నది వర్ధతే వర్ధిల్లు తున్నది పెరుగుతున్నది క్షీయతే క్షీణిస్తున్నది నశ్యతి నశించుచున్నది అయితే ఈ ఆరు దశలు ఒక దానితో ఒకటి కలసి మెుత్తం మూడుదశలు అవుతున్నాయి. పుట్టుక. అస్థిత్వము, పరిణామము. పొందటము, వర్ధిల్లటము, స్థితి, క్షీణించటము, నశించటము, లయము ఈ దశ లన్నింటికీ కారణము పరబ్రహ్మ.అతడు ఈ దశలలో ఈ జగత్తును ముందుకు తీసుకు పోతున్నాడు. యిలా జరిగిన సృష్టి క్రమంలో మానవులు కొంతమంది పార లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తారు. అటువంటి వారికి తన భక్తులకు జ్ణా నోపదేశం చేస్తాడు ఆజ్ణానులలో అర్హులైన వారికి ముక్తిని ప్రసాదిస్తాడు.ముక్తి అంటే విముక్తి. ఐహిక బంధనాల నుంచి విముక్తి నేను, నాది అనే అహంకార, మమకారాలను వదలి పెట్టిన వాడికి అరిషడ్వర్గాలను జయించిన వాడికి ఆత్మసాక్షాత్కారమవుతుందిదాన్నే స్సస్వరూప జ్ణానము అంటారు. అంటే చరాచర జగత్తు తనలోనే వున్నది తనకు ఈ జగత్తులోని మిగిలిన జీవరాశి కి తేడా లేదు. తనలో వున్న తేజస్సే తనలో కూడా వున్నది. ఈ రకంగా జగత్తంతా పరమేశ్వర మయము.అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వాడు బ్రహ్మాత్మ సిద్ధి పొందుతాడు. బృహదారణ్యకోపనిషత్తులో బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి పరబ్రహ్మను గురించి తెలుసుకున్న వాడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ అవుతాడు అతడికి జననమరణాలు వుండవు అదే సాయుజ్యము, ముక్తి, అని చెప్పబడినది. సృష్టి, స్థితి, లయాదులను చెయ్యటం ద్వారా పరమేశ్వ రుడైన అర్హు లైన తన భక్తు లకు జ్ణానాన్ని ప్రసాదించి వారికి ముక్తిని యిస్తున్నాడుఅందుకే శ్రీ మన్నారాయణుడు నరః అనబడుతున్నాడు. సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
584 వీక్షించారు
#😃మంచి మాటలు శ్రీ విద్యా... బ్రహ్మ సూత్రములు బ్రహ్మ సూత్రాలలో అద్వైత పరంగా నిరాకారుడు నిర్గుణుడు పరబ్రహ్మ అని శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించారు. అయితే శ్రీ విద్య బ్రహ్మ సూత్రములలో ఆ పరబ్రహ్మ సాకారంలో త్రిపుర సుందరి. నిరాకారంలో పరాశక్తి. మరణానంతరము భక్తులకు బ్రహ్మ లోకంలో మహ దైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరి. యిదేద్వైతము అర్హులైన జ్ణానులకు సాయుజ్యాన్ని ప్రసాదించేది పరాశక్తి. యిక్కడ జీవాత్మ, పరమాత్మలో లీనమవుతుంది. యిది అద్వైతము ఈ రకంగా పరబ్రహ్మకు సాకార, నిరాకారాలు ద్వైత,అద్వైతాలు రెండూ శ్రీ విద్యా బ్రహ్మ సూత్రములలో ప్రతిపాదించబడుతున్నాయి. నిరాకారుడు,నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం పొందినట్లై తే అదే లలితఅమ్మ వారు సృష్టి ప్రారంభానికి ముందు నిరాకరంగా వున్న ఆ పరాశక్తి సృష్టి చేయాలనే సంకల్పంతో తనను తాను రెండుగా విభజించుకున్నది.వారే లలితా త్రిపుర సుందరి త్రిపుర సుందరులు శివా శివులు పరమేశ్వరీ,పరమేశ్వరులు.శివశక్తులు. అధాతో బ్రహ్మ జిజ్ణాస బ్రహ్మ మును గురించి తెలుసుకోవాలనే కోరిక వివేకాది సాధనా సంపత్తి సిద్ధించిన తరువాత కర్మ ఫలం అనిత్యము అశాశ్వతము మెాక్షము,నిత్యము పరబ్రహ్మయే సత్యము అను తెలిసింది కాబట్టి ముముక్షువు బ్రహ్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు వేద శాస్త్రములే ప్రమాణం ఈ జగత్తు అంతా మిధ్య అంటే యివాళ వుండేదిరేపు వుండనిది పుట్టిన ప్రతీ మనిషి గిట్టకమానదుజీవితం దుఃఖభూయిష్టం సంసారికి దుఃఖాల నుండి నివృత్తి కావాలి. యిది అందరూ కోరేదే అంటే మరణం వుండకూడదు. జననము లేకపోతే మరణం వుండదు. అందుకే జన్మ రాహిత్యం కావాలియిదే మెాక్షంమెాక్షం ఒక్కటే ఈ దుఃఖాలనుంచి రక్షించి మానవుడికి శాశ్వత ఆనందాన్ని యిస్తుంది. పరబ్రహ్మ సాక్షాత్కారమే మెాక్షము యిది జ్ణానము వల్లనే వస్తుంది. జ్ణానాదేవతు కైవల్యం కాబట్టి మెాక్ష సాధనమైన బ్రహ్మాన్ని ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలి అందుకే ఈ బ్రహ్మ జిజ్ణాస అధాతో శ్రీ విద్యా నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతడు గనుక ఒక రూపం ధరిస్తే అదే శ్రీ విద్యలో ప్రతిపాదించిన శివశక్తుల స్వరూపమైన లలితా త్రిపుర సుందరి, లేదా రాజరాజేశ్వరి అని స్థాపించటం కోసం శ్రీవిద్యను వివ రిస్తు న్నారు. సృష్టి ప్రారంభానికి ముందు జగత్తంతా శూన్యంగా వుండేది. ఆశూన్యాన్ని పరబ్రహ్మ తత్త్వం ఆక్రమించివున్నది.అంటే జగత్తంతా పరబ్రహ్మ తత్త్వమే అదే పరాశక్తి. చరాచరా జగత్తులో ప్రతీ జీవిని దేవతలను దానవులను కూడా ఆ పరాశక్తియే సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు కూడా ఆమె సృష్టించినది. అంతే కాదు సదాశివుణ్ణి సృష్టించినది కూడా ఆమె ప్రళయ కాలంలో త్రిమూర్తులు ,త్రిశక్తులు సదాశివుడితో సహా ఆ పరాశక్తిలో లీనమై పోతారు,అప్పుడు మిగిలేది కేవలము పరాశక్తి మాత్రమే ఆ పరాశక్తియే పరబ్రహ్మ ఆమెను గురించి తెలుసుకోవడానికే బ్రహ్మ జిజ్ణాస. కేనో పనిషత్తు యింద్రుడు ఉమాదేవిని ప్రశ్నించాడు. అమ్మా దేవతలనందరినీ భయ భ్రాంతులతో ముంచి వేసిన ఆయక్షుడెవరు ఆతత్త్వము ఏమిటి ఆశక్తియే బ్రహ్మ అని ఉమాదేవి సమాధానము యిచ్చినదిఆ తరువాత యింద్రునితో ఓ దేవేంద్రా బ్రహ్మము వల్లనే కదా మీరు విజయం పొందినది మీ గొప్పదనానికి కారణము బ్రహ్మము మీ అల్ప బుద్ధి వలన యిప్పటి వరకు కను పించిన తత్త్వమే బ్రహ్మమని గుర్తించలేకపోయారు ఆ బ్రహ్మ తత్త్వమే మీ శరీరంలో శక్తిని వ్యాపింపచేస్తోంది దాని వల్లనే మీరంతా అసురులను సంహ రించగలిగారు.అంతేకాని యిదంతా మీ గొప్ప తనమని అహంకరించకండి అని చెప్పి అదృశ్యమై పోయింది. ముందు కనిపించినది పరబ్రహ్మతత్త్వముయిది నిరాకారము. తరువాత కనిపించినదిఉమాదేవి అంటే పరబ్రహ్మ నిరాకారము అదిగనుకఒకఆకారం పొందితే పరాశక్తి. ఆవిడే శ్రీ విద్యా స్వరూపిణీ పరాశక్తి అయిన లలితాంబికఆమెను తెలుసుకో వాలనేఈజిజ్ణాస ఆమె ను సగుణ రూపంగా అంటే లలితా పరమేశ్వరి పరాశక్తి మెాక్షాన్నిచ్చే దేవత ఆమెను గురించి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నము అదే బ్రహ్మ జిజ్ణాస శ్రీ విద్య అనేది ఆత్మ విద్యఅదే బ్రహ్మ విద్య అందులో షోడశీ మహా మంత్రము మెాక్ష కారకము ఆ మంత్రాధి దేవత సాక్షాత్తుపరబ్రహ్మ స్వరూపము ఆవిడే పరాశక్తి. శ్రీ విద్యలో సగుణ బ్రహ్మ అంటే లలితా త్రిపుర సుందరిని ఆరాధించే వారు పంచదశీ మహా మంత్రాన్ని మెక్ష వాదులు ,మహా షోడశీ ని ఉపాసిస్తారు ఆత్మ విద్యా స్వరూపమైన ఆ పరాశక్తిని గురించి తెలుసుకోవాలనేదే ఈ జిజ్ణాస సగుణంలో లలితా త్రిపుర సుందరి నిర్గుణంలో పరాశక్తి ఆవిడే మెాక్షాన్నిచ్చే పరబ్రహ్మ.. సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
1.4K వీక్షించారు
#😃మంచి మాటలు ఆంజనేయ స్వామికి వడమాల ఎందుకు సమర్పిస్తారు? హనుమంతుడికి వనమాల ను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి పసివాడుగా వున్న హనుమంతుడు కనిపించిన ప్రతీ దానిని తినాలనుకుంటాడు..ఆకలిగా వున్న సమయం లో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు. ఆకాశంలో ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతూ వుంటాడు.మరోవైపు గ్రహణం సమీపిస్తూ వుండటంతో రాహువు సైతము సూర్యుడికి అడ్డుగా వస్తూంటాడు. అప్పటికీ ఆకలి మీద వున్న హనుమంతుడు తన త్రోవకు అడ్డు వచ్చిన రాహువును ఒక్కతన్ను తన్ని పక్కకు పంపే స్తాడు. రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న యింద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు .వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగి వచ్చి వాయుదేవున్ని శాంతింప చేసేందుకు ఆంజనేయుడికి తన వద్ద నున్న వరాలను ప్రసాదిస్తారు.ఆ సమయంలో రాహువు సైతం వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారికి రాహు దోషాలు తొలగి పోతాయి అని అందుకే వడలతో చేసిన వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమకు రాహువు వరం బాలహనుమంతుని శౌర్యం చూసిన రాహువు హనుమంతుడిని మెచ్చుకున్నాడు.హనుమంతుడికి ఒక వరం యిచ్చాడు.హనుమంతుని పూజించే వారు రాహువుకు యిష్టమైన మినపప్పుతో చేసిన ఆహారాన్ని హనుమకు నైవేద్యంగా సమర్పిస్తే రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని వర మిచ్చాడు. పాము రూపంలో వడమాల హనుమకు అలా సమర్పించే మినపప్పు ప్రసాదం ఎలా వుండాలో కూడా రాహువు వివ రించాడు అది పాములా అంటే తన శరీరభాగంలావుండాలని రాహువు హనుమంతుడికి వివరించాడు.అందుచేతనే హనుమకు సమర్పించే గారెలు మాలగా చేసి సమర్పించే ఆనవాయితీ వచ్చింది. అందుకనే హనుమాన్ ఆలయాల్లో భక్తులు వడమాలలను సమర్పిస్తారు. హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పిస్తే శని దోషాలు తొలగిపోతాయని అధ్యాత్మిక పండితులు తెలియ చేస్తున్నారు సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
2.4K వీక్షించారు
#😃మంచి మాటలు "శివుడు భస్మ ధారి‘" భస్మము అంటే 'భ "అంటే భత్సార్ణము అంటే నాశనము చేయడము". స్మ "అంటే పాపములను నశింపచేసి భగవంతుడిని జ్ణాపకము చేసేదని అర్ధము,భస్మము అంటే పాపాలను భస్మం చేసేదని చెప్తారు,జీవితంలోని అనిత్యాన్ని "భ "-భస్మం గుర్తు చేస్తూనే వుంటుంది.భస్మమే పరమశివుని స్వరూపమని, దానిని ఉపయెాగించడము వల్లదుఃఖాలు,పాపాలు నశిస్తాయి. త్రినేత్రుడికి భస్మం అంటే చాలా యిష్టం.అందుచేతనేశివయ్యకు అలంకారంగా పరి గణించబడుతుంది. అధ్యాత్మికంగా చూస్తే భస్మం అనేది సృష్టి యెుక్క అంతిమ సత్యాన్ని తెలియ చేస్తుంది. ఈ విశ్వంలో ఏదైనా సరే అది ఎంత గొప్పదైనా అందమైనదైనా,చివరికి మిగిలేది బూడిద మాత్రమే శివుడు స్మశాన వాసి.ప్రళయంతరువాత సమస్తం నశించి పోయిమిగిలిన శుద్ధ మైన పదార్ధమే బూడిద.శివుడు దీనిని ధరించడంద్వారా ఈ భౌతిక దేహంసంపద, పేరుప్రతిష్టలు అన్నీ తాత్కాలికమేతుది సత్యం అశాశ్వతమైనది శాశ్వతమైనది కేవలం ఆత్మ మాత్రమే. ఈ భస్మం వైరాగ్యానికి సంకేతము .మనముదేనినిపట్టుకోకూడదు దేనికి అతుక్కు పోకూడదు అని శివుడు తన రూపము ద్వారా బోధిస్తున్నాడు.అంతే కాక భస్మానికి ఔషధ గుణాలు వున్నాయి.శివుడు ఎప్పుడూ కఠినతపస్సులో వుంటాడు ఆయన ధరించే విభూతి ఆయన శరీరాన్ని బాహ్య శక్తుల నుండి ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత నుండి రక్షిస్తుంది. ఈభస్మం కేవలం బూడిద కాదు. అది అగ్నిలో సంపూర్ణంగా దహనము చేయబడిన పదార్ధముఅంటేఅదికల్మషాలను అహం కారాన్ని పూర్తిగా తగుల బెట్టి పవిత్రతను మాత్రమే మిగుల్చుతుందని అర్ధం శివుడుభస్మమును ధరించటము అంటే ఆయన సమస్త కల్మషాలకు అతీతుడు అని ఆయన పవిత్రతకు నిలువెత్తు నిదర్శనము అని మనము గ్రహించాలి. యిది కేవలము ఆచారంగా కాకుండా జీవితంలో విముక్తిని శుద్ధిని కోరుకునే వారికి ఒకగొప్ప మాార్గ దర్శకం భస్మం దుష్టత్వాన్ని పాపాలను భస్మం చేసి పవిత్రతను ,దివ్యత్వాన్ని. సూచిస్తుంది. శివుడు భస్మధారిగా, కైలాసంలో యెాగిగా సకల ప్రాణులను కాపాడే పరమేశ్వరుడు శివుడు. సర్వతోముఖీ
See other profiles for amazing content