ఫాలో అవ్వండి
sarvathomukhi SATSANGAM
@73047715sarvathomukhi
4,279
పోస్ట్
6,242
ఫాలోవర్స్
sarvathomukhi SATSANGAM
537 వీక్షించారు
11 గంటల క్రితం
#😃మంచి మాటలు శ్రీ శివయెాగిశివాచార్య విరచిత శ్రీ సిద్ధాంత శిఖామణి త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణేనమః త్రై లోక్యసంపద స్వరూపమగు చిత్ర లేఖమునకి గోడ (భిత్తి) వంటివాడును, సచ్చిదానంద స్వరూపుడు ,పరబ్రహ్మ స్వరూపుడు అయిన శివునకు పమస్కారము. ఈ చరా చర జగత్తునకు కారణభూతుడైన ఆ పరమశివునకు నమస్కరించుచున్నాను బ్రహ్మేతి వ్యపదేశస్య విషయం యం ప్రచక్షతే వేదాంతినో జగన్మూలం తం నమామి పరంశివం శివాది భూమ్యంతమగు ముప్పదిఆరుతత్వముల సమూహముచే ఏబ్రహ్మనామకుండగు పరమశివుడు చిత్సముద్రమున తరంగము వలె భావించ బడునో అట్టి అణ వాదిమల త్రయ రహింతంబైన శివనామకమగు మహా సముద్రమునకు నమస్కారము సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
553 వీక్షించారు
1 రోజుల క్రితం
మహిళా దినోత్సవ సమయమున మహా యెాగి నీ జిల్లెళ్ల మూడి అమ్మ నవ్యఆంధ్ర రాష్ట్రపు అధ్యాత్మిక మణులలో జిల్లెళ్ల మూడి అమ్మ అగ్రగణ్యులు. అనేకజన్మల్లో అపారమైన యెాగసాధన.అధ్యాత్మికతఅన్నది వున్నప్పుడే ఆవిడలాంటి జీవితము సాధ్యము. అన్నీ తానై తానే అన్నీ అయి విలసిల్లింది. ఆవిడ దైనందిక జీవితములో పరిపూర్ణ బ్రహ్మత్వానికి ఆ యెాగిని అధ్భుత దర్పణము. లోకంలో సిద్ధ యెాాగులు ,సాధ్య యెాగులు అని రెండు రకాలున్నారు. జిల్లెళ్ల మూడి అమ్మ సిద్ధ యెాగి. సాధ్య యెాగుల జీవితములో సాధనవుంటుంది. దానిద్వారా వారు లోకములో ఎక్కువ ప్రసిద్ధి పొందుతారు.కానీ సిద్ధ యెాగులు జన్మతః యెాగులు వారిజీవితములో సాధన కనిపించదు. అందుకని లోకంలో సాధ్య యెాగులకు వున్నంత ప్రచారము సిద్ధ యెాగులకు కనిపించదు. సంభవామి యుగే యుగే అని భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా అవతరించినట్లే అధ్యాత్మిక రంగంలో సామ్యవాదాన్ని ప్రవేశ పెట్టి సకల జీవ రాశులను కన్న బిడ్డల్లా ఆదరించిన వాత్సల్య వర్షిణి అధ్యాత్మిక యెాగి మహిళ జిల్లెళ్ల మూడి అమ్మ సర్వతోముఖీ #😃మంచి మాటలు
sarvathomukhi SATSANGAM
548 వీక్షించారు
2 రోజుల క్రితం
#😃మంచి మాటలు నరుడు నారాయణుడు సమున్నతమైనభారతీయ అధ్యాత్మికభావ జాలానికి అనాదిగా ఈ పుణ్య భూమిపై దైవతత్వము గురించి న చింతనా స్రవంతికిఆధారభూతమైన వి వేదోపనిషత్తులు,భగవద్గీత ప్రధానముగా నారాయణత్ ప్రాణోజాయతే వాయుర్జోతి రాపః అంటూ సాగే నారాయణోపనిషత్తులో వివరించబడినది .నారాయణుడు విశ్వ చైతన్య శక్తి సకల జీవ రాశులకు కావలసిన ప్రాణ శక్తి, మనస్సు, యింద్రియాలు పంచభూతాలు ఆయన నుండేఉద్భవించాయి. ఆయన నుండేప్రకృతి రూపు దాల్చింది.ఆ పరమాత్మ నుండేవిశ్వంఆవిర్భ వించినది. మనము చూస్తున్న సకల చరాచరజగత్తు నారాయణ శక్తి స్వరూపమే బృహత్ నారాయణ స్వరూపమైన ఈ సృష్టిలో భాగమైన నరుడు పరమాణు సదృశమైన వాడే ఆ దివ్య శక్తి కారణముగా జన్నించి కొంత కాలము జీవించి తిరిగి అందులో లయమైపోవలసినవాడే నరనారాయణుల సంబంధము నీటిమీదపుట్టిన బుడగ అక్కడే కొన్ని క్షణాల పాటు వుండి తిరిగి ఆ నీటిలోనే కలసి పోతుంది. పాంచభౌతికమైన ఈ దేహం కూడా బుడగ లాంటిదే బుడగజీవితకాలము కొద్ది క్షణాలైతే నరుని జీవితకాలం కొన్ని సంవత్సరాలు క్షణ కాలం వుండే ఉద్భుదానికి, సంవత్సరాల తరబడి వుండే నర దేహానికి పోలిక ఎలా కుదురుతుంది. అనే సందేహము కల్గుతుంది. కానీ అనంతమైన కలంతో పోలిస్తే మనిషి వందేళ్ల ఆయుష్షు బుడగ ప్రాయమే అందుకని కొద్ది పాటి జీవిత కాలాన్ని సద్వినియెాగము చేసుకోవాలి. మంచి పనులే చేస్తూ చేసిన కర్మల ఫలితాన్ని పరమాత్మకే అర్పిస్తూ చివరకు ఆ నారాయణుడిలో లయమై పోవాలి. సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
574 వీక్షించారు
3 రోజుల క్రితం
#😃మంచి మాటలు జిల్లెళ్ల మూడి అమ్మ వాక్యము శ్రీమాత విశ్వ మాత.. శ్రీ చక్రము జిల్లెళ్ల మూడి క్షేత్ర శరీరంలో అమ్మకు మూలాధారమై ,స్వాధిష్టానం లో వున్న పృధ్వీ అగ్ని తత్వాలకు సంకేతమేమెా అనిపిస్తుంది నాగేశ్వరాలయము నా గేంద్రుడు అగ్నితత్వమే. అందువల్లనే నాగేశ్వరాలయము వెలసింది మనకందరికీ వెన్నుపాము వుంటుంది.అదే మనశరీరంలోని నరాలన్నింటికీఆధారము మూలాధారము నుండి సహస్రారము దాకా వున్న గ్రంధులన్నీ ఆ వెన్ను పామును ఆధారము చేసుకొని వున్నాయి.మణిపూర, అనాహతాల స్థానములో హైమాలయము వున్నది. అది వాయు తత్వానికి సంకేతము అందువల్లనే యెాగనిష్ణాతమై వాయు తత్వాన్ని నియంత్రించి సర్వాభీష్టాలు నెరవేరతాయి విశుద్ధి ఆజ్ణా చక్రాల స్థానములో అనసూయేశ్వ రాలయము వున్నది.ఆకాశ తత్త్వాన్ని నియంత్రించి మనోతత్త్వాన్ని ఆక్ర మించి హాకినీ, ఢాకినీ,.శక్తిని మిళితము చేసుకొని అర్ధ నారీశ్వరంగా ,అనసూయేశ్వరుని గా దర్శనము ప్రసాదిస్తూ షోడశ దళ పద్మములో నిలచే సిద్ధ మాతయై మన మనస్సులను నియంత్రిస్తుంది. దక్షిణము నుండి ఉత్తరానికి వరుస గా నాగేశ్వరాలయము, హైమా లయము అనసూయేశ్వరాలయము ఈ మూడింటిని పాలిస్తున్న క్షేత్ర పాలిక సహస్రా రములో నిలచిన శుద్ధ చైతన్య శక్తిఅమ్మ. ఈ మూడు ఆలయాలతో ,నవావరణత విలసిల్లేశ్రీచక్రము జిల్లెళ్ల మూడి అయితే అందులోని బిందు స్థానము అమ్మ. అమ్మ శాంత స్వరూపిణీ యైన విశ్వమాత సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
7.3K వీక్షించారు
5 రోజుల క్రితం
#😃మంచి మాటలు యెాగ గణపతి యెాగ సాధనంతా అధ్యాత్మిక విజయము కోసమే యెాగసాధకుల అంతిమ లక్ష్యం ముముక్షుత్వమే కావాలిఅంటుంది శాస్త్రము అది సాధ్యము కావాలంటే మానవశరీరంలోని షట్చక్రాలు ఉత్తేజితం అవ్వాలి అప్పుడేశిరస్సుపై వుండే సహస్రారము ఉత్తేజితమై మెాక్షానికి చేరువ అవుతారు. అయితే ఏ క్రతువు చేసినా తొలిపూజ గణపతికే చెందుతుంది. అలాగే ఈ యెాగ సాధన సైతము గణపతికే చెందుతుందిఅలాగే ఈ యెాగ సాధన సైతము గణపతి అధిష్టానంగా భావించే మూలాధార చక్రంతోనే మెుదలవుతుందని యాజ్ణవల్క్య స్మృతి చెబుతున్నది. త్వం మూలాధారే స్థితోసి నిత్యమ్ త్వం యెాగినో ధ్యాయంతి నిత్యమ్ అంటుంది గణపతి అధర్వ శీర్షం. మానవశరీరములోని మూలాధార స్ధానములో వుండే దైవానివి నీవే యెాగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ వుంటారని భావము.యెాగశాస్త్రంలో గణపతిని మూలాధారచక్రానికి అధిష్టాన దేవతగా భావిస్తారు. మూలాధారము ఉత్తేజితమైనప్పుడు అక్కడి నుంచి పైన వుండే సుషుమ్న నాడి మేల్కొంటుంది,తద్వారా సాధనా క్రమంలో మిగితా ఐదు చక్రాలు ఉత్తేజితము అవుతాయిసుషుమ్న కుయిరు ప్రక్కల వుండే ఇడ, పింగళ నాడులు ప్రధానమైనవి.ఇడ బుద్ధికి పింగళసిద్ధికి సంకేతంగా భావిస్తారు. సుషుమ్న ఎప్పుడూ ఈ రెండు నాడులతోనే కలిసి వుంటుంది మూలాధారము గణపతిఅయితే యిడ, పింగళ సిద్ధి, బుద్ధి అన్న మాట యెాగ సాధనతో శరీరము, మనసు పవిత్రం అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది.ఫలితంగా సిద్ధి కలుగుతుంది సర్వతోముఖీ
sarvathomukhi SATSANGAM
768 వీక్షించారు
7 రోజుల క్రితం
#😃మంచి మాటలు శివుడికి వున్న జానపద పేర్లు హిందూ ధర్మంలో శివుడిని శాస్త్రోక్తంగా మహేశ్వరుడు, పరమశివుడు అని పిలచినప్పటికీ జానపద సాహిత్యం లో మరియు సామాన్య ప్రజల వాడుకలో ఆయనకు చాలా ఆత్మీయమైన ,విభిన్నమైనపేర్లు వున్నాయి. తెలుగు జానపదులు శివుడిని తమ యింటిదైవంగా భావిస్తూ పిలుచుకొనే కొన్నిపేర్లు మల్లి కార్జునుడు శ్రీశైల క్షేత్రంలో వెలసిన శివుడిని భక్తులు ఎంతోయిష్టంగామల్లన్న అని పిలుచుకుంటారు తెలంగాణా ,ఆంధ్ర ప్రాంతాలలోని యాదవులు కురుములు శివుడిని కురుమ మల్లన్న లేదా కొమురవెల్లి మల్లన్న అని పిలుస్తారు. బోళా శంకరుడు భక్తులు అడిగిందే తడువుగా వరాలిచ్చే భోళామనిషిగా శివుడిని బోళా శంకరుడు అని పిలుస్తారు జంగమయ్య శివుడు భిక్షాటన చేస్తూ తిరిగే వేషంలో వున్నప్పుడుజానపదులు ఆయన్ని జంగమ దేవర జంగమయ్యఅని పిలుస్తారు కిరాతార్జునుడు అడవిలో వేటగాడి వేషంలో వున్న శివుడిని జానపదకథల్లో కిరాతుడు అని వ్యవహరిస్తారు లింగమయ్య లింగరూపంలో వున్న స్వామిని సామాన్యుడు ప్రేమతో లింగన్న లేదా లింగమయ్య అని సంబోధిస్తారు జానపద సాహిత్యంలో శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఒక రైతుగా. ఒకకూలీగా కష్టాల్లో వున్న వారిని ఆదుకునే తోటి మనిషిగా కనిపిస్తాడు సర్వ తో ముఖీ
sarvathomukhi SATSANGAM
707 వీక్షించారు
9 రోజుల క్రితం
#😃మంచి మాటలు విష్ణు సహస్రనామము జ్యోతిర్గణేశ్వరః నిత్య సూరులకుఈశ్వరుడు జ్యోతిర్గణాలకు ఈశ్వరుడు నిత్య సూరి గణానాం యఃఈశో జ్యోతిర్గణేశ్వరః జ్యోతిర్గణము అంటే అనంతుడు గరుడుడు మెుదలైన పరమభక్తులువీరందరికీ ప్రభువు. జ్యోతిర్గణస్యఈశ్వరః జ్యోతిర్గణేశ్వరః జ్యోతిర్గణముఅంటే పరిచారికా గణము వారికి ఈశుడు ప్రభువు జ్యోతిషా గణానాం ఈశ్వరః సూర్యుడు మెుదలైన జ్యోతిర్గణాలకు అధిపతి పరమాత్మ స్వయం ప్రకాశి. ఆ పరమేశ్వరునిఆశ్రయంగా చేసుకొనే మిగిలిన గ్రహాలన్నీ కాంతులను ప్రసరింప చేస్తున్నాయి. చంద్ర, సూర్యాగ్నులు అతని సహాయం వల్లనే ప్రకాశిస్తున్నాయి వారి వల్లనే ఈ జగత్తు అంతా ప్రవర్తిల్లుతున్నది.కాబట్టి ఈ రకమైనగణా లన్నింటికీ శ్రీ మన్నారాయణుడే ప్రభువు బృహదారణ్యకోపనిషత్తు లోకాలన్నీ పగటి పట సూర్యుని వెలుగు లతోనూ ,రాత్రిపూట చంద్రుని వెలుగులతోనూ సంధ్య వేళల యందు అగ్ని యెుక్క వెలుగు లతోనూ ప్రవర్తిల్లుతున్నాయి చంద్రసూర్యాగ్నుల తేజస్సు ఆ పరమేశ్వరుని నుండే వచ్్చింది అందుచేతనే అతడు జ్యోతిర్గణేశ్వరః అనబడుతున్నాడుఅంటూ లక్ష్మీపతిత్వాన్నివివరించాడు రత్నాకరుడు సర్వతో ముఖీ
See other profiles for amazing content