Follow
గోపు వెంకటరమణ
@a9627557_9848949422
53
Posts
77
Followers
గోపు వెంకటరమణ
1.2K views
1 months ago
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి "జాయినింగ్స్ కమిటీ" సభ్యునిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు మరియు సామాజికవేత్తలును ఆహ్వానించి చేరికలను సమన్వయం చేసేందుకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు "జాయినింగ్స్ కమిటీ"ని నియమించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి సభ్యునిగా బాధ్యతలు అప్పగిస్తూ అధినేత నిర్ణయం తీసుకున్నారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
గోపు వెంకటరమణ
1.6K views
1 months ago
• ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోపన్యాసం చేశారు. అందుకు సంబంధించిన ముఖ్యాంశాలు: • 2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం, పదవులు అనే ఆలోచన లేదు. దేశానికి ఏం చేయాలి.. దేశ సమైక్యతను, సమగ్రతను ఎలా కాపాడాలి అనే ఆలోచనతోనే జనసేన ప్రస్థానం మొదలయ్యింది. • పార్టీ సిద్ధాంతాలు, భావజాలం బలపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది జనసేన భావ జాలం బలంగా ముందుకి వెళ్తుందనడానికి సంకేతం. • జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. • తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన పార్టీ వ్యతిరేకించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరునే తప్పుబడుతూ వచ్చాం. విభజన చేసిన తీరులో లోపాల కారణంగా ఈనాటికీ ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉన్నాయి. • ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పదనం. ఈ నేల త్యాగాలకు ప్రతీక, పాలనకు ప్రతిరూపం. రాజ్యాంగ విలువలకు ప్రతిబింబం. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. ఇలాంటి గొప్ప నేలలో దేశ సమగ్రత కోసం పెట్టిన సమావేశం ద్వారా జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే ఉద్దేశం. • చలి చీమలు కూడా పాముని చంపేస్తాయన్నట్టు- చెడు అయినా మంచి అయినా దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన పార్టీ ఉపేక్షించదు. అలాంటి వారిపై జనసేన గళం బలంగా ఉంటుంది. • ఢిల్లీకి జనసేన పార్టీ ఎప్పుడూ అధికారం కోసం, పదవుల కోసం, ప్రాపకాల కోసం ఉపయోగించుకోదు. దేశ భక్తి, దేశ సమగ్రత, సమైక్యత కోసం మాత్రమే దేశ రాజధాని బాట పడతాం. • ⁠పార్టీ ఎంపీలు కూడా దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యల మీద మాట్లాడాలి అని అన్నారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
గోపు వెంకటరమణ
559 views
1 months ago
ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు! ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే "సేన ప్రస్థానం - జాతీయ సమైక్యత కోసం" కార్యక్రనానికి విచ్చేయుచున్న ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ విమానాశ్రయంలో MLA శ్రీ పంతం నానాజీ గారు సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు జనసేన పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఘన స్వాగతం పలికారు. #✡జనసేనాని పవన్ కళ్యాణ్
గోపు వెంకటరమణ
803 views
2 months ago
*2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు* #✡జనసేనాని పవన్ కళ్యాణ్
గోపు వెంకటరమణ
3.9K views
2 months ago
ఢిల్లీలోని ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని మోడీ గారిని సత్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🔥 #✡జనసేనాని పవన్ కళ్యాణ్