ఫాలో అవ్వండి
𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
@gmanmadha
20,475
పోస్ట్
23,239
ఫాలోవర్స్
𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
1.9K వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ జలుమూరు: ప్రభుత్వ పాఠశాలల్లో కార్టూన్ చలన చిత్రాల ప్రదర్శన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కార్టూన్ చలనచిత్రాన్ని ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జలుమూరు మోడల్ పాఠశాలలో 'జంగిల్ బుక్' కార్టూన్ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. ఉపాధ్యాయుడు మెండ రామారావు మాట్లాడుతూ, శనివారం 'నో బ్యాగ్ డే' సందర్భంగా విద్యార్థులకు వినోదం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అలాగే క్రీడలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. #🌊మన కోస్తాంధ్ర #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #👶కిడ్స్ ఎడ్యుకేషన్🎰 #📖ఎడ్యుకేషన్✍
𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
499 వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: డీఎస్పీ పైల సుందర్రావుకు ఘనంగా స్వాగతాంజలి నరసన్నపేట మండలం రావులవలస గ్రామానికి చెందిన పైల సుందర్ రావు ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ పరీక్షలలో డిఎస్పీగా ఎంపికయ్యారు. ఉదయం ఆయన తన గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సుందర్ రావు విజయం సాధించడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. #🌊మన కోస్తాంధ్ర #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ
𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
518 వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ జలుమూరు: రక్షణ గోడ విరిగింది.. ప్రమాదాలకు ఎదురుచూస్తుంది నరసన్నపేట నుండి జలుమూరు వెళ్లే రహదారిలో వంశధార ఎడమ కాలువపై నిర్మించిన రక్షణ గోడ కూలిపోవడంతో వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కరవంజ సమీపంలోని తమ్మయ్యపేట గ్రామ వద్ద ఈ వంతెన వద్ద ఈ దుస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. #🟨నారా చంద్రబాబు నాయుడు #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡నారా లోకేష్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
𝐌𝐚𝐧𝐦𝐚𝐝𝐡𝐚
715 వీక్షించారు
#📰ఈరోజు అప్‌డేట్స్ నరసన్నపేట: వంశధార కాలువకు గండి.. వృధాగా పోతున్న నీరు నరసన్నపేట మండల కేంద్రంలోని జమ్మూ కూడలి వద్ద ఉన్న ఎన్బిసి వంశధార కాలువకు ఆదివారం ఉదయం గండి పడినట్లు ఏఈ సిల్లా హరీష్ కుమార్ తెలిపారు. ఈ సమస్యను ఈఈ మురళీమోహన్ దృష్టికి తీసుకెళ్లగా, మరమ్మత్తులకు త్వరితగతిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ గండి కారణంగా కాలువలో నీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది.
See other profiles for amazing content