Follow
కిషోర్ గునుకుల
@kishoregunukula
1,840
Posts
1,401
Followers
కిషోర్ గునుకుల
333 views
2 hours ago
వెంకటేశ్వర స్వామివారి పట్ల భక్తి, శరణాగతి వ్యక్తం చేసే పవిత్ర నామస్మరణ గోవింద నామాల అపహాస్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం — హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి నెల్లూరు,వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన #JanaSena నాయకులు #KishoreGunukula నెల్లూరు: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి “గోవింద నామాలను” అపహాస్యం చేస్తూ, వివిధ మతాలకు చెందిన వ్యక్తులతో రాజకీయ కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలపై జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, హిందూ బంధువుల మనోభావాలను గౌరవిస్తూ శ్రీ #pawanKalyan గారి సూచనల మేరకు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, మల్లికార్జున్ యాదవ్, ప్రవీన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుధామాదవ్ తదితరులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐని కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు #కిషోర్_గునుకుల మాట్లాడుతూ: #govinda #ttd #PawanKalyanAneNenu #SanatanaDharma #Nellore #AndhraPradesh ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
589 views
1 days ago
మా జనసేన ప్రస్థానం | ఆగష్టు 11, 2023 కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, పంచాయతీ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత — అక్రమ ఆక్రమణలు, భూదందాలు, బెదిరింపులపై జనసేన రాజీలేని పోరాటం చేస్తుంది. ప్రజల హక్కుల కోసం… ప్రజల తరఫున నిలబడతాం! ✊ — గునుకుల కిషోర్ జనసేన పార్టీ, నెల్లూరు #KishoreGunukula #janasena #PeopleFirst #JanaSenaParty #JSPNellore @PawanKalyan @JanaSenaParty #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
కిషోర్ గునుకుల
592 views
2 days ago
జనసేన అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు” కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్ రాంజీ నగర్ లో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం శనివారం కూడా ఉత్సాహంగా కొనసాగింది. #KishoreGunukula - #JanaSena #JanaSenaParty ఈ సందర్భంగా పలువురు గృహస్థులను కలుసుకున్న జనసేన నాయకులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని ప్రజలను కోరారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీ Dr. #PonguruNarayana గారి నాయకత్వంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కిషోర్ గునుకుల తెలిపారు. రోడ్లు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమం తదితర రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు. నెల్లూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వానికి ప్రజల సహకారం, మద్దతు అవసరమని, అభివృద్ధి నిరంతరంగా కొనసాగేందుకు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, విజయలక్ష్మి,శ్రీమతి చల్లా కవిత, ప్రశాంత్ గౌడ్, నరహరి, శివ,మహెష్,నాని తదితరులు పాల్గొన్నారు.. #PawanKalyanAneNenu #Nellorecity #Andhrapradesh #DoortoDoorCampaign ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
675 views
2 days ago
నెల్లూరు: సంతపేట మెట్లదేవు రాగిచెట్టు సెంటర్‌లో గత నాలుగు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు రజని, విజయమ్మతో పాటు స్థానిక మహిళలు, భక్తులతో కలిసి జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి దంపతులు బోనాల కార్యక్రమంలో, అమ్మవారికి చీర సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. — #KishoreGunukula #JanaSenaParty , నెల్లూరు ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, దైవభక్తి, ఆధ్యాత్మికత సమాజంలో సానుకూలతను పెంపొందించడంతో పాటు చెడు అలవాట్లకు, దుష్ప్రవర్తనకు దూరంగా ఉండేలా ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. గతంలో రాగిచెట్టు సెంటర్‌కు రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కనకదుర్గమ్మవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థానిక నాయకులతో మాట్లాడి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని కిషోర్ గునుకుల తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భక్తులు మరియు స్థానిక ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. అలాగే కనకదుర్గమ్మవారి ఆలయ నిర్మాణం/పునర్నిర్మాణానికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి Dr. #PonguruNarayana గారి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. బోనాల కార్యక్రమం సంతపేట మెట్లరేవు నుంచి ప్రారంభమై, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా రాగిచెట్టు సెంటర్‌కు చేరుకుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, చీర సమర్పణ నిర్వహించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కిషోర్ గునుకుల మాట్లాడుతూ, తనకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతంలో భక్తుల మధ్య దంపతిసమేతంగా అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పవిత్రమైన గోవింద నామాలను అవహేళన చేసేలా లేదా వికృతంగా పలికేలా చేసిన ఏ చర్యనైనా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భిన్న మతాల పట్ల పరస్పర గౌరవం, విశ్వాసాల పట్ల మర్యాదే మన సమాజానికి బలం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్, రవితేజ, ప్రియాంక, నిర్వాహకులు రజని, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.. Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Shatagni Naga Babu Nadendla Manohar #PawanKalyanAneNenu #Govindha #Andhrapradesh #SanatanaDharma #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
కిషోర్ గునుకుల
811 views
2 days ago
మన నమ్మకాలు, భక్తి విశ్వాసాలను ముందుకు తీసుకెళ్లే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. — #KishoreGunukula #JanaSenaParty , నెల్లూరు సంతపేట మెట్లరేవులో నిర్వహించిన శ్రీ కలకదుర్గమ్మవారి బోనాల కార్యక్రమం, ఆషాఢ మాస చీర సమర్పణ కార్యక్రమంలో పుట్టిపెరిగిన ప్రాంతం తో ఆడపడుచులతో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉంది. #PawanKalyanAneNenu #Govindha #Andhrapradesh #SanatanaDharma ##janasena ##pawankalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కిషోర్ గునుకుల
4.1K views
2 days ago
సనాతన ధర్మాన్ని అవమానపరుస్తూ, పవిత్రమైన గోవింద నామాలను అపవిత్రం చేసి, అన్యమతస్థులతో వికృతంగా ఆలపించిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులైన వైసీపీ నాయకులు హిందూ బంధువుల మనోభావాలను గౌరవించి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సనాతన ధర్మ విశ్వాసాలను, భక్తుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పవిత్రమైన గోవింద నామాలను అవహేళన చేసేలా లేదా వికృతంగా పలికేలా చేసిన ఏ చర్యనైనా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భిన్న మతాల పట్ల పరస్పర గౌరవం, విశ్వాసాల పట్ల మర్యాదే మన సమాజానికి బలం. — కిషోర్ గునుకుల జనసేన పార్టీ, నెల్లూరు #KishoreGunukula #trendingreels #trending #janasena #JanaSenaParty #SanatanaDharma #govinda Pawan Kalyan JanaSena Party #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
కిషోర్ గునుకుల
589 views
3 days ago
నెల్లూరు: జనసేన "అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు" కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు కూడారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో #JanaSenaParty నాయకులు కిషోర్ గునుకుల,వారి సతీమణి,ఎఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. #PawanKalyanAneNenu #KishoreGunukula #Nellorecity #Andhrapradesh #PawanKalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##pawankalyan ##janasena
కిషోర్ గునుకుల
2.2K views
4 days ago
శ్రీ #PawanKalyan గారి ప్రజాహిత పాలన – శ్రీ Dr. #PonguruNarayana గారి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" నినాదంతో #JanaSenaParty మూడవ రోజు ఇంటింటి ప్రచారంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల,శ్రీమతి గునుకుల విజయలక్ష్మి నెల్లూరు: "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పదహరో డివిజన్‌లో విస్తృత ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారం రాంజీనగర్ 4వ వీధి, 5వ వీధి మధ్య ఉన్న దీపం ఇళ్ల ప్రాంతంలో సాగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వంలో నగరంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, #DeputyCMOPawanKalyan శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గత రెండేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాకేంద్రీకృత నిర్ణయాలు, పారదర్శక పాలన, ప్రజలకు చేరువైన సంక్షేమ కార్యక్రమాలు మరియు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, శ్రీమతి గునుకుల విజయలక్ష్మి, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, మోహన కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నరహరి, శివ తదితరులు పాల్గొన్నారు. #KishoreGunukula #PawanKalyan #PawanKalyanAneNenu #Nellorecity #Andhrapradesh #Trending #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ##janasena ##pawankalyan
కిషోర్ గునుకుల
515 views
4 days ago
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి సందర్భంగా వినమ్ర నివాళులు. "జన గణ మన" రచయిత, నోబెల్ గ్రహీత, మహాకవి ఠాగూర్ గారి దేశభక్తి, మానవతా విలువలు తరతరాలకు స్ఫూర్తి. ఆయన ఆశయాలను ఆచరిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుదాం. – కిషోర్ గునుకుల జనసేన #KishoreGunukula #JanaSena #PawanKalyan #PeopleFirst #RabindranathTagore #JanaGanaMana ##pawankalyan ##janasena #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్