#🚨ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్ హై అలెర్ట్ #📰జాతీయం/అంతర్జాతీయం #🌍నా తెలంగాణ #🆕Current అప్డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 ఢిల్లీ పేలుళ్లతో హైదరాబాద్ హై అలెర్ట్.. సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. సోమవారం (నవంబర్ 10, 2025) ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడుతో దేశమంతా ఉలిక్కిపడింది. 13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. సోమవారం (నవంబర్ 10, 2025) ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక కారులో బాంబు పేలింది. ఇది తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఎనిమిది మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని LNGP ఆసుపత్రిలో చేర్చారు. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలోని అనేక వాహనాలకు నిప్పు అంటుకుంది. అనేక ఇతర వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పేలుడు తర్వాత, పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు. ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా 6.45నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు. కానీ, భారీ పేలుడు జరిగడంతో ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. మెట్రో స్టేషన్ గేట్-1పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన పదినిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్కు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. కాగా, మరణాల సంఖ్య 8కి చేరింది. 20మందికిపైగా గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..