Follow
Sąíkűmąŕ $@i
@sai_9143134
2,465
Posts
3,095
Followers
Sąíkűmąŕ $@i
513 views
15 hours ago
కొత్త రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి AP: మాజీ MP విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ కొత్త పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసేలా కొత్త పార్టీని నడిపిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ లో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. ఈ నెలలో విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి భవిష్యత్ రాజకీయ ప్రణాళిక వివరిస్తానని తెలిపారు.#news #apnews #sharechat
Sąíkűmąŕ $@i
570 views
4 days ago
*రష్యాలో ఎత్తైన పర్వతంపై జాతీయజెండా ఎగురవేసిన ఏపీ పోలీస్‌* * 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు రష్యాలోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి, 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఏలూరు రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ సబ్-ఇన్‌స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు, రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఉదయం పతకాన్ని ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు. తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి అంకితం చేశారు వెంకటేశ్వరరావు.#news #sharechat #apnews
Sąíkűmąŕ $@i
7K views
5 days ago
*ఇండిగో విమానం రద్దు: లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మహిళ నిరసన* * అత్యవసరంగా వెళ్లాల్సిన సమయంలో ఇండిగో విమానం రద్దవడంతో ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. #news #sharechat
Sąíkűmąŕ $@i
532 views
6 days ago
*అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌పై దాడి* * నాందేడ్‌: శిరోమణి అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌పై దాడి జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురుద్వారా వద్ద నిహంగ్‌ గ్రూప్‌నకు చెందిన వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌తోపాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడ్డారు. #news #sharechat
Sąíkűmąŕ $@i
603 views
8 days ago
గౌతమ్ అదానిపై అమెరికా సైబర్‌క్రైమ్ ఏజెన్సీ (అంటే DOJ) చేత పెట్టిన మోసం, వేలం భ్రష్టాచారం కేసుల్ని ఒక US ముఖ్య న్యాయమూర్తి రద్దు చేశారు. ఈ నిర్ణయంపై జడ్జి గరాఫిస్ డిపార్ట్మెంట్ ఆచరణపై ప్రగాఢ విమర్శలు చేశారు, ముఖ్యంగా ట్రెంట్ మెక్‌కాటర్ చర్యలను తక్కువ అధికారులు, FBI/SEC సలహా లేకుండా తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. అదానీ ఢిల్లీ సంస్థ అధ్యక్షుడు ఈ తీర్పు‌పై సంతోషం వ్యక్తం చేసి, న్యాయ ప్రక్రియ పట్ల గౌరవం తెలిపాడు. కేసు నుంచి బయటపడటానికి అదానీ 100 కోట్ల డాలర్ల (సుమారు $10 బిలియన్) అమెరికా పెట్టుబడి ప్రతిజ్ఞ విషయాన్ని చెప్పారు; జడ్జి ఆ పెట్టుబడి నిర్ణయంపై ప్రభావం చూపనందున తీర్పు తీసుకున్నట్లు నిర్ధారించారు కాని ప్రజలకు దీని ప్రభావాన్ని స్వయంగా అంచనా వేయమనీ సూచించారు. అదానీ పై ఉన్న నిదర్శనాత్మక సివిల్ పిల్లింపులు కొన్నశాతం పరిష్కారం పొందగా, ఆపరేషన్‌ల తీరును ఇది నేను తేల్చుకోలేదు అన్నారు.#news #sharechat