ఫాలో అవ్వండి
Sekhar Digitals & Reporter 9603197203
@sekhar9603197203
3,307
పోస్ట్
14,205
ఫాలోవర్స్
Sekhar Digitals & Reporter 9603197203
570 వీక్షించారు
14 గంటల క్రితం
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *డ్వాక్రా నిధుల రక్షణకు కొత్త యాప్* AP: డ్వాక్రా సంఘాల్లో నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం 'మన డబ్బులు-మన లెక్కలు' యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బ్యాంకు లింకేజి, స్త్రీనిధి రుణాల వివరాలు ఆన్లైన్లో నమోదవుతాయి. *గతంలోని చేతిరాతల విధానానికి స్వస్తి చెప్పి, డిజిటలైజేషన్ చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.* జిల్లాలోని వేలాది సంఘాల సభ్యులకు ఈ కొత్త విధానం ద్వారా ఆర్థిక భద్రత చేకూరనుంది.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
543 వీక్షించారు
15 గంటల క్రితం
#😋ఇష్టమైన ఫుడ్ రెసిపీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🍱ఆంధ్రా స్పెషల్ రెసిపీస్ #🥘బిర్యాని🍖 #🍗నాన్ వెజ్ రెసిపీస్ *ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాబా నందు అన్ని రకముల బిర్యానీలు లభించును..* ప్రతి రోజు మా దాబా నందు మిక్స్డీ మొగలాయి బిర్యాని లభించును... కాశివారితూము బైపాస్ రోడ్డు - ముమ్మిడివరం... *ప్రొప్రైటర్ :- శేఖర్* 📲..94929 49257 __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
513 వీక్షించారు
16 గంటల క్రితం
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ *అంగన్వాడీ సహాయకుల పోస్టు ఎంపిక కొరకు జారీచేయబడిన ప్రకటన..* *ఖాళీల వివరాలు..* ముమ్మిడివరం మండలం కాట్రేనికోన మండలం ఐ..పోలవరం మండలం __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
504 వీక్షించారు
3 రోజుల క్రితం
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻 *పద్నాలుగు ఓట్లతో గెలిచిన సర్పంచ్* *కాని పదవి అయిపోయింది* *ఆసక్తికరమైన ఈ సంఘటన గురించి తెలుసుకోండి...* సాలువాలు, పూలమాలలతో విజయ దరహాసంలో ఉన్న ఈయన పేరు పెద్దిరెడ్డి వెంకట కృష్ణారావు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక సర్పంచిగా 14 ఓట్ల మెజార్టీతో సోమవారం(ఏప్రిల్ 13) గెలుపొందారు. ఇదేంటి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఏమి జరగలేదు కదా అనుకుంటున్నారా...? అవును నిజమే కాని ఈయనను అయిదేళ్ళ క్రితమే ఓటర్లు గెలిపించారు. కాని ఎన్నికల అధికారులు ఓడించారు. తీరా ఇప్పుడు గెలిచాక ప్రమాణ స్వీకారం చేద్దామంటే పదవి అయిపోయింది. అత్యంత అరుదైన ఈయన ఓటమి...గెలుపు గురించి తెలుసుకుందాం. 2021 ఫిబ్రవరి21 గాడిలంక అనే చిన్న గ్రామంలో సర్పంచ్ పదవికి వైకాపా మద్దతు దారుడుగా పెద్దింటి నాగమునీంద్రరావు పోటీ చేయగా ఇదే ఇంటిపేరు కలిగిన వెంకట కృష్ణారావు టిడపి మద్దతుతో ఫొటీ చేసారు. వీరిలో మునీంద్రరావు పది ఓట్లు ఆధిక్యతతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటిస్తూ ద్రవ పత్రం జారీచేసారు.మొత్తం 982 ఓట్లు పోలవ్వగా మునీంద్రరావుకు 472 ఓట్లు, వెంకటకృష్ణారావు కు 462 ఓట్లు, చెల్లనవి 19,నోటాకు 29 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్ లో తేడా జరిగాయని అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రీకౌంటింగ్ జరపాలని వెంకటకృష్ణారావు అప్పుడే పట్టు పట్టారు. కాని అధికారులు రీకౌంటింగ్ కు నిరాకరించారు. మునీందరరావవునే సర్పంచ్ గా నిర్ధారించి ప్రమాణ స్వీకారం చేయించారు. అయినప్పటికీ కృష్ణారావు పట్టువదలని విక్రమార్కుడిలా నాయిస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటినుంచి వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. చివరికి సోమవారం ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి తీర్పునిచ్చింది. తిరిగి ఈ ఓట్లు లెక్కింపు నిర్వహించగా 25 చెల్లని ఓట్లును మునీంద్రరావుకు కలిపినట్లు గుర్తించారు. అలాగే చెల్లని ఓట్లు గా గుర్తించిన వాటిలో ఒక ఓటు కృష్ణారావుకు వచ్చింది. దీంతో మొత్తం 14 ఓట్లతో ఆయన గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. *కృష్ణారావు సర్పంచ్ గా గెలిచినట్లు కోర్టు తీర్పు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది.* ఎందుకంటే ఈనెల 2తో సర్పంచుల పదవీ కాలం పూర్తయిపోయింది. ఓడిపోయిన మునీందర రావు ఐదేళ్లపాటు ఎలాంటి అంతరాయం లేకుండా సర్పంచ్ పదవిలో కొనసాగారు. అందువల్ల వెంకటకృష్ణారావుకు కనీసం సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. దీంతో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు కృష్ణారావుకు శాలువాలు, పూలమాల వేసి సత్కరించి అభినందించారు. *ఎన్నికల అధికారులపై చర్యలు ఉండవా..?* గాడిలంక సర్పంచ్ ఎన్నికల కోర్టు తీర్పు అనంతరం అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సమయంలో తప్పులు చేసిన అధికారులపై ఇప్పుడు చర్యలు ఉండాలని చాలామంది పట్టుపడుతున్నారు. కాని ఉండవనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల చట్టంలో అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్-1 అధికారికి ఈ చెల్లని ఓట్ల తిప్పలు ఎప్పుడూ ఉంటాయి. బ్యాలెట్ పై ఓటు వేసే సమయంలో కొందరు ఓటర్లు తగిన అవగాహన లేక రకరకాల తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు నిర్ధారించడం తలకి మించిన భయారమే. అది ఎలాగంటే క్రికెట్‌లో ఎంపైర్ మాదిరిగా ఉంటుంది.గతంలో మూడవ ఎంపైర్ లేనప్పుడు ఇలాంటి వివాదాలే జరిగేవి. ఎన్నికల అధికారుల పరిస్థితి కూడా దాదాపు అంతే.ఈ చెల్లని ఓట్లు చాలా వివాదాలకు దారితీస్తుంటుంది.అందువల్లనే కొన్ని పెద్ద పంచాయతీలలో కౌంటింగ్ పక్రియ రెండు రోజులు కూడా పడుతుంది. అయితే ఇలాంటి చిన్న పంచాయతీలో ఇన్ని ఓట్లు తేడా రావడంలో అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది.అందుకునే జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ఈవీఎం మిషన్ లు వినియోగించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. కేవలం గ్రామ పంచాయతీ,ఎంపిటీసి, జెడ్పిటీసీ ఎన్నకల్లోనే ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. వాటికి కూడా ఇవీఎం మిషన్ లు అందుబాటులోకి తీసుకు రానున్నారు. వీటిలో మోసాలు జరగాయని చర్చ జరగడానికి అవకాశాలు ఉండవు.ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు.కేవలం రోజుల వ్యవధిలో గుర్తుల కేటాయింపు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. దీనివల్ల వెంకటకృష్ణారావు మాదిరిగా గెలిచి ఓడిపోయే పరిస్థితులు ఉండవు. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
3.7K వీక్షించారు
4 రోజుల క్రితం
#భక్తి #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #😇శివ లీలలు✨ #🛕శివాలయ దర్శనం *చిన్న కాశీ కుండలేశ్వరంకు చేరని ఆర్టీసీ.. భక్తుల పాట్లు పట్టవా..???* *ఇప్పుడు రోడ్డు బాగుంది,మరి బస్సు ఎప్పుడు వస్తుంది..???* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా దర్శించుకోవాల్సిన పరమ పవిత్ర క్షేత్రం, 'దక్షిణ కాశీ'గా ప్రసిద్ధి చెందిన కుండలేశ్వరం నేడు రవాణా సౌకర్యాలు లేక వెలవెలబోతోంది.. ఒకప్పుడు అమలాపురం డిపో నుండి క్రమం తప్పకుండా నడిచిన బస్సు సర్వీసు నేడు రోడ్డు మరమ్మతుల సాకుతో నిలిపివేయడంతో యాత్రికులు, స్థానిక పరిసర గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.​కోనసీమలోని *కాట్రేనికోన మండలంలో వృద్ధ గౌతమి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయానికి పురాణ ప్రాశస్త్యం మెండు.* నిత్య పుష్కరాలు నిలయంగా ఉంది. హనుమంతుడు తన చెవి కుండలాలను ఇక్కడ శివుడికి సమర్పించాడని, అందుకే ఈ స్వామికి 'కుండలేశ్వరుడు' అని పేరు వచ్చిందని ప్రతీతి.కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునే ముందు ఇక్కడ వృద్ధ గౌతమిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని ఆధ్యాత్మిక వేత్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు వంటి వారు ప్రబోధించడంతో ఇటీవల కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే ఏడాది పొడవునా పుష్కర స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని వ్యాస మహర్షి వరం ఇచ్చారని భక్తుల నమ్మకం. బస్సు రాదే​గతంలో రోడ్డు అధ్వాన్నంగా ఉందన్న కారణంతో అమలాపురం డిపో అధికారులు బస్సు సర్వీసును నిలిపివేశారు. అయితే, ఇటీవల ఆ రోడ్డుకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇప్పుడు బస్సు నడపడానికి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేవని స్థానికులు వాపోతున్నారు..బస్సు లేకపోవడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. *అధిక ధరలు వెచ్చించి ప్రయాణించడం సామాన్య భక్తులకు భారంగా మారింది.* గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు పనుల నిమిత్తం అమలాపురం వెళ్లాలంటే సరైన రవాణా లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.​పుష్కరాల సమయంలోనే కాకుండా, కార్తీక మాసం మరియు ప్రతి సోమవారం ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రానికి బస్సు సర్వీసును పునరుద్ధరించడం కేవలం భక్తుల సౌకర్యార్థమే కాకుండా, ఆర్టీసీకి కూడా లాభదాయకమని అందరూ భావిస్తున్నారు."రోడ్డు సరిగా లేదని బస్సు ఆపారు.. ఇప్పుడు రోడ్డు బాగుంది, మరి బస్సు ఎప్పుడు వస్తుంది..?" అని కుండలేశ్వరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. స్వర్గీయ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి జీవించి ఉన్న రోజులలో కుండలేశ్వరం బస్సు పునరుద్ధరించకపోతే జన్మభూమి కార్యక్రమం బహిష్కరిస్తామన్న గ్రామస్తులు ప్రకటనలను ఢిల్లీలో ఉన్న బాలయోగి వార్తాపత్రికల్లో చదివి వెంటనే స్పందించి తెల్లారేసరికి రాజమండ్రి నుండి ఆర్టీసీ ఉన్నతాధికారులను పంపించి బస్సు నడిపించారని స్థానికులు ఆనాటి సంఘటనలను పేర్కొంటున్నారు. సమస్యలపై స్పందించే బాలయోగి లాంటి నాయకులు నేడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అమలాపురం - కుండలేశ్వరం మార్గంలో బస్సు సర్వీసులను ప్రారంభించి, భక్తుల 'చిన్న కాశీ' దర్శనాన్ని సులభతరం చేయాలని కోరుతున్నారు.* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
501 వీక్షించారు
5 రోజుల క్రితం
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 *పత్రికాప్రకటన* *విద్యుత్ సరఫరాకు అంతరాయం* విద్యుత్ వినియోగదారులకు విజ్నప్తి. ది: 18-03-2026 న శనివారం ఉదయం 09:00 గంటలు నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు ముమ్మిడివరం సబ్ స్టేషన్ మరమ్మత్తుల కొరకు ముమ్మిడివరం మండలం అంత విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గ్రహించి డిపార్ట్మెంట్ వారికి సహకరించవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు కె.రాంబాబు ఎగ్జిక్యూటివ్ఇంజినీర్ అమలాపురం.
Sekhar Digitals & Reporter 9603197203
984 వీక్షించారు
5 రోజుల క్రితం
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻 *..ఏపీ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్..* మొత్తం 2.89 కోట్ల ఓటర్లు నమోదు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువ ఓటర్ల వివరాలు: పురుషులు: 1,42,26,677 మహిళలు: 1,46,73,412 ట్రాన్స్ జెండర్లు: 1,313 మొత్తం 13,348 పంచాయతీలలో 13,259 పంచాయతీలకు ఓటర్ల జాబితా విడుదల 17 జిల్లాల్లో ప్రక్రియ పూర్తి కాగా 11 జిల్లాల్లో 89 పంచాయతీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి *ఎన్నికల తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం..* __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
557 వీక్షించారు
5 రోజుల క్రితం
#🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 ముమ్మిడివరం మండల పరిధిలోని *అనాతవరం ప్రభుత్వ ఉన్న త పాఠశాల ప్రాంగణంలో గత 20 ఏళ్లుగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ వైర్లు సమస్యను* పరిష్కరించ డం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు..ఇటీవల కాలంలో గన్నవరం పాఠ శాలలో బొమ్మ పడి విద్యార్థిని మరణించడం వంటి పలు సంఘటనలు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తం గా పాఠశాలల స్థితిగతులు వసతులు పట్ల ఆడిట్ నిర్వహించడం జరిగిందని ఈ ఆడిట్లో పలు ప్రమాదక ర అంశాలు తమ దృష్టికి వచ్చాయని వీటిలో అనా తవరం పాఠశాల కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క పాఠ శాల ప్రాంగణంలో ప్రమా దకరంగా గత 20 ఏళ్లుగా ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ వైర్లు అడ్డంకిగా ఉండడం గమనించి తొల గింపు ప్రక్రియను ఏపీ ఈపీడీ సీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ బి రాజేశ్వరి సారధ్యంలో నిర్వహించి నట్లు ఆయన తెలిపారు *పాఠశాలలో 300 మంది విద్యార్థినీ విద్యార్థుల* శ్రేయస్సును కోరుతూ ప్రధానోపాధ్యాయురాలు కె.రాధ, తల్లి దండ్రుల కమిటీ కూడా ఈ యొక్క అంశా న్ని తమ దృష్టికి తీసుకొచ్చి న నేపద్యం మరియు ట్రా న్స్ఫార్మర్ ఉన్న ప్రాంతంలో వికలాం గుల పునరావాస కేంద్రం ఏర్పాటుకు ప్రభు త్వం ప్రతిపాదించిన మీదట యుద్ధ ప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టి ట్రాన్స్ఫార్మర్ పాఠశాల బయటి ప్రాంతానికి మార్పు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు. అదేవి ధంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను పాఠశాల ప్రాంగణo నుండి తొలగించి వేరే ప్రాంతానికి మార్పు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తక్షణమే స్పందించి తొలగింపు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారికి పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు కే రాధ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
476 వీక్షించారు
5 రోజుల క్రితం
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🗞ప్రభుత్వ సమాచారం📻 ముమ్మిడివరం - తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నగర పంచాయతీ *9వ వార్డు మాజీ కౌన్సిలర్ అడబాల సతీష్ పుట్టినరోజు వేడుకలు.* కార్యక్రమానికి హాజరైన *ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.* అభిమానులు, కూటమి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్. *పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే..* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Sekhar Digitals & Reporter 9603197203
542 వీక్షించారు
5 రోజుల క్రితం
#విద్యార్థులు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🗞ప్రభుత్వ సమాచారం📻 #☀️వేసవి స్టేటస్🌴 *కొనుగోలు చేసి...* *........మూలకు చేర్చి....* *పాఠశాలల్లో పనిచేయని వాటర్ ప్లాంట్లు..* ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చేతిపంపు నీటిని తాగుతున్న విద్యార్థి *ముమ్మిడివరం - సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మూలకు చేరిన ఆర్డీఓ ప్లాంట్లు..* ముమ్మిడివరం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంటు కొన్ని నెలలుగా ఇది పనిచేయడం లేదు. ధూళి పట్టకుండా ఉపాధ్యాయులు బరకంతో కప్పి ఉంచారు.. ఇక్కడి విద్యార్థులు చేతిపంపు నీటిని తాగుతున్నారు. *ముమ్మిడివరం గురుకుల పాఠశాలలోనూ ప్లాంట్ పనిచేయక మూలనపడింది..* ఠాణేలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్వో ప్లాంటు లేక విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకుంటున్నారు. జడ్నీ బాలికోన్నత పాఠశాలలో మన గ్రోమోర్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేయడంతో అక్కడ సక్రమంగా తాగునీరు అందుతోంది. కొత్తలంక జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన దాతరూ.2 లక్షలతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼