విశాఖపట్నం గీతం యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ శాంతిలత పాండ్రాంగి గారు బ్లడ్ సీరమ్ ఆధారంగా పని చేసే ఒక లో-కాస్ట్ పోర్టబుల్ డివైజ్ను కనిపెట్టి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు!
ఇది రొమ్ము, గర్భాశయం, ఊపిరితిత్తులు, కాలేయం వంటి సుమారు 9 రకాల క్యాన్సర్లను చాలా తక్కువ ఖర్చుతోనే ముందే పసిగట్టేస్తుంది. సాధారణంగా చేసే ఖరీదైన CT స్కాన్, PET స్కాన్ పరీక్షల అవసరం లేకుండానే, ఆరు రకాల ప్రోటీన్ బయోమార్కర్లను గుర్తించి, రిజల్ట్స్ను ఇస్తుంది ఇది. ఇప్పటికే 350 మంది పేషెంట్స్ శాంపిల్స్తో ప్రయోగాత్మకంగా ఈ డివైజ్ సక్సెస్ అవ్వగా, మరో 3000 మందిపై టెస్ట్ చేసి దీనిని మరింత పర్ఫెక్ట్గా మార్చే పనిలో ఉన్నారామె.
ఇలాంటి లో-కాస్ట్ టెక్నాలజీ సామాన్యులకు అందుబాటులోకి వస్తే, క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు!
#TALRadioTelugu #ShantilathaPandrangi #CancerDetection #LowCostInnovation #IndianInnovation #GoodNews #touchalife
#📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status