ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.6K వీక్షించారు
3 నెలల క్రితం
విష్ణు సహస్రనామం విశిష్టత..............!! ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా.. పిల్లలు మనమాట వినాలన్నా.. (ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే..! సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. నామము అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడుమార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. కానీ.. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే.. విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు. దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!! విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ. పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి..అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆ తరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు. భీష్మాచార్యుల అనుశాసనమే.. విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. పూజకు సమయంలేనప్పుడు.. కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ. వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!! లోకాన్ని సమస్తా సుఖినోభవంతు..!! #vishnu sahasranamam #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.5K వీక్షించారు
3 నెలల క్రితం
విష్ణు సహస్రనామం శ్లోకం - 80 అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్| సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః|| అమానీ - నిగర్వి, నిరహంకారుడు. మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు. మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు. లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు. త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు. సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు. మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు. ధన్య: - కృతార్థుడైనట్టివాడు. సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు. ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు. విష్ణు సహస్రనామం శ్లోకం - 79 సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ| వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః|| సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు. హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు. వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు. చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనము #vishnu sahasranamam #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
785 వీక్షించారు
3 నెలల క్రితం
విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది........!! భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు" స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?" మళ్ళీ నిశబ్దం. స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు. అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని. "అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు. శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు. "అదెలా" అని అందరూ అడిగారు. శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #vishnu sahasranamam
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
751 వీక్షించారు
3 నెలల క్రితం
చాలా అరుదుగా దొరికే చిత్రము..శ్రీ మహాలక్ష్మీ దేవి....,......!! లక్ష్మి చేతిలో విష్ణుమూర్తి చేతినుంచి.. కనకధారా కురిపిస్తూ మరియు గరుడవాహనుడైన శ్రీ మహావిష్ణువుకు ప్రణామములు. ప్రతి నిత్యము లేదా ఏకాదశి రోజున విష్ణుసహస్రనామ పారాయణం చేయడం ద్వారా కలిగే అద్భుత ఫలితాలు..!! ప్రస్తుతం మనకి ఉన్న పని ఒత్తిడి ద్వారా ప్రతి రోజూ మనం విష్ణు సహస్రనామం పారాయణం చేయలేక పోతున్నాము. కనీసం ఏకాదశి రోజైన విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన మనకి మన ముందు మరియు తరువాతి తరాల వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణఫలం..!! శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. మహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు.. చక్రీ సర్వోపగతుండు. ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ప్రతిరోజు విష్ణు నామపారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. అదృష్టం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాలు నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. జ్ఞానానికి,మోక్షానికి దగ్గర దారి శ్రీమహావిష్ణుఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయణం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంతః శతృవులు నశిస్తారు. శ్రీ విష్ణు సహస్ర నామపారాయణం వల్ల నవగ్రహ దోషాలు తొలగి, వాక్శుద్ధి కలుగుతుంది. జ్ఞానం వృద్ధి నొందుతుంది. తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!! #తెలుసుకుందాం #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ. 🙏🙏 #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ