🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
661 views
2 months ago
కర్మయోగి భీష్ముడు............!! మహాభారతం పేరు వినగానే ముందుగా మనకు స్ఫురించేది వ్యాసభగవానుడు. తరువాత భీష్ముడే. నేడు భీష్మ ఏకాదశి. ఆ మహిమాన్వితుడుకు ఉత్తరక్రియలు జరిపింది ఏకాదశి నాడు. శ్రీకృష్ణుడు భీష్ముడుపైన ఉన్న మమకారంతో ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా ప్రకటించారు. భీష్ముడు అష్టమి తిథి రోజునే నిర్యాణం చెందారు. ఆరోజు భీష్మాష్టమి అయింది. భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం కార ణంగా, ఆయన కోరుకొన్నట్టుగా, ఉత్తరాయణం వచ్చే వరకు, దాదాపు ఏభైఎనిమిది రోజులు అంపశయ్య పైనే ఉండి, ధర్మరాజుకు రాజధర్మాలు, ధర్మమార్గం, వంటి ఎన్నో విషయాలు బోధించి, ధర్మప్రబోధకుడుగా భారత చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు. కురుక్షేత్ర యుద్ధం సమాప్తమయిన తదుపరే జ్ఞాన యజ్ఞం మొదలయ్యింది. కురుక్షేత్ర సంగ్రామంలో పదవ రోజున యుద్ధం లో శిఖండి వేసిన బాణపరంపర వల్ల భీష్ముడు నేలపై పడబోతుం డగా, కురువంశ శ్రేష్ఠుడు, జ్ఞానప్రదాత అయిన భీష్ముడుకు అర్జునుడు అంపశయ్య ఏర్పాటు చేసాడు. భీష్ముడు కర్మయోగి. పితృభక్తి పరాయణుడు. అసలు ఆయన పేరు దేవవ్రతుడు. గాంగే యుడు. తన తండ్రి అభీష్టం నెరవేర్చడానికి తనకు వారసత్వంగా వచ్చే రాజ్యాన్ని త్యజించడం, బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం వల్ల దేవతలు పూలవర్షం కురిపించి ‘భీష్ముడు’ అని ప్రశంసించారు. భీష్ముడు నేర్పిన విజ్ఞానం ధర్మరాజుకు రాజ్యపాలనకు ఉపయోగ పడుతుందని భావించే శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడి ప్రబోధానికి అవ కాశం కల్పించారు. ఆధ్యాత్మికం, ఆదిదైవికం, ఆదిభూతం – అనే మూడు తత్త్వాలకు ఆధారమై, అందులోనే తానూ జీవిస్తూ కర్తా, భర్తా, హర్తా అనే భగవతత్త్వాన్ని గురించి వివరించాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడే ద్రౌపది భీష్మునితో ”తాతా! ఇన్ని ధర్మసూత్రాలు నీకు తెలుసుండి, ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసి పరాభవిస్తుంటే ఎందుకు వారించ లేకపోయావు?” అని ప్రశ్నించింది. అపుడు భీష్ముడు బదులిస్తూ ”అమ్మా! పాంచా లి! నువ్వన్న మాట నిజమే. అయితే నేను అధర్మ పరాయణుల ఆహారాన్ని భుజిస్తున్నప్పుడు, నా నోరు ధర్మం గురించి ఎలా మాట్లాడగలదు?” అన్నాడు. భీష్ముడు ఎంతటి మహాజ్ఞానో, అంతటి శ్రీకృష్ణుని భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు అంశే అని గ్రహంచిన వారిలో మొదటివాడు. శ్రీకృష్ణునిలో పరమాత్మ తత్త్వాన్ని గుర్తించిన యోగి. అందుకే ధర్మరాజుకు, సోదరులకు శ్రీకృష్ణుడిని ఒక మిత్రుడుగా భావించడంకంటే, ఆయనలో తత్త్వాన్ని గుర్తించమని విశిద పరుస్తాడు. భీష్ముడి భావవ్యక్తీకరణ...... ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే, శ్రీకృష్ణుడు భీష్ముడు వద్దకు వచ్చాడు. సాక్షాత్తు విష్ణువునే దర్శిస్తున్నట్లు తన్మయత్వం పొందాడు. ఆ వసుదేవుని దివ్య నామాలతో స్తుతించాడు. స్వచ్ఛంద మర ణం వరం ఉన్నా, స్వర్గానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరాడు. అంపశయ్య మీద నుండే విష్ణు సహస్రనామాలను ఈ జగ త్తుకు అందించాడు. మోక్ష ధర్మానికి అర్థ, కామాలను త్యాగం చేసి కేవలం ధర్మమే మార్గంగా జీవించాడు భీష్ముడు. శ్రీకృష్ణుని అనుమతి కోరగానే, శ్రీకృష్ణుడు ”గంగాపుత్రా! వెళ్ళుటకు అనుమతిస్తున్నా ను. నీవు నీ తోటి వారైన వసువులను కలుసుకోమ”ని చెప్పాడు. అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు, ఇతర బంధువులను ఉద్దేశించి ”మీ చేత కూ డా అనుమతించబడ్డాను కదా” అంటూ వారందర్నీ ఆలింగనం చేసుకొన్నాడు. భీష్ముడు ప్రాణాలను త్యజించిన విధానం...... భీష్ముడు యోగధారణచేత మనసును నిగ్రహించి, ప్రాణా పానాది వాయువులను నియంత్రించి, ఒక్కొక్క అవయవము నుండి ఒక్కొక్క ప్రాణాన్ని తొలగించుకొంటూ ఉండగా, ఆ భాగా లన్నీ శల్యరహతాలయ్యాయి. భీష్ముని అన్ని అవయవాలు నిర్వీ ర్యం అయిన పిమ్మట, ఆత్మ శిరస్సుని ఛేదించుకొని, మిక్కిలి కాంతి తో ప్రకాశిస్తూ, ఆకాశంలో అంతర్థానమైపోయింది. అప్పుడు పై నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. భీష్ములవారికి మాఘ శుద్ధ ఏకాదశి రోజు ఉత్తర క్రియలు ధర్మ రాజు, అతని సోదరులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ భీష్మఏకాదశిగా ప్రకటించి, మానవాళి అందరూ ఆయన బోధిం చిన ధర్మాచరణ, సత్యవచనం, కర్మ, జ్జాన మార్గాలను అనుసరిస్తూ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశిని పాటిం చండని తెలిపాడు. #🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు #భీష్మ ఏకాదశి #🙏భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు🙏 #💐భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 💐
PSV APPARAO
667 views
2 months ago
#జయ ఏకాదశి / భీష్మ ఏకాదశి విశిష్టత #మాఘ మాసం ప్రాముఖ్యత #మాఘ మాసం / కుంబ మాసం మహిమ 🌄 మాఘ స్నానం విశిష్టత #భీష్మ ఏకాదశి #🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు *భీష్మ ఏకాదశి* *జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా...* 🌹🌺 *భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు?* 🌺🌹 మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు. సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు. కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట. భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వస ారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.5K views
2 months ago
గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది. భీష్మ పితామహుడు శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..ఆయ్నను చుసి అడిగిన ప్రశ్న కు శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ” తను ఒక పెద్ద ఆయ్నను తల్చుకుంటున్నాను అని…..” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు ? ” నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని…..ఆ భక్తుడే భీష్మపితామహుడు” అని కృష్ణ పరమాత్మ అసలు విషియాన్ని చెప్పాడు. అవును….భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుదేంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో.. అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యొగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు. భీష్ముడి జన్మ రహస్యం శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా ?’ అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ’నేనెవరో తెలుసా ?’ అంది. “నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు. నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీ కిచ్చేస్తాను ” అని మ్రతిమాలాడు. అప్పుడు ఆ అమ్మాయి ”మహారాజా ! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి ” అంది. ఆవేశంలో “అలాగే !” అని మాట యిచ్చాడు శంతనుడు. వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు – గంగాదేవి. పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో ” నువ్వెవరు ? ఎక్కడనుండి వచ్చావు ? ఇలా ఎందుకు చేస్తున్నావు ? ” అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. ఏడుగురు కొడుకులు పుట్టారు. ఏడుగురూ ఏటిపాలయ్యారు. చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక ” నువ్వు తల్లివి కావు…ఎందుకింత పాపం చేస్తున్నావు ? ” అని అడిగాడు. వెంటనే ఆమె “మహారాజా ! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను. ” పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమబ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది ! అష్ట వసులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త. ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను ‘సరే’ అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. ” వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో ’ మీరంతా మానవులై పుట్టండి’ అని శపించాడు. అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. కానీ వశిష్ట మహర్షి ‘నా శాపానికి తిరుగులేదు పొండి !’ అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.’ నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు !’ అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు. ” ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి ‘గంగాభవానీ ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ !’ అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. అటువంటి భీష్మున్ని తలుచుకుని తరిద్దాం. భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన పవిత్ర తిథి అయిన “భీష్మాష్టమి” !! ఈ సందర్భంగా ఆ మహానుభావుడు అంపశయ్యపై చేసిన శ్రీకృష్ణ పరమాత్మ స్తుతిని (పోతన భాగవతం నుంచి) చదువుదాం. మందాకినీ నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామభావం తో నిర్మలధ్యానంతో పీతాంబరధురుడు చతుర్భుజుడు పురాణపురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందుని యందు ఏకాగ్రబుద్ధి ని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతిసిద్ధాలైన సంసార బంధాలను పరిహరిం చే ఉద్ధేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు “ముల్లోకాలకు సమ్మోహనమై న నీలవర్ణ కాంతులతో నిగ నిగలాడే మనోహరమైన దేహం గలవాడు పొద్దుపొడుపు వేళ వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు నల్లని ముంగురులు కదలాడుతుండే వాడు ముద్దులు మూటగట్టుతున్న ముఖపద్మం కలవాడు మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తు చేరి ఉండే అందగాడు అయిన మా శ్రీకృష్ణ భగవానుడు నామదిలో నిరంతరం నిలిచిపోవాలి.” గుర్రాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ముకొట్టుకుపోతున్నా ముంగురులు చెదిరి పోతున్నా అధికమైన రథ వేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లుకారుతున్నా ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహం అతనిని ప్రోత్సహిస్తు యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణపరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను. ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తు పగవారి కళ్ళెదురు గానే రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సేనలకు మధ్యప్రదేశం లో నిలబెట్టాడో చిరునవ్వులు చిందిస్తూనే కౌరవపక్ష రాజు లందరిని పేరుపేరునా చూపిస్తు ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేసాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయపద్మం లో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక. రణరంగంలో తన బంధు మిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహా మహిమాన్వితమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధంలో ముందంజ వేయించిన వాని మునులచే స్తుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక. ఆ నాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీరగంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్ళకు కట్టినట్లే కన్పిస్తున్నది కుప్పించి పై కెగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారుచేలం జారిపోయింది “నమ్ముకొన్న నన్ను నలుగురిలో నవ్వులపాలు చేయవద్దని మాటిమాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్కచేయకుండ “అర్జునా ! నన్ను వదులు. ఈ నాడు భీష్ముని సంహరించి నిన్ను కాపాడుతాను” అంటూ కరిపైకి లంఘించే కంఠీరవం లాగా నా పైకి దూకే గోపాల దేవుడే నాకు రక్ష. “ఇతడు నా నమ్మినబంటు ఇతణ్ణి కాపాడటం నా కర్తవ్యం సుమా.“ అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో ఒయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అదలిస్తు చూచేవాళ్లను ఆశ్చర్యచకితులను చేస్తున్న పార్థసారథిని ప్రశంసిస్తున్నాను. తియ్యని మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయకోపాలతో వాల్చూపులతో వ్రజవధూమణుల వలపులు దోచుకొనే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తాను మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభా మందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు. ఉన్న సూర్యుడు ఒక్కడు సకల జీవరాసులలో ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.” ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా వాక్కుల ద్వారా దృక్కుల ద్వారా శ్రీకృష్ణపరమాత్మను హృదయం లో పదిలపరచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమైయ్యాడు. అప్పుడు అది చూసి అక్కడ ఉన్న వారందరూ సంధ్యా సమయం లో పక్షుల్లా మౌనం వహించారు దేవలోకంలోను మానవ లోకంలోను దుందుభులు ధ్వనించాయి సాధుసంకీర్తనలువినిపించాయి పూలవానలు కురిశాయి తనువు చాలించిన దేవనదీ పుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు. అక్కడి మునులందరు శ్రీకృష్ణుని రూపం తమ మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు. అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసిక్ హస్తినాపురానికి వెళ్లాడు. అక్కడ గాంధారీ సహితుడైన ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడైక్ ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు.” సీ. కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొన నుఱికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మనిక్రీడి మఱల దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టి దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ దేవర్షులూ బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన “మహోగ్రశిఖర ఘన తాళతరువగు సిడము వాడు” – అంటే ఆయన ధ్వజం గుర్తు తాటిచెట్టు. దానిలాగే వందలాది భారత పాత్రలలో అండరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు. శీలంలోనేమి శౌర్యంలోనేమి నీతిలోనేమి నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ రాజ్యాన్నీ అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు. కాని భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కయిన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత గూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుని సమకాలికులలో ఎరుక గల్గిన అతికొద్దిమందిలో భీష్ముడు ముఖ్యుడు. తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించక పోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు. అందుకే ఆయనను మహాభక్తుల కోవలో పరిగణించారు విజ్ఞులు “ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీశ శుక శౌనక భీష్మ దాల్భ్యాన్” అంటూ. అంతే కాదు ఆయన మహా విజ్ఞాని. ఎన్నో ధర్మాలు తెలుసు ఆయనకు ! రాచకార్యాల్లో తలమునకలు కాని సమయమంతా అధ్యయనం లోనే గడిపి ఉంటాడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు. భారతంలో శాంతిపర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. ఇక పద్యంలోకి వద్దాం. అటువంటి పరిపూర్ణ పురుషుడైన భీష్ముడు తన ఆఖరు క్షణాలలో పాండవులతో కలిసి తనను పరామర్శించడానికి వచ్చినపుడు ఎంతో పారవశ్యంతో శ్రీకృష్ణుని స్తుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు. మామూలు సన్నివేశమా అది ! కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలుపెడుతున్నాడుఅర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. కేవలం అర్జునుని ఉత్సాహ పరచడానికే కాక భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది. భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. భీష్ముని చంపడానికి ముందుకు కాలు సారించాడు. మామూలు సైనికులందరూ దూకబోయే పులిని చూసిన లేళ్ళలాగా చెల్లా చెదరైనారు. కౌరవులందరూ నిలుగు గుడ్లేసుకుని చూస్తున్నారు. భీష్ముడు ఏమాత్రమూ తొట్రుపాటు లేకుండా మిక్కిలి ప్రియంగా రావయ్యా వేగంగా వచ్చి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యవయ్యా అని వేడుకున్నాడట పోతనగారి భీష్ముడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి కనుల ముందుకు తెచ్చుకున్నాడు పైపద్యంలో. నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండ లాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును (పాదాన్ని కాదు) పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ తన చాలిమిని ఎత్తి చూపినందువల్ల కలిగిన అవమానంతోనూ నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ’ ముందుకొస్తున్న ఆ మహానుభావుడు నా బాణాల దెబ్బకు వడలి ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు నాకు దిక్కగుగాక ! అని స్తుతించిన సందర్భం లోనిది ఈపై పద్యం. ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ ఆ చేలాంచలం జారడం లోని సొగసూ ఆ చక్రమూ కాలుక్కరచుకున్న అర్జునుడూ అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు – ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది ఎవరికి నచ్చదు ! ఇంకొక చిత్రం ఉన్నది ఈ సందర్భంలో. అంపశయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు పాండవులూ కృష్ణుడూ వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం “సర్వేశ్వరుండఖిల దేవోత్తంసుడెవ్వేళ ప్రాణంబు లేను విడుతు నందాక నిదె మంధాసుడై వికసిత వదనార విందుడై వచ్చి నేడు నాల్గు భుజములు కమలాభనయన యుగము నొప్ప కన్నుల ముందటనున్నవాడు మానవేశ్వర నా భాగ్యమహిమ జూడు మేమి జేసితినొ పుణ్యమితని గూర్చి” అని అంటాడు. ఆ మహాత్ముని కంటే ధన్యులెవరుంటారు చెప్పండి. భీష్మ ప్రతిజ్ఞ గంగాదేవి తనను వీడి వెళ్ళినప్పటినుండి శంతన మహారాజు వైరాగ్యంతో ఉన్నాడు. కాని ఒక రోజు యమునాతీరానికి వాహ్యాళికని వెళ్ళి అక్కడ జగన్మోహినినా ఉన్న ఓ అమ్మాయిని చూసి ఆ పిల్లను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు.తనను పెళ్ళి చేసుకోమని ఆ అమ్మాయిని అడిగాడు. " నా తండ్రి దాశరాజు. బెస్త్ల్లందరికీ నాయకడు. మీరు ఆయనతో మాట్లాడి ఆయన అనుమతి తీసుకోండి. అది మీకూ నాకూ మంచిది " అని బదులు చెప్పిందాపిల్ల. శంతనుడు వెళ్ళి దాశరాజును కలిశాడు. ఆయన నవ్వుతూ " మా అమ్మాయిని మీ చేతుల్ల్లో పెడతాను కాని నా కూతురి వల్ల మీకు కలగబోయే పిల్లవాడే మీ తరువాత రాజు కావాలి " అన్నాడు. శంతనుడు ఒప్పుకోలేదు. దేవవ్రతుణ్ణి తోసేసి మరొకరికి పట్టాభిషేకం చేయడం కుదరదన్నాడు. అయితే ఈ పెళ్ళే జరగదన్నాడు దాశరాజు. దిగులుతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు శంతనుడు. దేవవ్రతుడు తండ్రి మనసులోని విచారాన్ని ఆయన రధసారధి ద్వారా తెలుసుకొని వెంటనే దాశరాజు దగ్గరకు వెళ్ళి " నీ కూతురుకు పుట్టబోయే బిడ్డే రాజవుతాడు. నాకు రాజ్యం అక్కర్లేదు. నా పట్టాభిషేకాన్ని ఇప్పుడే పరిత్యాగం చేస్తున్నాను " అని శపధం చేశాడు. అయినా దాశరాజు భయం పోలేదు. దేవవ్రతుడు కాకపోయినా అతని సంతతివారెవరైనా ముందు ముందు అవరోధాలు కలిగించవచ్చు కదా అని సందేహించాడు. దేవవ్రతుడు అది గ్రహించి తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటారు. అప్పుడాపల్లెరాజు సంతోషించి తన కూతుర్ని శంతనుడికిచ్చి పెళ్ళిచేసాడు. ఆ అమ్మాయి పేరు సత్యవతి. శంతనుని వల్ల ఆమెకు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. #భీష్మ ఏకాదశి #💐భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 💐 #🙏భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు🙏 #🙏భీష్మ (జయ)🌺ఏకాదశి🕉️శుభాకాంక్షలు #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు