🎎💞మన హిందూ సాంప్రదాయం🌺🙏

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
514 వీక్షించారు
6 గంటల క్రితం
ఒక్క రాగి చెంబు నీరు – పూర్వీకుల దాహం తీర్చి ఇంట్లో శాంతి, సంపద తెచ్చే సులభ పరిహారం...........!! ఈ చిన్న పరిహారం ఇంట్లో దాగి ఉన్న సమస్యలను (గొడవలు, డబ్బు సమస్యలు, శాంతి లేకపోవడం, అడ్డంకులు) తొలగించడానికి చాలా మంది చేస్తున్నారు. ఇది వాస్తు, పితృదేవతల (పూర్వీకులు) పరిహారంగా పాపులర్ అయింది. ఎవరైనా సులభంగా చేయవచ్చు – ఖర్చు లేదు, మంత్రాలు లేవు, భక్తి మాత్రమే కావాలి. ఎందుకు ఇది చేయాలి? చాలా ఇళ్లలో పూజలు, దీపాలు, శ్రాద్ధాలు అన్నీ సరిగ్గా ఉంటాయి. అయినా సమస్యలు తగ్గవు. కారణం: ఇంట్లో ఉన్న స్త్రీల (భార్య/కోడలు) పుట్టింటి పూర్వీకులు (మామయ్యలు, తాతయ్యలు) ఇంటికి రాలేకపోతారు. వారు బయటే నిలబడి బాధపడతారు. ఆ బాధే ఇంట్లో కష్టాలుగా మారుతుంది (డబ్బు రాకపోవడం, గొడవలు, అనారోగ్యం). ఈ చెంబు నీరు వారికి తృప్తి ఇస్తుంది – వారి దాహం తీరుస్తుంది. ఎలా చేయాలి? (స్టెప్ బై స్టెప్ – చాలా సింపుల్) ఎప్పుడు? అమావాస్య రోజు సాయంత్రం (అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు పూర్వీకులకు ప్రత్యేకం). 1. రెండు చెంబులు తీసుకోండి (రాగి లేదా ఇత్తడి – రాగి బెస్ట్). శుభ్రంగా కడిగి ఉంచండి. 2. ఇంటి బయట (పుట్టింటి పూర్వీకుల కోసం): ఒక చెంబులో నీరు నింపండి (మంచి నీరు). ఇంటి నైరుతి మూల (South-West దిశ – ఇంటి వెనక భాగం లేదా బయటి కుడి వైపు) ఉంచండి. (కొందరు చిటికెడు పసుపు/కుంకుమ వేస్తారు – ఐచ్ఛికం). 3. ఇంటి లోపల (మీ ఇంటి పూర్వీకుల కోసం): మరో చెంబులో నీరు నింపండి. ఇంట్లో తాగునీరు ఉంచే చోట (కిచెన్ లేదా హాల్‌లో) పెట్టండి. 4. ముఖ్యం: రెండు చెంబులు వేరువేరు – ఒకటి బయట, ఒకటి లోపల. ఏమీ చెప్పకుండా, భక్తితో ఉంచండి. తర్వాత రోజు నీటిని మార్చండి (పాత నీటిని తులసి దగ్గర పోయవచ్చు). ఏమి జరుగుతుంది? అమావాస్య నుంచే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. గొడవలు తగ్గుతాయి, శాంతి వస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయి. 12 అమావాస్యలు (సుమారు 1 సంవత్సరం) క్రమంగా చేస్తే పెద్ద మార్పు కనిపిస్తుందని చాలా మంది అనుభవాలు చెబుతున్నారు. ఇది సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. నమ్మితే చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషం, సంపద ఉండాలని కోరుకుంటున్నాము! ఒక్క రాగి చెంబు నీరు... కానీ దాని ఆశీర్వాదం జీవితాన్ని మార్చేస్తుంది! #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
588 వీక్షించారు
19 గంటల క్రితం
నైవేద్యాలలో ఉల్లిపాయఎందుకు వాడరు ? శ్లోకం: లశునం గృంజనం చైవ పలాండుం కవకాని చ | అభక్ష్యాణి ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ || (మనుస్మృతి 5-5) తాత్పర్యం: వెల్లుల్లి (లశునం), ముల్లంగి (గృంజనం), ఉల్లిపాయ (పలాండుం), పుట్టగొడుగులు (కవకాని) — ఇవి అశుద్ధమైన చోట్ల పుడతాయి కాబట్టి ఉపాసకులు (బ్రాహ్మణులు) వీటిని శ్రీవిద్యా సాధకులు తినకూడదు.... ఉపాసకులు (బ్రాహ్మణులు )ఉల్లిపాయలు (మరియు వెల్లుల్లి) తినకపోవడానికి ప్రధాన కారణం అవి తామసిక మరియు రజోగుణ ఆహారాలుగా పరిగణించబడటమే. ఆధ్యాత్మిక సాధనకు, మనశ్శాంతికి సాత్విక ఆహారం ముఖ్యం. ఉల్లిపాయలు కామ వికారాలను, కోపాన్ని, ఆందోళనను పెంచుతాయని మరియు యోగసాధనకు అడ్డుపడతాయని నమ్ముతారు. ముఖ్యమైన కారణాలు: ఆధ్యాత్మిక అడ్డంకులు: ఆత్మశుద్ధి, సాత్విక జీవనశైలి కోసం ఉల్లిపాయ, వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇవి మనస్సును చంచలం చేస్తాయి. తామసిక/రజోగుణ ఆహారం: ఆయుర్వేదం మరియు యోగశాస్త్రం ప్రకారం, ఉల్లిపాయలు శరీరంలో పైత్యరసాన్ని పెంచి, ఆవేశాన్ని, కామ కోరికలను రేకెత్తిస్తాయి. పౌరాణిక నమ్మకం: రాహు, కేతువుల రక్త బిందువుల నుండి ఉల్లి, వెల్లుల్లి పుట్టాయని, అందుకే ఇవి అశుద్ధమైనవిగా (రాక్షస ప్రవృత్తిని కలిగించేవిగా) భావిస్తారు. దైవ నివేదన: పూజలలో దేవునికి సమర్పించే నైవేద్యంలో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వాడరు.అయితే, కాలక్రమేణా మారుతున్న అలవాట్ల వల్ల కొందరు బ్రాహ్మణులు ఇప్పుడు వీటినితీసుకుంటున్నప్పటికీ,సంప్రదాయ ఆచారాలను పాటించేవారు వాటికి దూరంగా ఉంటారు.ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని రోగం వస్తే ఎలా తీసుకోవచ్చా ఇలాంటి ప్రశ్నలు రోగికి దోషం ఉండదు. రోగం లేని వాళ్ళు రోగం వస్తుందని భయంతో తినేసే వాళ్ళకి ఇలాంటివి ఎవరిని ఉద్దేశించి గాని విమర్శించాన్ని దృష్టితో కానీ పైని శ్లోకo తెలపటం లేదు గమనించగలరు శాస్త్ర ప్రమాణాలు... #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #సనాతన ధర్మం.. దేవుళ్ళు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
417 వీక్షించారు
1 రోజుల క్రితం
పల్లెల్లో అప్పటి ఇళ్లల్లో దీగూడు (దీపం గూడు )అని ఉండేది. అది వీధివాకిలి కి ఎదురుగా అందరికీ కనపడేట్టు ఉండేది. తలవాకిలికి (main door)ఇరు వైపులా రెండు దీపం గూళ్లు ఉండేవి. ఇంటి లోపలి దీగూడు లో మట్టి ప్రమిద లో మంచి నూనె (నువ్వులనూనె )వేసి వెలిగించేవారు. ప్రమిద కింద ఆవుపేడ ఉంచి దాని మీద ప్రమిద ఉంచే వారు ప్రమిదలో ఓ రాగినాణెం వేసేవారు దీపం వెలిగించే వారు. బయట వాకిలికి ఇరువైపులా ఉన్న దీపం గూళ్లలో విప్పనూనె వేసి వెలిగించే వారు. బయట ఎందుకు అంటే బయట వీదుల్లోనడిచే వారికి మనకు ఎంతో సౌలభ్యం గా ఉంటుంది. మనసంప్రదాయాలు ఎంతో గొప్పవి. ఇప్పుడు ఈ విద్యుత్దీపాలు వచ్చాక అన్నీ పోయాయి. దేవుడి దగ్గర ఓపిక ఉన్న నాడు పెడుతున్నారు దీపం. ఏమి అంటే ఉద్యోగం టైం లేదు అని సాకు చెప్పేస్తున్నారు. తినడానికి ఉన్న టైం దీపం పెట్టడానికి లేదా? 90% జనాలు ఉదయం, సాయంత్రం పెడతారు. పూర్వం ఓ సామెత చెప్పే వారు పూజ గురుంచి ఉన్నవివదులుకోకు, లేనివితెచ్చుకోకు అని అంటే ఉన్నపూజలువదులుకోకండి ఎవరెవరో చెప్పిన కొత్త పూజలు చేయకండి అని. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
502 వీక్షించారు
1 రోజుల క్రితం
సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు...........!! శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి. ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్లకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టేవేళ ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని, ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది చాల మందికి తెలియదు. సాయంత్రం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం నుంచి.. లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్య సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి, ముందు తలుపులను తెరిచి ఉంచాలి. దాని వలన జ్యేష్టా దేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంటికి ఎవరైన గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి, మనం కూడా శుభ్రంగా తయారై, వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంటాం. అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని, మనం కూడా శుభ్రంగా ఉండి ఆతల్లిని ఆహ్వానిస్తే, వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెప్తున్నారు. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
555 వీక్షించారు
2 రోజుల క్రితం
అత్తమామలను తప్పించుకోలేరు.........!! కోడలైనా లేక అల్లుడైనా పుత్రులు లేని పెద్దల కర్మ కాండ - ఆడ బిడ్డ, అల్లుడి విధి పితృదేవతారాధనా రహస్యాలు- మా మామగారి ఆబ్దికం వస్తోంది. ఆయనకు మగపిల్లలు లేరు. అత్తమామల కోసం మేము ఏం చేయాలి?‘‘ ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కుటుంబనియంత్రణ కారణంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. అయితే ఇది నేడు క్రొత్తగా వచ్చింది కాదు. పూర్వం కూడా కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉండే వారు. వారిని అభ్రాతృకా (సోదరుడు లేనిది) అనేవారు. ఆమెను వివాహం చేసుకొనేవారు కాదు. దీనికి అనేక కారణాలు ఉండేవి. ప్రధాన కారణం మాత్రం అత్తమామల తిథుల సమస్య. అంతేకాక అన్నో తమ్ముడో ఉంటే వారితో కలసి పెరిగిన అమ్మాయికీ, సోదరులు లేకుండా పెరిగిన యువతికీ తేడా ఉంటుందని కొందరి భావన. ఇవి అలా ఉంచితే నేడు ఒక వికృత ప్రవృత్తి తయారైంది. తన కూతురుని ఇచ్చేటప్పుడు ఆడపడుచులు లేని సంబంధాలు కావాలని వెదకి మరీ చేసుకుంటున్నారు. ఫలితంగా వీరే తమ కుమారుడికి సంబంధం వెతకడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. మరికొందరు బావమరుదులు లేని ఆస్తిపరుల సంబంధాలు వెదకి మరీ చేసుకుంటున్నారు. నేడు సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు ప్రధాన కారణం సనాతన ధర్మాన్ని మరచి పోవడమే. ఆస్తికోసం ఆశపడిన అభ్రాతృకను పెళ్ళాడిన వారిది ఒక సమస్య అయితే, ఆస్తి లేకుండా అభ్రాతృకను పెళ్ళాడినవారిది మరొక సమస్య. అయితే ఇద్దరూ పెద్దలను అర్చించడం మాత్రం మానివేశారు. దీని వల్ల భయంకరమైన పితృదోషాలు ఆ కుటుంబాలకు చుట్టుకుంటున్నాయి. పిల్లనిచ్చిన అత్తమామలు తిలోదకాలు లేకుండా అలమటించడం వల్ల ఆ కుటుంబాలకు ఈ విధమైన దోషాలు తగులుతున్నాయి. పోనీ వారికి పిండప్రదానాలు చేద్దామా అంటే .. ఆస్తి తీసుకున్నాడు కదా? చేయకుండా ఉంటాడా? ఎవరికోసం చేస్తాడు?‘‘ అనే ఈసడింపులు వారిని అవమానిస్తున్నాయి. ఆస్తి తీసుకోని వారిని ..ఏమిచ్చాడని మీ మామకు చెయ్యాలి?‘‘ అని ప్రశ్నించేవారు మరికొందరు. వీరందరికీ తెలియని రహస్యాలు హిందూధర్మంలో ఉన్నాయి. వివాహం చేసే కన్యాదానంలో అమ్మాయిని కేవలం ధర్మఅర్థకామాల్లో సహచరిగా ఇస్తూ ఈ మూడింటిలో ఆమెను అత్రిక్రమించను అని మాట ఇచ్చిన తరువాతే పెళ్ళి జరుగుతుంది. మోక్షం కోసం భార్యను విడిచి సన్యాసం స్వీకరించవచ్చు. సన్యాసానికి భార్య అనుమతి అవసరంలేదు. తండ్రి అనుమతి అవసరం లేదు. కానీ తల్లి అనుమతి మాత్రం తప్పని సరిగా ఉండాలి. ఇది మొదటి రహస్యం. కన్యాదానంలో అమ్మాయిని పూర్తిగా ధారాదత్తం చేయరు. ‘‘ఇదం తుభ్యం‘‘ అని మాత్రమే అంటారు. మిగిలిన అన్ని దానాల్లో ‘‘ఇది నీకు ఇస్తున్నాను. ఇక ఇది నాది కాదు‘‘ అని అంటారు. కానీ కన్యాదానంలో ఇది నీకు ఇస్తున్నాను అనిమాత్రమే అంటారు. న మమా (నాది కాదు) అని అనరు. అంటే కన్యను దానం ఇచ్చినా ఆమె మీద అధికారం పుట్టింటి వారికి ఉంటుంది. ఆ అధికారం ఎంత వరకూ ఉంటుంది అంటే ఆమెకు పుట్టే సంతానం మీద మొదటి హక్కు మామగారికి ఉంటుంది. అంటే కుమార్తెకు పుట్టే మగసంతానం మామగారి హక్కు. కుమార్తెకు పుట్టే మగపిల్లలను దౌహిత్రుడు అంటారు. మగసంతానం లేదు కనుక ఈ దౌహిత్రుడు పుట్టింటి వారి హక్కు అవుతాడు. అతడిని దత్తత తీసుకునే హక్కు వారికి ఉంటుంది. అంతేకాక, మగపిల్లలు లేని అత్తమామలకు సంస్కారాలు చేసే బాధ్యత ఈ దౌహిత్రులకు ఉంటుంది. వారు పిండప్రదానాలు చేసి తీరాలి. అల్లుడు చేయడం చేయకపోవడం అతని ఇష్టం. కానీ శాస్త్రం ప్రకారం అల్లుడికి కూడా ఈ బాధ్యత తప్పించుకోలేనిది. దీన్నే ఈ విధంగా శాస్త్రంలో చెప్పారు. త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్రః కుతపస్తిలాః | రజతస్య తథా దానం కథాసంకీర్తనాదికమ్ | | పితృయజ్ఞాలలో కుమార్తెకు పుట్టిన కుమారుడు, నువ్వులు, మధ్యాహ్న కాలాలు మహాప్రీతిపాత్రమైనవి అని విష్ణుపురాణం చెబుతోంది. కనుక దౌహిత్రుడుకు అల్లుడి కన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంచి మా అత్తమామల తిథుల వరకూ వెళ్ళే ముందు వారికర్మలు ఎవరు చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. అప్పుడు ఎవరు కర్తృత్వంవహించారు అనేది ప్రధాన ప్రశ్న. కర్తృత్వం వహించి వారికి క్రియలు చేసినవారే ఉత్తర క్రియలు కూడా చేయడం సాధారణ మర్యాద. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన అంశం గమనించాలి. ఒక గృహిణి ఆరునెలల గర్భవతిగా ఉండగా ఆమె భర్త మరణించాడు. ఆ భర్తకు క్రియలు చేయడానికి ఆమె గర్భంలో ఉన్న పిండం మీద కర్తృత్వం వేసి కర్మకాండను బ్రాహ్మణుని నియోగించి జరిపించారు. అయితే ప్రసవానంతరం ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఈ విధంగా కడుపులోనే ఆమె కర్తృత్వం వహించింది కనుక ఆమెను చేసుకున్న అల్లుడు వారికి పిండప్రదానాలు చేసే బాధ్యత వస్తుంది. పెళ్ళి అయ్యే వరకూ ఆమె ఆ తిథులను తాను కర్తగా ఉండి బ్రాహ్మణులను నియోగించి చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ పితృయజ్ఞాల్లోని సూక్ష్మాలు. సామాజిక మాధ్యమాల చర్చలకు చాలా భారమైనవే అయినా కొందరు అడిగిన మీదట చెబుతున్నాము. అంతేకాక, నేడు నెలకొన్న అభ్రాతృక సమస్యల వలన ఇది చాలా అతిముఖ్య సమాచారం. అన్నిటికీ మించి అత్తమామల తిథులు నిర్వహించడం కూడా అదృష్టంగా భావించాలి. వారిని ఆరాధించడం కనీస బాధ్యత మాత్రమే కాదు. వారి అపార కరుణ పొందడానికి చాలా ముఖ్యమైన మార్గం. దేవపూజలు కన్నా పితృదేవతల అర్చన చేయడం మహాఫలాలను ఇస్తుంది. ఈ విధంగా పిండప్రదానాలు లేని అమ్ముమ్మతాతలను (అత్తమామలను) అర్చించడం దౌహితృలకు (అల్లునికి) సకలసంపదలూ ఇస్తుంది. వారు తిలోదకాలు లేకుండా ఈసురోమంటూ ఉంటే వీరి వంశం ఏమాత్రం ముందుకు వెళుతుందో ఒకసారి ఆలోచించడం మంచిది. మరొక ప్రశ్న కూడా పరిశీలించండి. మా అత్తగారికీ నాకు పడదు. చనిపోయేటప్పుడు కూడా నా నీడ పడడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. మేము ఆమె తిథులు పెట్టాలా?‘‘ ఇది చాలా ముఖ్యమైన మరో ప్రశ్న. నేటి అస్తవ్యస్త కుటుంబవ్యవస్థలో సఖ్యత ఉన్న అత్తాకోడళ్ళ సంఖ్య సంతృప్తిగా లేదు. కొన్ని సందర్భాలలో ఇది సంపూర్తిగా ప్రతిలోమంగా ఉంది. కనుక ఇటువంటి అనుమానం వస్తోంది. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి. ఆడపిల్ల వివాహం అయిన తరువాత అత్తారింట్లో అతి ముఖ్యమైన స్థానం పొందుతుంది. అదే వర్గత్రయంలో స్థానం. అంటే తాను, తన అత్తగారు, తన అత్తగారి అత్తగారు అనే పరంపరలో స్థానం పొందడం. ఇది మన ఇష్టానిష్టాల మీద ఆధారపడి ఉండదు. ఇష్టం ఉన్నా లేకున్నా ఆమెకు ముందుగా తిలోదకాలు ఇవ్వకుంటే తనకు చెందవని గమనించాలి. అందరూ ఉండి అనాథప్రేతంగా అలమటించాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా మరొకటి తెలుసుకోవాలి. బ్రతికి ఉన్నప్పటి రాగద్వేషాలు మృతులకు అంటగట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు పితృదేవతలు అవుతారని గమనించాలి. సామాన్యంగా ఉన్న మానవుల రాగద్వేషాలకు వారు అతీతులు. శరీరంతో వచ్చిన కోపతాపాలు శరీరంతోనే పోతాయి. అన్నింటికీ మించి మానవులకు అనేక శరీరాలు ఉంటాయి. అవి భౌతిక శరీరం అనే మనకు కనిపించే శరీరాలు. ఈ శరీరం అగ్నికి ప్రీతిపాత్రం అవుతుంది. కారణశరీరం అనేది మరొకటి వాసనల రూపంలో ఉంటుంది. ఇదే జనన మరణాలకు ప్రారబ్ధాలకు కారణం. మరొకటి యాతనా శరీరం. ఈ యాతనా శరీరమే స్వర్గనరకాలకు పోయి యాతనలు పడుతుంది. ఈ విధంగా శరీరాలు విభజన పొంది పవిత్రమైన దేవతలుగా పితరులు మిగులుతారు. వారినే మనం అర్చించేది. ఇది అందరూ తెలుసుకోవాలి. కనుక దేహంలో పొందిన రాగద్వేషాలు దేహంతోనే పోతాయి. వాటిని తెలియనితనంతో కొనసాగించి అత్తను అశ్రద్ధ చేయడం వలన పితృదోషాలు కలుగుతాయి. సంతానం వృద్ధిలోకి రాదు. పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, ధననష్టాలు సంభవించడం వంటివి కలుగుతాయి. అత్తకు పిండప్రదానాలు చేయించడం వలన ఇహమే కాక పరంలో కూడా ఫలం ఉంటుంది. ఆమెను తృణీకరిస్తే ఆమె తరువాత స్థానం పొందాల్సిన కోడలికి వర్గత్రయంలో స్థానం దక్కదు. అంతేకాక బ్రతికి ఉన్నంత కాలంకూడా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై ప్రశ్నలు రెండూ అతి ముఖ్యమైనవి. అనేక కారణాల వలన పితృయజ్ఞాలు మానివేస్తున్నారు. వీటిని మాని వేయడం వలన నానా బాధలూ పడుతున్నారు. ఇన్నాళ్ళూ చేసిన తప్పులు సరిచేసుకోవడం అత్యంత తేలిక. దోష నివారణకు ఈ విధంగా చేయండి. నేడు ప్రయాగలో కుంభమేళా జరుగుతోంది. ఇది జనవరి 15 నుంచీ 48 రోజుల పాటు ఉంటుంది. కనుక మార్చి 31 వరకూ పితృదోషాల నివారణకు, వారి సంతోషానికి ఈ క్రింది విధంగా చేయండి. 1) ప్రతి రోజూ స్నానం చేసేముందుగా ఈ విధంగా పితరులను ప్రార్థించండి. ప్రయాగ తీర్థంలో కుంభమేళా జరుగుతోంది. పవిత్ర గంగా, యమునా, సరస్వతుల సంగమ స్థానంలో జరుగుతున్న ఈ కుంభమేళాకు నేను వెళ్ళలేకపోయినా, అక్కడ మీకు పిండప్రదానాలు చేయలేకపోయినా నన్ను క్షమించండి. నేను నా ఇంటిలో ఇస్తున్న ఈ నీళ్ళే కుంభమేళా దివ్యజలాలను చేయండి. నేను చేసే స్వధానామసాధనకు, స్వధా స్తోత్రపఠనకూ, నా శక్తి మేర చేస్తున్న గోసేవకు సంతృప్తి చెందండి. పిండప్రదానాలు కుంభమేళాలో చేసినట్టు భావించండి. మీ మనుమలను ఆశీర్వదించి సకల సంపదలూ, శ్రేయస్సూ, సుఖభోగాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాన‘‘ని ప్రార్థించండి. ఇదే అవసరం లేదు. ఈ భావం వచ్చే విధంగా ప్రార్థించినా సరిపోతుంది. 2) మీకు ఖాళీ ఉన్న సమయంలో స్వధానామసాధన, స్వధా స్తోత్రపఠనం చేయండి. 3) వీలైనన్ని సార్లు గోసేవలో భాగంగా చిట్టు, తవుడు, పచ్చగడ్డి నివేదించండి. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
565 వీక్షించారు
3 రోజుల క్రితం
ఇంటి ప్రధాన ద్వారం నిజమైన మన అదృష్ట ద్వారం…........!! ఇక్కడ శక్తి మేల్కొంటే, లక్ష్మి లోపలికి రాకుండా ఎవరూ ఆపలేరు. ప్రధాన ద్వారం కోసం 5 సులభమైన నివారణలు. లక్ష్మి రాక కోసం...... ఇంటి ప్రధాన ద్వారం కేవలం ఒక మార్గం మాత్రమే కాదు; సంపద, అదృష్టం మరియు సానుకూల శక్తి ప్రవేశించే ప్రదేశం కూడా ఇక్కడే. దాని శక్తిని శుద్ధి చేసి మేల్కొలిపితే, ఇంట్లో శ్రేయస్సు మరియు ఆనందం యొక్క ప్రవాహం పెరుగుతుంది. 1. పసుపు-కుంకుమ స్వస్తిక్..... ఎప్పుడు: గురువారం లేదా శుక్రవారం ఉదయం ప్రధాన ద్వారం శుభ్రం చేసి పసుపు మరియు కుంకుమతో స్వస్తికను గీయండి మరియు అక్షత అర్పించండి. ప్రయోజనం: లక్ష్మీ శక్తి ఆకర్షణను పెంచుతుంది. 2. సాయంత్రం దీపం..... ఎప్పుడు: ప్రతి రోజు సూర్యాస్తమయం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రయోజనం: ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 3. గంగా జలం చల్లుకోండి...... ఎప్పుడు: సోమవారం లేదా శుక్రవారం గంగా జలంలో కొద్దిగా కర్పూరం కలిపి తలుపు మీద చల్లుకోండి. ప్రయోజనం: ఇంటి శక్తిని శుద్ధి చేస్తుంది. 4. మామిడి ఆకు తోరణం..... ఎప్పుడు: శుక్రవారం లేదా పౌర్ణమి ప్రధాన ద్వారం వద్ద 5 లేదా 7 మామిడి ఆకుల తోరణాన్ని వేలాడదీయండి. ప్రయోజనం: సానుకూల శక్తి మరియు అదృష్టాన్ని పెంచుతుంది. 5. గంట మరియు ధూపం........ ఎప్పుడు: ఉదయం మరియు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద గంట మోగించి ధూపం లేదా అగరబత్తి వెలిగించండి. ప్రయోజనం: ఆధ్యాత్మిక మరియు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. శుభోదయంతో కూడిన, శుభ్రమైన, సువాసనగల మరియు బాగా వెలిగించిన ప్రధాన ద్వారం లక్ష్మీ ప్రవేశానికి నిజమైన ద్వారం. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు