భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత

🧿🌹🙏యద్భావం తద్భవతి🌹🧿🙏
642 వీక్షించారు
2 రోజుల క్రితం
*🕉️ ఓం నమో వేంకటేశాయ 🕉️* *🎈 తరిగొండ వెంగమాంబ 🎈* 🍃🌹 తిరుమలేశుడు ప్రతిరాత్రి ఏకాంతసేవ అనంతరం ఓ భక్తురాలి ఇంటికి వెళ్లి, ఆమె భక్తి పారవశ్యంతో తనను కీర్తిస్తుంటే, తాను నాట్యం చేస్తుండేవాడని విశ్వాసం ఉంది. ఆమె చెప్పే ముచ్చట్లు ఆసక్తిగా విని ఆనందించేవాడని కూడా భక్తులు భావిస్తారు. ఆమెకు అవమానం జరిగితే, అది తనకు జరిగినట్లుగానే భావించేవాడని కథనాలు చెబుతున్నాయి. 🍃🌹 ఈ లీలలన్నీ పూర్వయుగాల నాటివి కాదు సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం జరిగినవిగా స్థానిక సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. ఆ మహాభక్తురాలే పరమ పూజ్యురాలైన తరిగొండ వెంగమాంబ గారు. ఆమె మహాభక్తి, కవిత్వం, శ్రీ వేంకటేశ్వరుడిపై ఉన్న అనురాగం వల్ల ఆమెకు ప్రత్యేక స్థానం లభించింది. శ్రీనివాసుని ఐతిహ్యంలో వెంగమాంబ గారి ప్రస్తావన ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. 1. తరిగొండ వెంగమాంబ గారు 18వ శతాబ్దానికి చెందిన మహాభక్తురాలు, కవయిత్రి. 2. ఆమె తిరుమలలో నివసిస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామిపై అపార భక్తితో అనేక కీర్తనలు, నాటకాలు రచించారు. 3. ఆమె జీవితంలో జరిగిన అనేక సంఘటనలు భక్తుల మధ్య "దైవలీలలు"గా ప్రసిద్ధి చెందాయి. 4. దేవుడు ఆమె ఇంటికి వచ్చి నాట్యం చేశాడనే విషయం చారిత్రక ఆధారాలతో నిరూపించబడలేదు; ఇది భక్తి సంప్రదాయంలో ఉన్న విశ్వాస కథనం. 5. అయితే, ఆమె భక్తి నిజమైనది, ఆమె రచనలు మరియు సేవలు చారిత్రకంగా నమోదైనవే... వెంగమాంబ గారి గురించి చెప్పబడే లీలలు భక్తి పరమైన విశ్వాసాలుగా భావించాలి. కానీ ఆమె భక్తి, త్యాగం, శ్రీ వేంకటేశ్వరునిపై ప్రేమ మాత్రం యదార్థంగా చరిత్రలో నిలిచిపోయాయి. *🙏 శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృప మనందరికీ లభించాలి 🙏* __________________________________________ HARI 🙏✍🏻 _________________________________________ #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తరిగొండ వెంకమాంబ #శ్రీ తరిగొండ వెంకమాంబ జయంతి
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
646 వీక్షించారు
21 రోజుల క్రితం
నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి...........!! గ్రహసంబంధమైన దోషం ఉందనగానే చాలామంది అనేక విధములుగా కంగారు పడిపోతారు. అభిషేకాలు ... జపాలు ... దానాలు అంటూ ఆందోళన చెందడానికి కారణం లేకపోలేదు. గ్రహసంబంధమైన దోషాలు ఆయా జాతకుల జీవితాన్ని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేస్తాయని భయాందోళనలకి గురౌతుంటారు. అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతోన్న నవగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో వైష్ణవ సంబంధమైన క్షేత్రాల్లో కనిపిస్తుంటాయి. ఇక శివాలయాలకి సంబంధించి కొన్ని చోట్ల మినహా చాలా ప్రాంతాల్లో నవగ్రహాలు దర్శనమిస్తుంటాయి. కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ వుంటే, మరి కొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ వుంటుంది. నవగ్రహాలు ఎలా కొలువై వున్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. నవగ్రహాలకు ... శివుడితో గల సంబంధమేమిటో శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే. అంతే కాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే. ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి. ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే వుంటే నవగ్రహ దోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే. #తెలుసుకుందాం #భక్తి...జ్ఞానం...ఆధ్యాత్మికత #మన ఆధ్యాత్మికత #నవగ్రహాలు #🛕శివాలయ దర్శనం
bhakti channel
3.7K వీక్షించారు
1 నెలల క్రితం
#🔯దోష పరిహారాలు🔯 #ఆధ్యాత్మికత #సుబ్రహ్మణ్యేశ్వర స్వామి#మంగళవారం#చాగంటి కోటేశ్వర గారి