chandhra babu naidu

P.Venkateswara Rao
564 views
16 hours ago
* #చంద్రబాబు : పరనిందకు మాత్రమే ప్రవచనాలు❗* APRIL 30, 2026🎯 అతి సర్వత్ర వర్జయేత్ అనే నీతిని మనం చిన్నప్పటినుంచి చదువుకునే ఉంటాం. ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా అలాంటి నీతినే ప్రవచిస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరని ఆయన అంటున్నారు. అధికారం ఉన్నది గనుక ఈగోలకు పోతాం అని ఎవరైనా అనుకుంటే భవిష్యత్తులో నష్టం జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆయన హితవచనాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మాటలను గమనిస్తే.. ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాటలన్నారో చివర్న చర్చించవచ్చు గానీ.. ఆయన ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఈ నీతులు తయారుచేసుకుంటారా? అనే అనుమానం కార్యకర్తలకు కలుగుతోంది. అతి పనికి రాదని చంద్రబాబు చెప్పడం.. అన్యాపదేశంగా పిఠాపురం వర్మ వ్యవహారాన్ని ఉద్దేశించే అన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వంటి గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకుని.. మరీ ఇలాంటి చిల్లరగొడవల ప్రస్తావన తేవడం ఏమాత్రం గౌరవప్రదంగా లేదని కూడా కార్యకర్తలు అంటున్నారు. ఇక చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తున్న 'అతి' విషయానికి م వద్దాం. అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అనేది ఆయన సూత్రీకరణ. మరి అనేక విషయాల్లో చంద్రబాబు చేస్తున్న తీరును ‘అతి' అనే కేటగిరీలోకి చేర్చవచ్చునో లేదో ఆయనే ఒకసారి సమీక్షించుకోవాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటికి కూడా మైకు దొరికితే చాలు.. జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కడంలోనే చంద్రబాబునాయుడు తరించిపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల మీద విషం కక్కడం అర్థం చేసుకోవచ్చు. కానీ రెండేళ్లుగా ప్రతి సందర్భంలోనూ మైకు దొరికితే చాలు.. జగన్ పాలనను ఆడిపోసుకుంటూ, జగన్ పాలన వల్ల రాష్ట్రం నాశనమైపోయిందనే పాచిపాట పాడడాన్ని చంద్రబాబు నిత్యకృత్యంగా మార్చుకున్నారు. కొత్త కార్యవర్గం పదవీస్వీకారంలో కూడా.. కొత్త దళం లక్ష్యాలు ఏమిటో ఆశావహ సానుకూల దృక్పథంతో ప్రసంగాలు సాగలేదు. జగన్ ను తిట్టడంలోని ప్రతికూల బుద్ధితోనే ప్రసంగాలు సాగాయి. ఇదంతా అతి అని ప్రజలు అనుకుంటారో లేదో చంద్రబాబు ఆలోచించుకోవాలి. అమరావతి రాజధాని కావొచ్చు, విశాఖ ఐటీ కేంద్రం కావడం గురించి కావొచ్చు.. ఉన్నదానికంటే సాధిస్తున్న కంటె అతిశయమైన అబద్ధాలను వండి వార్చడం మితిమీరుతున్నదని అతి అవుతున్న దని చంద్రబాబునాయుడు గుర్తించలేకపోతే ఆయన పారీకి తొలి ప్రమాదం పొంచి ఉంటుంది. అతి పనికిరాదని ఆయన చెబుతున్న మాట అక్షరసత్యం. కానీ ఎన్ని విషయాల్లో ఆయన ప్రవర్తన అతి అనే కోవకిందికి చేరుతున్నదో కూడా ఆయన గమనించుకుంటూ ఉంటేనే.. ఆ పార్టీకి మంచి జరుగుతుంది.
Anna NTR
668 views
8 days ago
ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని ప్రారంభించింది చెన్నై నుంచే #🏛️రాజకీయాలు #chandrababu #srntr #AnnAntr
Anna NTR
574 views
8 days ago
తనకు ఆశ్రయం ఇచ్చిన చెన్నై ఋణం తీర్చుకోవడానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. #AnnAntr #chandrababunaidu #viral #srntr
P.Venkateswara Rao
525 views
8 days ago
#చంద్రబాబు #రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *మోదీపై తీవ్ర పొగడ్తలు, తెగడ్తలు.. బాబుకే సొంతం❗* APRIL 21, 2026🎯 ప్రధాని నరేంద్ర మోదీపై విపరీత పొగడ్తలు, అలాగే తెగడ్తలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రమే సొంతం. రాజకీయంగా మోదీతో అవసరం ఏర్పడినప్పుడు ఆయన్ను ఆకాశమే హద్దుగా చంద్రబాబు ప్రశంసించడాన్ని యావత్ భారతదేశం చూసింది, వినింది. అలాగే మోదీ వల్ల రాజకీయంగా నష్టమని భావించినప్పుడు, ఆయన్ను తీవ్రస్థాయిలో చంద్రబాబు తిట్టడాన్ని కూడా మన దేశ ప్రజానీకం చూసింది. ఇటు పొగడ్తల్లోనూ, అటు తెగడ్తల్లోనూ రికార్డులు మాత్రం చంద్రబాబుకే సొంతం. తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిమిత్తం చంద్రబాబు అక్కడికి వెళ్లారు. రెండు రోజుల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేవలం మోదీ గుడ్ లుక్స్లో పడేందుకు, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెప్పుకోసమే తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లారని, ఆయన మాటలు విన్న వారెవరికైనా అర్థమవుతుంది. ప్రధాని మోదీ జాతీయ ప్రయోజనాల కోసమే పని చేస్తుండడంతో తాను మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో వుందన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకత్వం వుందని ప్రశంసలతో ముంచెత్తారు. కేంద్రం ఉదారంగా నిధులిస్తుంటే, వినియోగించుకోవాలి కదా అని స్టాలిన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాల కోసం మోదీ సర్కార్ రూ.14 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కేంద్ర నిధుల్ని దారి మళ్లించడం సమంజసమా? అని డీఎంకే ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, తమిళనాడులో అభివృద్ధి మందగించిందని ఆరోపించారు. ఆ రాష్ట్రంలో విమానాశ్రయాలపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. ఇవన్నీ కూడా మోదీ మెప్పు కోసం తప్ప, మరే ఉద్దేశంతో కాదని జనానికి అర్థమైంది. ఇదే చంద్రబాబునాయుడు గతంలో మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఆయన దగ్గర చంద్రబాబు మాట బాగా చెల్లుబాటు అయ్యేది. అప్పట్లో గుజరాత్లో మత ఘర్షణలు జరగ్గా, నాటి ఆ రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే ఆయన్ను సీఎం గద్దె నుంచి తప్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతెందుకు, 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి వచ్చారు. అంత వరకూ మోదీని పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ ఏం చేశారని నిలదీశారు. రాజధాని అమరావతికి తట్టెడు మట్టి, యమునా నీళ్లు తీసుకురావడం తప్ప, ఏమీ చేయలేదని తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఓడించి దేశం నుంచి బహిష్కరించాలన్న రేంజ్లో మండిపడ్డారు. మోదీ అవినీతికి పాల్పడుతు న్నారని, సీబీఐ, ఈడీలను గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతున్నారని మోదీపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ప్రకటించి, హామీని అమలు చేయని 'ద్రోహి'గా అభివర్ణించారు. మోదీ పాలనలో దేశం బాగా వెనుకబడిందని ఆరోపించారు. పాలన చేయడం ఆయనకు చేతకాదన్నారు. మోదీ కుటుంబ సభ్యులపై కూడా బాబు నోరు పారేసుకున్నారు. రాజకీయంగా నచ్చకపోతే విమర్శలు చేయాలంటే చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం, వారి మెప్పు పొందేందుకు ఎలా పొగడ్తలతో ముంచెత్తాలో చంద్రబాబును చూసే నేర్చుకోవాలనే చర్చ జరుగుతోంది. ఒకే వ్యక్తి, రెండు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాల్ని, స్వల్ప సమయం తేడాలో మాట్లాడితే ఏమైనా అనుకుంటారనే వెరపు కూడా లేకపోవడం చంద్రబాబు గొప్పతనం. అదే రాజకీయాల్లో ఆయన విజయ రహస్యం కూడా.
svd suryajyothy
4.9K views
16 days ago
అమరావతి నిలబడటం,పోలవరాన్ని పూర్తి చేయడం నా అదృష్టం#chandrababunaidu#svdsuryajyothytelugu #appolitics #telugu #news #nara chandra babu naidu #appolitics #news #svdsuryajyothytelugu