ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వరూథిని ఏకాదశి - ప్రాముఖ్యత Varuthini Ekadashi - 16.04.2023

PSV APPARAO
624 views
2 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ / బుద్ధ పూర్ణిమ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #బుద్ధ పూర్ణిమ #బుద్ధ పూర్ణిమ స్పెషల్ *ఆచరణే ఆరాధన* _ఆచరణే ఆరాధన_ మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చెప్పిన బోధనలు పాటించటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే తెలుసు కున్నాం. ఆయా బోధనలు చేసిన మహాత్ములను మనం ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. కలిసి మాట్లాడి ఉండక పోవచ్చు. ఒక్క పైసా ఇచ్చి ఉండక పోవచ్చు. వారి బోధనలను ఆచరణలో పెట్టటమే వారి పట్ల మనం గౌరవాన్ని, భక్తి, శ్రద్ధలను కనబరచినట్లు అవుతుంది. ఆ విషయాన్నే తెలుపుతుంది మహాభారతంలోని ఏకలవ్యుని కథ. ఎదురుగా గురువు లేకున్నా, ఆయనను మనసులో నిలుపుకుని సాధన చేసి విలువిద్యలో అద్భుత నైపుణ్యాన్ని సాధించాడు ఏకలవ్యుడు. ఇటువంటి సంఘటనే బుద్ధ భగవానుని జీవితంలోను జరిగింది. బుద్ధ భగవానుడు దేశాటనలో భాగంగా ఒక రాత్రి వేళ కుమ్మరి శాలకు చేరుకున్నాడు. ఆ శాలకు ఆయన కన్న ముందే ఒక యువ పరి వ్రాజకుడు వచ్చి ఉన్నాడు. వారికి పూర్వ పరిచయం లేదు. ఆ యువ పరివ్రాజకుని మాట, ప్రవర్తన బాగా నచ్చాయి బుద్ధ భగవానునికి. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఓ భిక్షూ! నీవెవరి పేరున ప్రవ్రుజిడవైనావు లేక నీ శాస్త ఎవరు? ఎవరి ధర్మాన్ని ఇష్టపడతావు? అని ఆ యువకుని ప్రశ్నించాడు. అతడు సమాధానమిస్తూ, 'మిత్రమా! శాక్య పుత్రుడైన శ్రవణ గౌతము డున్నాడు. అతడు భగవంతుడు, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు. అతనే నా శాస్త్ర, నేనతని ధర్మాన్నే ఇష్టపడతాను అన్నాడు. దానితో బుద్దుడు ఒకింత ఆశ్చర్యంతో 'ఆ సమ్యక్ సంబుద్ధుడు ఇప్పుడెక్కడున్నాడు. నీవు ఆయనను ఎపుడైనా చూశావా? చూస్తే గుర్తించగలవా అని ప్రశ్నించాడు. ఎందుకంటే ఆ సన్యాసి చెబుతున్న సమ్యక్ సంబుద్ధుడు తానే. ఆ యువ సన్యాసికి తానెప్పుడూ ఏదీ ప్రత్యక్షంగా బోధించలేదు. దానికా యువ సన్యాసి 'నేను భగవంతుని ఏ నాడూ చూడలేదు. అందువల్ల చూసినా గుర్తించలేను అన్నాడు. పరో క్షంగా తన బోధనలు విని భక్తి శ్రద్ధలతో వాటిని ఆచ రిస్తున్న ఆ యువ సన్యాసికి బుద్ధుడు తానెవరో తెలిపి ధర్మాన్ని వివ రిస్తూ ఇంకెన్నో విషయాలను తెలి యజేశాడు. ఆనందం హృద యంలో పొంగి పొరలగా, రెండు కళ్ళలో నీరు ఉబ కగా, ఆ యువ సన్యాసి బుద్ధ భగ వానుని పాద పద్మాలపై తల ఉంచాడు. రెండు చేతులూ జోడించి, 'భగవాన్! నేను మిమ్మల్ని మిత్రమా అన్నందుకు నన్ను క్షమించండి. నా పేరు పుష్కర స్వాతి. నాకు ప్రవ్రాజ్య ఉప సంపద బ్రిక్టు సంఘంలో సదస్యత్ర ఇవ్వండి' అని ప్రార్థించాడు. భక్తి, శ్రద్ధ అంటే అవి. ఏ మహనీయుని విషయంలోనైనా మనకు ఆరాధనా భావముంటే వారి బోధను ఆచరించాలి గాని పాదపూజలతో, పూలహారాలతో, హారతి అర్చనలతో సరిపెట్టు కోరాదు. అవి ఉద్ధరించవు. సనాతన ధర్మం మనం ఆరు రుణాలతో పుడ తామని చెబుతుంది. అవి భూత రుణం, పితృరుణం, మాతృ రుణం, దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం. ఇవి తీర్చుకోవాలంటారు. వాటికి విధా నాలున్నాయి. వాటిలో ఋషి రుణాన్ని తీర్చుకోవడం ఎలా గంటే వారు మనకు ఇచ్చిన విజ్ఞానాన్ని వారు చేసిన రచ నలు చదివి ఆచరించడం ద్వారానేనని చెబుతారు. అంటే నిజమైన ఆరాధన ఆయా మహనీయుల బోధనలు ఆచరించడమేనని తెలుస్తుంది. లోకోపకారమే ఆ మహ నీయుల ఉద్దేశం. వారి బోధ నలు ఆచరించడం ద్వారా మన జీవితాలు, సమాజం బాగు పడతాయి. అవి బాగుపడితే రాష్ట్రం, దేశం ఇలా అన్నీ బాగుపడతాయి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
592 views
2 days ago
#అర్ధనారీశ్వర వ్రతం మహా వైశాఖి / వైశాఖ పూర్ణిమ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #వైశాఖ మాసం వైభవం (మాధవ మాసం వైశాఖం) #వైశాఖ పౌర్ణమి 🌕 *వైశాఖ పూర్ణిమ/ అర్ధనారీశ్వర వ్రతం* *మహా వైశాఖి* 🌛🌕🌔 *మహా వైశాఖి, వైశాఖ పూర్ణిమ* 🌔🌕🌜 మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు. వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. 🌊⚡🌀 *అర్ధనారీశ్వర వ్రతం* 🌀⚡🌊 పార్వతీ పరమేశ్వరులు ఒకటిగా ఉండడాన్ని అర్ధనారీశ్వరము అని హిందూ పురాణాలలో చెప్పబడి ఉంది. తలనుండి కాలి బొటనవేలివరకూ సమానముగా అంటే నిలువుగా చెరిసగముగా ఉన్న మగ, ఆడరూపాలు ఒకటిగా ఉండడము. అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము) అవుతుంది. తల ఆలోచనకి, పాదము ఆచరణికి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట. లోకములో భార్యా భర్తలు అన్యోన్యముగా తప్పు అయినా ఒప్పు అయినా ... ఆచరణలోనూ, ఆలోచనలోనూ కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది. పరమేశ్వరుని, అంబికను ఏకభావముతో, భక్తితో సేవించాలి. అప్పుడే అధిక శుభము కలుగుతుంది. ఇరువురియందును సమాన ప్రీతి ఉండవలెనన్న ... ఆ ఇరువురియందు మాతాపితృ భావము ఉండాలి. లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి... కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
615 views
7 days ago
#శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏❇️ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు ❇️🙏 #🙏🌹శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు 🧜‍♀️🌻🚶‍♀️🌺 #శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి💐🎂 26th April 2026 *వాసవీ కన్యక జయంతి* : వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యులకు ఆరాధ్యదేవత. ప్రపంచమంతటా ఆమె ఆలయాలున్నాయి. వైశ్యులు ప్రధానంగా వాసవీ అమ్మవారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కన్యకా పరమేశ్వరి తండ్రి కుసుమ శ్రేష్ఠి. ఆయన భార్య కుసుమాంబ. వారిది ఆదర్శ దాంపత్యం. పెనుగొండ నగరేశ్వర స్వామి వారికి ఆరాధ్య దైవం. అయితే వివాహం అయిన చాలా ఏళ్ల వరకూ వారికి సంతాన భాగ్యం కలుగలేదు. దాంతో కుల గురువైన భాస్కరాచార్యులవారి సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం చేశారు. దేవతలు అనుగ్రహించిన యజ్ఞఫల ప్రసాదాన్ని స్వీకరించి కుసుమాంబ గర్భవతి ఆయింది. తొమ్మిదినెలలకు వసంత కాలంలో సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లువెత్తిన మథుర క్షణాన వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారంనాడు ఉత్తరా నక్షత్రం కన్యరాశిలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో అబ్బాయికి విరూపాక్షుడని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన వారిద్దరూ సకల విద్యల్లోనూ ఆరితేరారు. ఆ కాలంలో అంటే 10,11 వ శతాబ్దాల మధ్యలో పెనుగొండ ప్రాంతం విష్ణువర్ధనుడనే చాళుక్య చక్రవర్తి అధీనంలో ఉండేది. అతడికే విమలాదిత్యుడనే మరోపేరుంది. అతడొకసారి వాసవిని చూశాడు. మోహించాడు. ఆమెను వివాహ చేసుకుంటానని కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపించాడు ప్రాపంచిక విషయాల మీద తనకు ఆసక్తి లేదని, జీవితాంతం కన్యకగానే ఉంటానని అంతకుముందే వాసవి ప్రకటించింది. విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడయ్యాడు. పెనుగొండపైకి సైన్యం పంపాడు. ఆ విపత్కర స్థితిలో కుసుమ శ్రేష్ఠి కులగురువుల సమక్షంలో 714 గోత్రాల వారితో సమావేశం నిర్వహించాడు. వారిలో 612 గోత్రాల వారు విష్ణువర్థనుడితో వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రమాదం తప్పుతుందని, కులవినాశనం జరగదని భావించారు. 102 గోత్రాలవారు మాత్రం వాసవితో పాటు అడుగు వేయడానికి సంసిద్ధులయ్యారు. అధర్మానికి తలవొగ్గి, పిరికితనంతో వ్యవహరించే పలాయనవాదులు దైవత్వానికి దగ్గర కాలేరనడానికి నిదర్శనమైన సన్నివేశం అప్పుడు జరిగింది. వాసవీదేవి గోత్రీకుల సమావేశంలోకి ప్రవేశించింది. అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ మనసులోని మాట వెల్లడించింది. నేను వివాహానికి నిరాకరించినట్లైతే విష్ణువర్థనుడు సైన్యంతో పచ్చి విరుచుకుపడతాడు. యుద్ధం పలస అపార జననష్టం సంభవిస్తుంది. పుణ్య స్త్రీలు వైధవ్యంతో బాధపడతారు. ఒక్కరి కోసం ఇంత రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంతో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢమైన సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరని ప్రకటించింది. దానికి తల్లిదండ్రులు సైతం అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా 102 గోత్రాలవారు వాసవి దేవిని అనుసరించారు. ఆత్మాహుతి చేసుకున్నారు. అది మాఘ శుద్ధ పాడ్యమినాడు జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించేందుకు అనునిత్యం అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
PSV APPARAO
2.6K views
7 days ago
#మధురై మీనాక్షి పట్టాభిషేకం 🔱🕉️🙏 #మధురై మీనాక్షి వైభవం 🕉️🔱🕉️ మధురై క్షేత్రంలో ఉత్సవాలు 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత 26th April 2026 *మధురై మీనాక్షి పట్టాభిషేకం* : మధురై మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం అనేది ప్రసిద్ధ 'మధురై మీనాక్షి తిరుకల్యాణం' ఉత్సవాలలో అత్యంత కీలకమైన మరియు వైభవంగా జరిగే ఘట్టం. చైత్ర మాసంలో (ఏప్రిల్-మే) జరిగే ఈ వేడుకలో, మీనాక్షి అమ్మవారు మధురై నగరానికి రాణిగా బాధ్యతలు స్వీకరించడాన్ని పురస్కరించుకుని ఈ పట్టాభిషేకం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం, మలయధ్వజ పాండ్య రాజు కుమార్తెగా జన్మించిన మీనాక్షి, దిగ్విజయ యాత్రలో ఎందరో రాజులను ఓడించి చివరకు ఈ రోజున మధురై పీఠాన్ని అధిష్ఠిస్తుంది. ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి రత్నఖచితమైన 'రాయముకుటం' (కిరీటం) ధరింపజేసి, వేపపూల మాలను సమర్పించి, చేతికి 'సెంగోల్' (రాజదండం) అందిస్తారు. ఈ రాజదండాన్ని మీనాక్షి అమ్మవారి ప్రతినిధిగా అప్పటి మధురై పాలకుల వద్దకు తీసుకువెళ్లి, తిరిగి అమ్మవారి వద్ద ఉంచడం ఇక్కడి సంప్రదాయం. ఈ పట్టాభిషేకం జరిగిన మరుసటి రోజున సుందరేశ్వరునితో అమ్మవారి కల్యాణం జరుగుతుంది, ఇది భక్తి మరియు రాజసం కలగలిసిన అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక.
PSV APPARAO
1.8K views
21 days ago
#ఏకాదశి రోజున ప్రత్యేక నియమాలు తెలుసా #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: వరూథిని ఏకాదశి - ప్రాముఖ్యత Varuthini Ekadashi - 16.04.2023 #ఏకాదశి ప్రాముఖ్యత #వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత? #ఏకాదశి *రేపు వరుథిని ఏకాదశి* *(ఏప్రిల్ 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
PSV APPARAO
1.2K views
28 days ago
#గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #సంకష్టహర చతుర్థి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *సంకటహర చతుర్థి* *సంకటహర చతుర్థి* సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి! ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. 🌺 *అంగరక చతుర్థి* 🌺 ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. "ఓం గం గణపతయే నమః" పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
625 views
28 days ago
#శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి *సంకటహర చతుర్థి శుభాకాంక్షలు* *సంకటనాశన గణేష్ స్తోత్రం* ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్. జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*