సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏

PSV APPARAO
521 వీక్షించారు
5 గంటల క్రితం
#శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు (పెద్ద వాల్టెర్-విశాఖపట్నం) ఓం ఐం హ్రీం శ్రీం పోలమాంబాయే నమః #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు *ఈరోజు శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య స్వరూపం దర్శనం! 🌺* "శ్రీ పోలమాంబ అమ్మవారిని పరోక్షంగా దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...ముక్తిని ప్రసాదించే ఈ దివ్య దర్శనాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. 👉 అమ్మవారి నిత్య దర్శనం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VakZTwH3bbV6Ce1pnN1c *సర్వేజనా: సుఖినోభవంతు!"*
PSV APPARAO
1.4K వీక్షించారు
2 రోజుల క్రితం
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🦁🙏 సింహాద్రి అప్పన్న చందనోత్సవం🌹🦁🐯 #🛕🎎సింహాద్రి అప్పన్న చందనోత్సవం 🙏🌺🌠🌦️ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు: భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు. చందనోత్సవానికి సర్వం సిద్ధం. కలెక్టర్: అభిషిక్త్ కిషోర్. విశాఖపట్నం/సింహాచలం. ఏప్రిల్ 18. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన సింహాచలం దేవస్థానం లో చందనోత్సవం ఏర్పాట్లను GVMC కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఉద్యాధరీ , VMRDA కమిషనర్ తేజ్ భరత్,EO J. వెంకట రావు తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6:00 గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ₹300, ₹1000 మరియు ₹1500 కేటగిరీలలో సుమారు 40,000 టికెట్లను విక్రయించడం జరిగిందాని, మిగిలిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు. కొండ పైకి భక్తులను తరలించడానికి 100 ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు . ప్రైవేట్ వాహనాలను కొండ పైకి అనుమతించమని. భక్తులు తమ వాహనాలను ఫుట్ హిల్స్ వద్ద కేటాయించిన 32 పార్కింగ్ ప్రదేశాలలో నిలిపివేసి, దేవస్థానం బస్సుల ద్వారా కొండ పైకి చేరుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారనీ,. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా( కెనోపి )నీడ (Canopy) ఏర్పాటు చేశా మ న్నారు .తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు చేపట్టామన్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను కొండ పైకి తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ణీత సమయ స్లాట్ (Slot) లలోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ లు తెస్తే చట్టపరంగా చర్యలు తీసు కుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు రాంపులను నిర్మించా మన్నారు . ఉచిత ప్రసాదం, మంచినీరు మరియు అన్నదాన వితరణ చేసే సంస్థలకు ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశామని తెలిపారు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి (సుమారు 500 మందికి) మాత్రమే ఉదయం 5:00 గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందనీ. ఆ తర్వాత అందరికీ సాధారణ దర్శనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీమ్‌గా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.
PSV APPARAO
682 వీక్షించారు
2 నెలల క్రితం
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🛕శివాలయ దర్శనం #🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿 #🥁శివ భక్తులు🚩 Mahashivratri ఈ ఆదివారం జరగబోయే మహాశివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం విశాలాక్షి నగర్ సముద్ర తీరంలో ని నాగ క్షేత్రంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ మృత్యుంజయ మహాలింగేశ్వర స్వామికి. మరియు ద్వాదశ జ్యోతిర్లింగములకు లింగోద్భవ సమయంలో రుద్ర సహిత మహా అభిషేకం జరుపబడును కావున మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందగలరని అలాగే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి అనుకుంటే అలాగే పూజా ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు సమర్పించుకోవాలనుకున్నా మీరు స్వయంగా వచ్చి పాల్గొవాలనుకున్నా మీ గోత్ర నామాలతో పాటు మీ చిరునామాతో పాటు స్వామివారికి సమర్పించుకో వాలి అనుకున్న ద్రవ్యాన్ని ఈ క్రింది నెంబర్ కు పంపించగలరు 9032622951
PSV APPARAO
1.2K వీక్షించారు
3 నెలల క్రితం
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #సింహాచలం సింహాద్రి అప్పన్న #సింహాద్రి అప్పన్న 2026 సంక్రాంతి సంబరాలు - సింహాచలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సింహగిరిపై జనవరి 14 నుండి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు: ముగ్గుల పోటీలు (జనవరి 13, 2026): సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు దేవాలయ రాజగోపురం ముందున్న మాడ వీధుల్లో భక్తులు ముగ్గులు వేయవచ్చు. విజేతలకు జనవరి 14 ఉదయం 9:00 గంటలకు బహుమతులు అందజేస్తారు. భోగి పండుగ (జనవరి 14, 2026 - బుధవారం): సింహగిరిపై భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చెరకు గెడల అలంకరణలు ఉంటాయి. డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరలు, కోమ్మాదాసరి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేదమంత్రోచ్ఛారణలతో గోపూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు: ఉదయం 9:00 గంటలకు కొండపై ఉన్న కళావేదిక వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. కనుమ (జనవరి 16, 2026): ఉదయం 9:00 గంటలకు కృష్ణాపురం వద్ద ఉన్న దేవస్థానం గోశాలలో విశేష గోపూజలు నిర్వహిస్తారు. ముఖ్య గమనిక: భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ సుజాత గారు కోరారు.🤝👏🤝
PSV APPARAO
939 వీక్షించారు
3 నెలల క్రితం
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 2026 సంక్రాంతి సంబరాలు - సింహాచలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సింహగిరిపై జనవరి 14 నుండి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు: ముగ్గుల పోటీలు (జనవరి 13, 2026): సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు దేవాలయ రాజగోపురం ముందున్న మాడ వీధుల్లో భక్తులు ముగ్గులు వేయవచ్చు. విజేతలకు జనవరి 14 ఉదయం 9:00 గంటలకు బహుమతులు అందజేస్తారు. భోగి పండుగ (జనవరి 14, 2026 - బుధవారం): సింహగిరిపై భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చెరకు గెడల అలంకరణలు ఉంటాయి. డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరలు, కోమ్మాదాసరి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేదమంత్రోచ్ఛారణలతో గోపూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు: ఉదయం 9:00 గంటలకు కొండపై ఉన్న కళావేదిక వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. కనుమ (జనవరి 16, 2026): ఉదయం 9:00 గంటలకు కృష్ణాపురం వద్ద ఉన్న దేవస్థానం గోశాలలో విశేష గోపూజలు నిర్వహిస్తారు. ముఖ్య గమనిక: భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ సుజాత గారు కోరారు.🤝👏🤝 #సింహాద్రి అప్పన్న #సింహాచలం సింహాద్రి అప్పన్న
PSV APPARAO
1.6K వీక్షించారు
4 నెలల క్రితం