సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు
98 Posts • 130K views
PSV APPARAO
616 views 1 months ago
#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు ప్రెస్ నోట్ శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం – సింహాచలం, విశాఖపట్నం జిల్లా శరన్నవరాత్రి ఉత్సవములు – విజయదశమి శమీ పూజా మహోత్సవము 30 సెప్టెంబర్ 2025 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీసింహాద్రి క్షేత్రములో ప్రతీ ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవములు ఈ సంవత్సరము 23-09-2025 నుండి 01-10-2025 వరకు విజయవంతంగా నిర్వహించబడుచున్నవి. ఈ శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా, 02-10-2025 (విజయదశమి) రోజున, శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా శ్రీరామ అలంకరణతో గోవిందరాజ స్వామి రూపంలో శోభాయాత్రగా కొండపై నుండి మెట్ల మార్గం ద్వారా గోవిందరాజ స్వామి సన్నిధి నుండి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండ దిగువన గల పూలతోటకు వేంచేయబడును. అక్కడ సాయంత్రం ఘనంగా శమీ పూజా మహోత్సవము (జమ్మి వేట) నిర్వహించబడును. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదములు భక్తులకు అందించబడును. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్రమైన శమీ పూజ మహోత్సవములో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించవలసినదిగా భక్తులను ఆహ్వానించుచున్నాము. ప్రత్యేక సమాచారం: తేది 02-10-2025 (విజయదశమి) నాడు సాయంత్రం 6.00 గంటల నుండి స్వామివారి దర్శనాలు భక్తులకు లభించవు. తిరిగి 03-10-2025 ఉదయం 6.30 గంటల నుండి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభమగును. కావున పైన తెలిపిన వివరములు మీ దినపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్థన.
9 likes
9 shares
PSV APPARAO
731 views 1 months ago
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #సింహాచలం #సింహాచలం దేవస్థానం 🙏🙏🙏💕💕 #విజయదశమి ప్రెస్ నోట్ శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం – సింహాచలం, విశాఖపట్నం జిల్లా శరన్నవరాత్రి ఉత్సవములు – విజయదశమి శమీ పూజా మహోత్సవము 30 సెప్టెంబర్ 2025 శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి అనుగ్రహంతో, శ్రీసింహాద్రి క్షేత్రములో ప్రతీ ఏటా జరిగే శరన్నవరాత్రి ఉత్సవములు ఈ సంవత్సరము 23-09-2025 నుండి 01-10-2025 వరకు విజయవంతంగా నిర్వహించబడుచున్నవి. ఈ శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా, 02-10-2025 (విజయదశమి) రోజున, శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా శ్రీరామ అలంకరణతో గోవిందరాజ స్వామి రూపంలో శోభాయాత్రగా కొండపై నుండి మెట్ల మార్గం ద్వారా గోవిందరాజ స్వామి సన్నిధి నుండి మధ్యాహ్నం 3.30 గంటలకు కొండ దిగువన గల పూలతోటకు వేంచేయబడును. అక్కడ సాయంత్రం ఘనంగా శమీ పూజా మహోత్సవము (జమ్మి వేట) నిర్వహించబడును. ఆ తరువాత స్వామివారి తీర్థప్రసాదములు భక్తులకు అందించబడును. ఈ సందర్భంగా గ్రామస్తులు, స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ పవిత్రమైన శమీ పూజ మహోత్సవములో పాల్గొని, స్వామివారి తీర్థప్రసాదములను స్వీకరించవలసినదిగా భక్తులను ఆహ్వానించుచున్నాము. ప్రత్యేక సమాచారం: తేది 02-10-2025 (విజయదశమి) నాడు సాయంత్రం 6.00 గంటల నుండి స్వామివారి దర్శనాలు భక్తులకు లభించవు. తిరిగి 03-10-2025 ఉదయం 6.30 గంటల నుండి యథావిధిగా భక్తులకు దర్శనాలు ప్రారంభమగును. కావున పైన తెలిపిన వివరములు మీ దినపత్రికలు, టెలివిజన్ మరియు ఇతర మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా ప్రార్థన.
22 likes
14 shares