పల్లెటూరి సంసారం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.6K views
4 days ago
హిందూ గృహాలలో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి...........!! తులసి మొక్కను ఉంచాల్సిన దిశ ​మీరు హిందూ సాంప్రదాయాన్ని అనుసరించేవారైతే, ఇంట్లో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకోండి. ఇది ఎంతో శుభప్రదమైనది, శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే గొప్ప ఔషధ గుణాలు కలది. మరి హిందూ గృహాలలో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి? ఇంట్లో తులసి మొక్కను ఉంచే దిశ లేదా స్థానానికి సంబంధించి నాలుగు ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. ​హిందూ గృహాలలో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలి? ​తులసి మొక్కను ఇంటి ముందర ఉంచుకోవచ్చు. ​ఇంటికి తూర్పు వైపున ఉంచవచ్చు. ​ఇంటికి ఉత్తరం వైపున ఉంచవచ్చు. ​ఇంటికి ఈశాన్యం (ఉత్తర-తూర్పు) వైపున ఉంచవచ్చు. ​సాధ్యమైతే, ఈశాన్య మూలలో తులసి మొక్కతో పాటు ఒక అరటి మొక్కను కూడా పెంచండి. ఇది ఆర్థిక మరియు ఆస్తికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. #తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
729 views
11 days ago
మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి. ౧. అర్ధ దోషం ౨. నిమిత్త దోషం ౩. స్ధాన దోషం ౪. గుణ దోషం ౫. సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. అర్ధ దోషం ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు. భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు. ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. నిమిత్త దోషం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు. అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు. అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది. ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు. చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది. స్ధాన దోషం ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు. గుణ దోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. సంస్కార దోషం దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి ఓం నమః శివాయ 🕉🕉🕉🕉🕉🕉 #😃మంచి మాటలు #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.1K views
1 months ago
గాజులు అందానికే కాదు...సౌభాగ్యానికి చిహ్నం..........!! గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి.. ఎరుపురంగు గాజులు శక్తిని.. నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని.. ఉదారంగు గాజులు స్వేచ్ఛ ని.. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని.. పసుపు రంగు గాజులు సంతోషాన్ని.. నారింజ రంగు గాజులు విజయాన్ని.. తెల్లరంగు గాజులు ప్రశాంతతని.. నలుపురంగు గాజులు అధికారాన్ని.. ఇలా మట్టిగాజులు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునేమట్టిగాజులకి.. అందుకే సుమంగళి స్త్రీ లు తప్పనిసరిగా ధరిస్తారు. ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా... ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమ తో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం. ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. స్త్రీ వేసుకునే గాజులకి ఇంత విశిష్టత వుంది. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
695 views
1 months ago
ధూపం..లేదా సాంబ్రాణి పొగ...............!! సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు. ఆదివారం : ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే... ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. సోమవారం: దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం: శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి. కంటి దృష్టిలోపాలుండవు. అప్పుల బాధ తొలగిపోతుంది. కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది. బుధవారం : నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది. గురువారం: గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం: లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. శుభకార్యాలు చేకూరుతాయి. అన్నింటా విజయాలుంటాయి. శనివారం : సోమరితనం తొలగిపోతుంది. ఈతిబాధలుండవు. శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
699 views
1 months ago
ఒక్క రాగి చెంబు నీరు – పూర్వీకుల దాహం తీర్చి ఇంట్లో శాంతి, సంపద తెచ్చే సులభ పరిహారం...........!! ఈ చిన్న పరిహారం ఇంట్లో దాగి ఉన్న సమస్యలను (గొడవలు, డబ్బు సమస్యలు, శాంతి లేకపోవడం, అడ్డంకులు) తొలగించడానికి చాలా మంది చేస్తున్నారు. ఇది వాస్తు, పితృదేవతల (పూర్వీకులు) పరిహారంగా పాపులర్ అయింది. ఎవరైనా సులభంగా చేయవచ్చు – ఖర్చు లేదు, మంత్రాలు లేవు, భక్తి మాత్రమే కావాలి. ఎందుకు ఇది చేయాలి? చాలా ఇళ్లలో పూజలు, దీపాలు, శ్రాద్ధాలు అన్నీ సరిగ్గా ఉంటాయి. అయినా సమస్యలు తగ్గవు. కారణం: ఇంట్లో ఉన్న స్త్రీల (భార్య/కోడలు) పుట్టింటి పూర్వీకులు (మామయ్యలు, తాతయ్యలు) ఇంటికి రాలేకపోతారు. వారు బయటే నిలబడి బాధపడతారు. ఆ బాధే ఇంట్లో కష్టాలుగా మారుతుంది (డబ్బు రాకపోవడం, గొడవలు, అనారోగ్యం). ఈ చెంబు నీరు వారికి తృప్తి ఇస్తుంది – వారి దాహం తీరుస్తుంది. ఎలా చేయాలి? (స్టెప్ బై స్టెప్ – చాలా సింపుల్) ఎప్పుడు? అమావాస్య రోజు సాయంత్రం (అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు పూర్వీకులకు ప్రత్యేకం). 1. రెండు చెంబులు తీసుకోండి (రాగి లేదా ఇత్తడి – రాగి బెస్ట్). శుభ్రంగా కడిగి ఉంచండి. 2. ఇంటి బయట (పుట్టింటి పూర్వీకుల కోసం): ఒక చెంబులో నీరు నింపండి (మంచి నీరు). ఇంటి నైరుతి మూల (South-West దిశ – ఇంటి వెనక భాగం లేదా బయటి కుడి వైపు) ఉంచండి. (కొందరు చిటికెడు పసుపు/కుంకుమ వేస్తారు – ఐచ్ఛికం). 3. ఇంటి లోపల (మీ ఇంటి పూర్వీకుల కోసం): మరో చెంబులో నీరు నింపండి. ఇంట్లో తాగునీరు ఉంచే చోట (కిచెన్ లేదా హాల్‌లో) పెట్టండి. 4. ముఖ్యం: రెండు చెంబులు వేరువేరు – ఒకటి బయట, ఒకటి లోపల. ఏమీ చెప్పకుండా, భక్తితో ఉంచండి. తర్వాత రోజు నీటిని మార్చండి (పాత నీటిని తులసి దగ్గర పోయవచ్చు). ఏమి జరుగుతుంది? అమావాస్య నుంచే చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. గొడవలు తగ్గుతాయి, శాంతి వస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతోషం పెరుగుతాయి. 12 అమావాస్యలు (సుమారు 1 సంవత్సరం) క్రమంగా చేస్తే పెద్ద మార్పు కనిపిస్తుందని చాలా మంది అనుభవాలు చెబుతున్నారు. ఇది సాంప్రదాయ విశ్వాసం మాత్రమే. నమ్మితే చేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. మీ ఇంట్లో ఎప్పుడూ శాంతి, సంతోషం, సంపద ఉండాలని కోరుకుంటున్నాము! ఒక్క రాగి చెంబు నీరు... కానీ దాని ఆశీర్వాదం జీవితాన్ని మార్చేస్తుంది! #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు