మనసాంస్కృతిసంప్రదాయాలు

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
693 views
20 days ago
ఇంటి ప్రధాన ద్వారం నిజమైన మన అదృష్ట ద్వారం…........!! ఇక్కడ శక్తి మేల్కొంటే, లక్ష్మి లోపలికి రాకుండా ఎవరూ ఆపలేరు. ప్రధాన ద్వారం కోసం 5 సులభమైన నివారణలు. లక్ష్మి రాక కోసం...... ఇంటి ప్రధాన ద్వారం కేవలం ఒక మార్గం మాత్రమే కాదు; సంపద, అదృష్టం మరియు సానుకూల శక్తి ప్రవేశించే ప్రదేశం కూడా ఇక్కడే. దాని శక్తిని శుద్ధి చేసి మేల్కొలిపితే, ఇంట్లో శ్రేయస్సు మరియు ఆనందం యొక్క ప్రవాహం పెరుగుతుంది. 1. పసుపు-కుంకుమ స్వస్తిక్..... ఎప్పుడు: గురువారం లేదా శుక్రవారం ఉదయం ప్రధాన ద్వారం శుభ్రం చేసి పసుపు మరియు కుంకుమతో స్వస్తికను గీయండి మరియు అక్షత అర్పించండి. ప్రయోజనం: లక్ష్మీ శక్తి ఆకర్షణను పెంచుతుంది. 2. సాయంత్రం దీపం..... ఎప్పుడు: ప్రతి రోజు సూర్యాస్తమయం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రయోజనం: ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 3. గంగా జలం చల్లుకోండి...... ఎప్పుడు: సోమవారం లేదా శుక్రవారం గంగా జలంలో కొద్దిగా కర్పూరం కలిపి తలుపు మీద చల్లుకోండి. ప్రయోజనం: ఇంటి శక్తిని శుద్ధి చేస్తుంది. 4. మామిడి ఆకు తోరణం..... ఎప్పుడు: శుక్రవారం లేదా పౌర్ణమి ప్రధాన ద్వారం వద్ద 5 లేదా 7 మామిడి ఆకుల తోరణాన్ని వేలాడదీయండి. ప్రయోజనం: సానుకూల శక్తి మరియు అదృష్టాన్ని పెంచుతుంది. 5. గంట మరియు ధూపం........ ఎప్పుడు: ఉదయం మరియు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద గంట మోగించి ధూపం లేదా అగరబత్తి వెలిగించండి. ప్రయోజనం: ఆధ్యాత్మిక మరియు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. శుభోదయంతో కూడిన, శుభ్రమైన, సువాసనగల మరియు బాగా వెలిగించిన ప్రధాన ద్వారం లక్ష్మీ ప్రవేశానికి నిజమైన ద్వారం. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
817 views
22 days ago
🌺🌺 *బొట్టు ఎవ్వరు అయినా పెట్టుకోవచ్చు*🥰 ముఖానికి బొట్టు వుండాలి ఎదో ఒకటి అది ద్రుష్టి దోషాలు హరిస్తాయి.🌺 మనలో వెలుగు రేఖలు నింపడానికి సూర్య చంద్రులు అలా వుండేది.. 🌺 ఉదయం స్నానం చేసిన తరువాత ఎవ్వరు వారి ఇంటి దైవానికి బొట్టు పెట్టుకుని నమస్కారం చేసి బయటకు వెళ్ళాలి🌺 ఉండమ్మా.!! బొట్టు పెడతా.!!* * ఇది మన హిందుత్వ ఆచారం.!!*🌺🙏 చివరికి చనిపోయిన శవానికి కూడా బొట్టు పెడతారు కదా మన పెద్దలు.!!🌺🙏 *చందనం గుండ్రంగా పెట్టుకుంటావా.?* *పెట్టుకో.! *అది పూర్ణత్వానికి చిహ్నం.!🌺🙏!* *విభూతి పెట్టుకుంటావా .?* *పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీకం.!!* *ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావలిసిందేగా.!!* 🌺🙏 *నామం పెట్టుకుంటావా.? పెట్టుకో.!* *అది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోమంటుంది.!!*🌺🙏 *కుంకుమ పెట్టుకుంటావా.?* *పెట్టుకో.!* *ఇది సౌభాగ్యానికి సోపానం.!!*🌺🙏 *ఆంజనేయ స్వామి సింధూరం *పెట్టుకుంటావా.?* *పెట్టుకో.!* *అది కాషాయానికి ప్రతీక.!* *త్యాగానికి భూమిక.!!*🌺 *రెండు కనుబొమల మధ్యన ఉండేది ఆజ్ఞాచక్రం.!!* *72 వేల నాడులకు అది నిలయం.!!* *అక్కడ తప్పకుండా ఎదో ఒకటి బొట్టు పెట్టు.!,🌺!* *నీవు బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది.!!*🌺 *బొట్టు పెట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వాడికి పవిత్రమైన భావన కలుగుతుంది.!!*చెడు ఆలోచనలు కలగవు అందుకే పెట్టు బొట్టు.!!*🌺🙏 స్త్ర్రీ కి హుందాతనం కూడా ఇస్తుంది.మొహం చూస్తే ఎలాంటి చెడు భావం వున్నవాడు అయినా మంచి ఆలోచనతో వుంటారు.🙏 జై శ్రీరామ్🙏 #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.3K views
22 days ago
"🪷అక్షింతలు_కలిపేటప్పుడు_ఈ_5_వస్తువులు_కలిపితేనే_అసలైన_ఫలితం! 🙏" ​"🪷అక్షింతల్లో_నీళ్లు_వేసి_కలుపుతున్నారా ? ఆగండి! పచ్చి పాలు ఎందుకు కలపాలో తెలుసుకోండి!" "చాలా మంది అక్షింతలు కలిపేటప్పుడు ఏదో రంగు రావాలని నీళ్లు పోసి కలిపేస్తుంటారు. అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు. శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే "పంచ ద్రవ్యాలు " . అక్షింతలు అంటే 'క్షతము (విరుగుడు) లేనివి' అని అర్థం. అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లకు బదులు పచ్చి పాలు (కాచని పాలు) లేదా ఆవు నెయ్యి వాడటం వెనుక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అక్షింతలు అంటేనే "క్షీణత లేనివి" లేదా "నాశనం లేనివి" అని అర్థం. మనం రోజూ దేవుడిపై అక్షింతలు వేస్తాం, కానీ అ అక్షింతలు కలిపేటప్పుడు ఉపయోగించాల్సిన 5 వస్తువులు ఏంటో, వాటిని పాలతో ఎందుకు కలపాలో, దాని ప్రాముఖ్యత ఏంటో ఈ post లో తెలుసుకుందాము... అమ్మవారి పూజకు లేదా శుభకార్యాలకు వాడే అక్షింతలలో కలపవలసిన ఆ 5 ముఖ్యమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి: ​🌺 అక్షింతలలో కలపాల్సిన 5 వస్తువులు:- బియ్యం గింజలు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం. అందుకే నిండుగా ఉన్న బియ్యాన్ని ఏరుకోవాలి ✨ పసుపు (Turmeric):- ఇది మంగళకరమైనది మరియు క్రిమిసంహారిణి. పసుపు బియ్యానికి రంగును, పవిత్రతను ఇస్తుంది. ✨ ఆవు నెయ్యి (Cow Ghee):- బియ్యానికి పసుపు అంటుకోవడానికి నూనె వాడకూడదు, కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి దేవతలకు ప్రీతికరమైనది. ✨ కుంకుమ (Vermilion):- పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా శ్రేష్ఠం. (పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేసియాలి.. అలాగే ఎరుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు పసుపు వెయ్యాలి ). ✨ పచ్చ కర్పూరం లేదా గంధం (Scented Material):- అక్షింతలకు మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చ కర్పూరం లేదా గంధం పొడి కలపాలి. దేవతలు పరిమళ ప్రియులు కాబట్టి, సువాసన గల అక్షింతలకే వారు ఆకర్షితులవుతారు. ✨ పాలు :- పాలు "పంచగవ్యాల"లో ఒకటి. పచ్చి పాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. ​🌺 అక్షింతల ప్రాముఖ్యత & నియమాలు:- ✨ ఎప్పుడు కలపాలి?:- స్నానం చేసిన తర్వాత మడి బట్టలతో, దేవుడి నామస్మరణ చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి వస్తుంది. ✨ ఎలా వాడాలి?:- అక్షింతలను ఎప్పుడూ కుడి చేతితో, బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు కలిపి వేయాలి. (చూపుడు వేలు తగలకూడదు). ✨ ఫలితం:- ఇలా ఐదు వస్తువులతో కలిపిన అక్షింతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ​🥛 నీళ్లకు బదులు పాలు లేదా నెయ్యి ఎందుకు వాడాలి? ✨ ​పవిత్రత (Purity):- ముందు చెప్పుకున్నట్టు పాలు "పంచగవ్యాల"లో ఒకటి. పచ్చి పాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరు త్వరగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆవు పాలు లేదా నెయ్యి దైవిక శక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. ✨ జీవశక్తి (Life Force):- బియ్యం గింజను భూమిలో నాటితే మొలకెత్తుతుంది, అంటే అందులో జీవం ఉంటుంది. ఆ జీవానికి పాలు తోడైతే, ఆ అక్షింతలకు ఒక విధమైన 'చైతన్యం' వస్తుంది. అందుకే దేవతలను ఆహ్వానించడానికి ఇవి వాడతారు. ✨ సుస్థిరత (Durability):- నీళ్లతో కలిపితే బియ్యం మెత్తబడి, త్వరగా పాడైపోయే (బూజు పట్టే) అవకాశం ఉంటుంది. అదే పాలు లేదా నెయ్యితో కలిపితే బియ్యం గింజలు గట్టిగా, నిగనిగలాడుతూ చాలా కాలం నిల్వ ఉంటాయి. ✨ మంగళకరం:- పసుపు, పాలు కలిసినప్పుడు ఒక రకమైన 'సౌమ్యమైన' శక్తి విడుదలవుతుంది. ఇది ఇంట్లో శాంతిని, శుభాన్ని కలిగిస్తుంది. ​🤔 దీని ప్రాముఖ్యత ఏమిటి? 🌺 మనం పూజలో అక్షింతలు వేస్తున్నామంటే దేవుడిని మన ఇంటికి రమ్మని లేదా మన పూజను స్వీకరించమని కోరుకోవడం. అంతటి పవిత్రమైన పిలుపు కోసం వాడే వస్తువు అత్యంత శ్రేష్ఠంగా ఉండాలి. 🌺 ఆకర్షణ శక్తి ఉంటుంది.. పాలతో కలిపిన పసుపు అక్షింతలకు మంత్ర శక్తిని గ్రహించే గుణం ఎక్కువ. మనం పూజలో మంత్రాలు చదివినప్పుడు ఆ శక్తి అక్షింతల్లోకి వెళ్తుంది. ఆ అక్షింతలను మనం తల మీద వేసుకున్నప్పుడు ఆ మంత్ర శక్తి మనకు అందుతుంది. ​"మనం రోజూ దేవుడిపై అక్షింతలు వేస్తాం, కానీ ఆ బియ్యంలో నెయ్యి, పచ్చకర్పూరం కలిపి చూడండి.. ఆ పరిమళానికి మీ పూజా గది ఒక దేవాలయంలా మారిపోతుంది. వినాయకుడికి పసుపు అక్షింతలు, అమ్మవారికి ఎర్రటి అక్షింతలు అత్యంత ప్రీతికరం!" ముఖ్యంగా అమ్మవారి పూజకు పచ్చి పాలతో కలిపిన అక్షింతలు వాడి చూడండి, మీ పూజా గదిలో ఒక తెలియని ప్రశాంతత వస్తుంది!" 🙏🌺 ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏 #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
800 views
25 days ago
*స్త్రీలు ధరించే నగల వెనుక ఉపయోగాలు ఎమిటి* వడ్డానము: గర్భకోశము కదిలి లొపలున్న శిశువు వికారంగ పుట్టకుండా చేస్తుంది అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వార ఆహారంగా తీసుకుంటే ఎంతొ ఫలితం ఇస్తుంది , అలాగే బంగారాన్ని ఎ రూపంలొ ధరించినా ఎంతొ కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ముక్కర : దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెపుతుంది ముక్కర ధరించడం వల్ల ముక్కు కొన పైన ఎదొ విధంగా దృష్టి ఉంటుంది అలా దృష్టి ఉండటం ద్యానం లొ ఒక భాగం అలాగే భార్య భర్తలు కలుసుకున్న సమయాల్లొ స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారొగ్యం అలాంటి చెదు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కర పవిత్రం చేస్తుంది మెట్టెలు : గర్భకొశంలొ ఉన్న నరాలకు కాలి వేలికి ఉన్న నరాలకు సంభందం ఉంటుంది , దానితొపాటు స్త్రీ కామాన్ని అదుపులొ ఉంచుకొవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి . నేలను తాకరాదు కామాన్ని పెంచే నరాలు కుడి కాలి వేళ్ళలొ ఉన్నాయి చంద్రవంక: శిరొమద్య ప్రదేశం లొ ధరిస్తారు ఆ ప్రాంతం నుండే మన జీవనాదారమైన ప్రాణవాయువు బ్రహ్మరంద్రం నుంచి హృదయం లోనికి ప్రవేశిస్తాడు అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు గాజులు : రక్తప్రసరనను అదుపులొ ఉంచుతాయి కంఠానికి వేసుకునే హారాలు : హృదయంలొ పరమాత్ముడు ఉన్నాడు ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించడం . తెలిసి తెలియక చేసిన పాపాలను బంగారం పొగొడుతుంది , బంగారాన్ని ధరించడం ద్వార చెడు కలలు రాకపొవడమే కాక గుండెకి సంభందించిన వ్యాదులను కూడా అరికడుతుంది అలంకారనికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి పూర్వం రాజులు చక్రవర్తులు అతిసన్నని బంగారు రేకులు చెయించుకొని వేడి అన్నం మీద వేసేవారు వెనువెంటనే బంగారపు రేకు కరిగి అన్నంలొ కలిసిపోయేది అల వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
752 views
27 days ago
*దైవాన్ని కోరిక ఎలా కోరాలి*🪷🙏Arunachalasiva 🪷🙏 *1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.* 2. *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.* 3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..* 4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.* 5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..* 6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...* 7. *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..* *8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..* *మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది. 🪷సర్వే జనాః సుఖినోభవంతు 🪷 #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
781 views
29 days ago
#తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు చేతితో భోజనం ఎంత ఉపయోగమో! 💥💥💥💥💥💥💥💥💥💥💥 డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని. అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం. ఇది చదివాక ఎక్కడున్నా…? మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు...... 1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. 2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట. 3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. 4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. 6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట. 7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట. 8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. 9.చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది. 10.శుభ్ర౦చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా… *చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట. *బొటనవేలు:అగ్నితత్వం *చూపుడు వేలు:వాయుతత్వం *మధ్యవేలు:ఆకాశం *ఉంగరపు వేలు:భూమి *చిటికిన వేలు:జలతత్వం.. ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ఫ్యాషన్ కి ఇచ్చినంత విలువ ..సంస్కృతికి ఇస్తే ...మానవ జీవనం కొంత సరళమవుతుందనుకుంటా... Forwarded..
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
748 views
1 months ago
స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం...........!! సు+ఆస్తిక్ = స్వ‌స్తిక్…. అంటే మంచి క‌లుగుగాక‌.! అస‌లు ఈ స్వ‌స్తిక్ చిహ్నం విశిష్ట‌త‌, పుట్టు పూర్వోత్త‌రాల గురించి తెలుసుకుందాం.! స్వస్తిక్ గుర్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన. భార‌తీయులు స్వ‌స్తిక్‌ ను ఎంతో ప‌విత్ర‌మైందిగా భావిస్తారు. దేశంలో అనేక మ‌తాల‌కు చెందిన వారు దీన్ని ఆధ్యాత్మికంగా ఉప‌యోగిస్తారు. సుమారుగా 12వేల ఏళ్ల కింద‌టి నుంచి స్వ‌స్తిక్ మ‌నుగ‌డ‌లో ఉంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు.. అనేక దేశాల‌కు చెందిన వారు స్వస్తిక్‌ను, దాన్ని పోలిన చిహ్నాల‌ను అనేక వేల సంవ‌త్స‌రాల నుంచి ఉప‌యోగిస్తున్నారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంల‌లో, టిబెట్‌, చైనా, జ‌పాన్‌, గ్రీస్‌, అజ్టెక్‌, సెయ్లాన్‌, హోపి, సెల్ట్‌, బాలి, మాల్టా, ల్యాప్‌లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ప్ర‌జ‌లు వాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని మెజిన్ అనే ప్రాంతంలో ఓ ఏనుగు దంతంపై చెక్క‌బ‌డిన ప‌క్షి బొమ్మ‌లో స్వ‌స్తిక్ చిహ్నాన్ని గుర్తించారు. అది సుమారుగా 13వేల ఏళ్ల కింద‌టిద‌ని నిర్దారించారు. సంస్కృతంలో సు అంటే మంచి, శుభం అని అర్థాలు వ‌స్తాయి. అలాగే అస్తి అంటే క‌లుగు గాక అని అర్థం వ‌స్తుంది. రెండింటినీ క‌లిపితే సు + అస్తి = స్వ‌స్తిగా మారుతుంది. అంటే మంచి ఆరోగ్యం లేదా శుభం క‌లుగుతుంది అని అర్థం అన్న‌మాట‌. అందుక‌నే ఈ చిహ్నం త‌మ‌కు అన్ని విధాలుగా మంచి చేస్తుంద‌ని చెప్పి అనేక మంది దీన్ని వాడ‌డం మొద‌లు పెట్టారు. స్వ‌స్తిక్ చిహ్నంలో ఉండే నాలుగు శాఖ‌లు ప్ర‌కృతి పున‌ర్జ‌న్మ‌ను సూచిస్తాయి. అంటే జీవుల పుట్టుక‌, మ‌ర‌ణం ఒక‌దాని త‌రువాత ఒక‌టి నిరంత‌రాయంగా జ‌రుగుతుంద‌ని అర్థం. స్వ‌స్తిక్ చుట్టూ వృత్తాన్ని గీస్తే వ‌చ్చే చిహ్నం సూర్యున్ని ప్ర‌తిబింబిస్తుంది. అది కాంతికి జ‌న్మ‌స్థానంగా చెప్ప‌బ‌డుతుంది. అది విశ్వంలో న‌లువైపులకు వ్యాపిస్తుంది. స్వ‌స్తిక్‌కు ఉండే నాలుగు రేఖ‌లు నాలుగు దిక్కుల‌ను కూడా సూచిస్తాయి. ఉత్త‌రం, ద‌క్షిణం, తూర్పు, ప‌డ‌మ‌ర దిక్కుల‌ను అవి సూచిస్తాయి. స్వ‌స్తిక్ మ‌ధ్య‌లో ఉండే స్థానం హిందూ దైవం విష్ణువును సూచిస్తుంది. విష్ణువు నాభిలో నుంచి బ్ర‌హ్మ పుట్టాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్ మ‌ధ్య స్థానం నుంచి విశ్వం ఆవిర్భ‌వించి విస్త‌రించింద‌ని చెబుతారు. స్వ‌స్తిక్ మ‌ధ్య భాగాన్ని దైవానికి ప్రతీక అని భావిస్తారు. స్వ‌స్తిక్ చిహ్నంలో ఒక రేఖ‌ను బ్ర‌హ్మదేవుడిగా భావిస్తారు. మ‌రొక రేఖ‌ను నాలుగు వేదాల‌ని చెబుతారు. మ‌రొక రేఖ‌ను నాలుగు పురుషార్థాల‌ని భావిస్తారు. ఇంకో రేఖ‌ను పౌరులు పాటించాల్సిన ఆశ్ర‌మ ధ‌ర్మాల‌ని చెబుతారు. వేదాలు నాలుగు – రుగ్వేదం, సామ‌వేదం, య‌జుర్వేదం, అథ‌ర్వ‌ణ వేదం. పురుషార్థాలు కూడా నాలుగు – ధ‌ర్మ‌, అర్థ‌, కామ‌, మోక్షాలు. ఆశ్ర‌మ ధ‌ర్మాలు కూడా నాలుగు – బ్ర‌హ్మ‌చ‌ర్య‌, గృహ‌స్థ‌, వాన‌ప్ర‌స్థ‌, స‌న్యాస ధ‌ర్మాలు… బౌద్ధులు స్వ‌స్తిక్ చిహ్నాన్ని ప్ర‌తిభా పాట‌వాల‌కు, నైపుణ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో స్వస్తిక్ చిహ్నాన్ని ఆధ్యాత్మిక‌త‌కు చిహ్నంగా ఉప‌యోగిస్తారు. నొవాజో అనే ఓ తెగ‌కు చెందిన వారు స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనారోగ్యాల‌ను న‌యం చేసేందుకు నిర్వ‌హించే ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో వాడుతారు. అయితే జ‌ర్మ‌న్ నియంత హిట్ల‌ర్ కూడా స్వ‌స్తిక్ చిహ్నాన్ని త‌న నాజీ సైన్యంలో ఉప‌యోగించాడు. అందువ‌ల్ల స్వ‌స్తిక్‌ను చెడు అనుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. మ‌న దేశంలో ఆర్యులు జ‌ర్మ‌నీ దేశానికి చెందిన పూర్వీకులు అని హిట్ల‌ర్ న‌మ్మేవాడు. అందుక‌నే మ‌న దేశంలో ఎక్కువ‌గా ఉప‌యోగించే స్వ‌స్తిక్ చిహ్నాన్ని హిట్ల‌ర్ త‌న నాజీ సైన్యం చిహ్నంగా ఉప‌యోగించాడ‌ని చెబుతారు. ఇక స్వ‌స్తిక్ చిహ్నాన్ని అనేక ర‌కాలుగా ప్ర‌స్తుతం అనేక మంది వాడుతున్నారు. వాటిల్లో రెండు ర‌కాలు ప్ర‌ధానంగా ఉన్నాయి. స్వస్తిక్, ఓం, త్రిశూలం అనే మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి. అయితే స్వస్తిక్ గుర్తులు, పటాలు పాదాలు తాకేలా వుండకూడదు. స్వస్తిక్‌ను డోర్‌కు అతికించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా స్వస్తిక్‌ రంగ వల్లికలు పూజా గదిలో అలంకరించుకుని పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
787 views
1 months ago
అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి....!! పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి. విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది. తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి , చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి. పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది. షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది. అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు. నవమి రోజున - నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి. దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది. వారాలలో ఏ నైవేద్యం.... ఆదివారం రోజు - పాలు సోమవారం - పాయసం మంగళవారం - అరటిపళ్ళు బుధవారం - వెన్న గురువారం - పటికబెల్లం శుక్రవారం - తీపి పదార్ధాలు శనివారం - ఆవు నేయి అమ్మవారికి ఇష్టమయిన అన్నం పులగం - అన్నం + పెసరపప్పు పాయసన్నం పెరుగు అన్నం బెల్లం అన్నం నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
799 views
1 months ago
పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో ఏ ప్రకారం ఏర్పాటు చేయాలి.......!! శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి. మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు పటాపంచలవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
853 views
1 months ago
గృహ‌ప్ర‌వేశం ఎలా.... ఏదీ మంచి ముహూర్తం.................!! గృహ‌ము నిర్మాణం అయిన త‌ర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ గృహ ప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితులకు విందు మొదలైనవి ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమైనవి. అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విష‌యం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్ప‌వ‌చ్చు. అయితే కార్తీక, మృగశిర మాసాలు మధ్యమ ఫలప్రదాలు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది. రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమ‌ని శాస్త్రం చెబుతోంది. దక్షిణ సింహద్వారం ఉన్న గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభ‌క‌ర‌మైన‌వి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికి రాదు. దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి.. గృహ ప్రవేశం చేయాలంటే పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహ‌ప్ర‌వేశానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. ఇక‌ ఆదివారం, మంగళవారంలో గృహ ప్రవేశం అశుభప్రదమ‌ని చెప్ప‌వ‌చ్చు. చవితి, నవమి, చతుర్థీ తిథులను విడిచిపెట్టి, పౌర్ణమి, సప్తమి, అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంకా.. శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు కూడా గృహ ప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. గృహ‌ప్ర‌వేశం ఎలా..? నూత‌న గృహ‌ప్ర‌వేశం ఎలా అనే విష‌యం కూడా ముఖ్య‌మే. ధర్మ సింధు శాస్త్రం ప్రకారం ఆచరించవలసిన పద్ధతి గ‌మ‌నిస్తే... గృహ యజమాని ధర్మపత్నితో సహా మంగళ స్నానాలు చేయాలి. బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు, ముహూర్త సమయాని కంటే కాస్త ముందుగానే చేరుకోవాలి. గృహ ద్వారం వద్ద దూడతో ఉన్న ఆవును పూజించి దానికి ఇష్టమైన ఆహారంను పెట్టాలి. అష్ట దిక్కుల, భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తు వరుణ దేవతలకు మృష్టాన్నం, వసంతంతో నింపిన గుమ్మడికాయ బలిహరణం (ఉద్దిబేడలు, పెసరపప్పు, బియ్యము, పసుపు, సున్నము కలిపి వండిన అన్నం) ఇవ్వాలి. దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టాలి. కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించాలి. దీనినే గంగపూజ అంటారు. శుభ ముహూర్తాన దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్ర‌ధాన గ‌డ‌ప దాటవ‌లెను. అనంత‌రం పాలు పొంగించి, క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తు పూజకు ముందు వినాయ‌క పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడ‌దు. #తెలుసుకుందాం #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #పల్లెటూరి సాంప్రదాయాలు