ఆండాళ్ తిరువడిగలే శరణం

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
965 views
3 months ago
*శ్రీ గోదా ద్వాదశనామస్తోత్రం* *ప్రథమం గోదా నామ* *ద్వితీయం రంగనాయకీం* *తృతీయం ఆముక్తమాల్యదా నామ* *చతుర్ధం లోకజననీం* *పంచమం విష్ణుచిత్తాత్మజా నామ* *షష్ఠం అకారత్రయోపాసినీం* *సప్తమం మణిమేఖలా నామ* *అష్టమం మంజుభాషిణీం* *నవమం తులసీకాననోద్భవాం నామ* *దశమం యతిరాజభగినీం* *ఏకాదశం నాదాత్మికా నామ* *ద్వాదశం మోక్షదాయినీం* *ఇతి శ్రీగోదా ద్వాదశనామ స్తోత్రం* #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 #ఆండాళ్ తిరుప్పావై పాశురం #ఆండాళ్ #ఆండాళ్ తిరువడిగలే శరణం #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు)
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1K views
3 months ago
తిరుప్పావై 7వ రోజు పాశురము 🍃🌷పాశురము: PASURAM 7🙏🙏🙏🙏🙏 కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్, కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే, కాశుం పిఱప్పుం కలకలప్ప కైపేర్తు, వాశ నఋంకుళ’లాయిచ్చియర్, మత్తినాల్ ఓశై ప్పడుత్త త్తయిరరవం కేట్టిలైయో, నాయగ ప్పెణ్పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి, కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో, దేశముడైయాయ్ తిఱవేలోరెంబావాయ్ ॥ 7 ⚜️🌷🌷⚜️🌷🌷⚜️🌷🌷⚜️ 🌷భావము: "కీశు కీశ్ ఎన్ఱ్" పక్షులు మాట్లాడుతున్నాయి. "కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో" పక్షులు వాటి ఆహారంకోసం వెల్లడానికి ఒకదానితో ఒకటి కలిసి ఎడబాస్తున్నామే అని బాధతో మట్లాడుతున్నాయి. నీకు వినబడట్లేదా. కేవలం మేం నిలుచున్న చెట్టుమీది పక్షులేకాదు, "ఎంగుం" అన్ని చెట్లమీది పక్షులూ అరుస్తున్నాయి, అంటూ అండాళ్ తల్లి "ఆనైచ్చాత్తన్" భరద్వాజ పక్షి గురించి చెబుతుంది. ఈ పక్షులు కేరళ తమిళనాటి తీర ప్రాంతాల్లో ఉంటాయి, చిలుకలవలె మాట్లాడగల పక్షులు. ఇక్కడ భరద్వాజ ఋషిని గుర్తు చేస్తుంది అండాళ్ తల్లి. రాముడు వనవాసానికి వెల్లి నప్పుడు ఒక రోజు భరద్వాజ ఆశ్రయంలో ఉండి వెళ్తాడు. తరువాత భరతుడు రాముణ్ణి వెతుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు భరద్వాజుడు భరతునికి ఉన్న రామ భక్తి ని పరిక్షిస్తాడు. ఏపాపం చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. దానికి భరతుడు నీవు త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం అని విలవిలా ఏడిచాడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విళాసాలు కల్గి ఉన్న ఒక నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. అప్పుడు భరద్వాజుడు భరతునితో నాకున్న తపస్సంపద అంతా వినియోగించానయ్యా సార్తకమైంది అని చెప్పాడు. భరద్వాజుడు ఒక్క పురుష ఆయిస్సు వేద అద్యయణం కాగానే తనకు ఇంకొక పురుష ఆయిస్సు కావాలంటూ తపస్సు చేయటం ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరొక పురుష ఆయస్సు భరద్వాజునికి పెంచాడు. మాళ్ళీ వేద అద్యయణం చేసి అదీ సరిపోనట్లనిపించింది, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. అలా మూడు పురుష ఆయిస్సులు పూర్తయ్యాక మళ్ళీ ఆయనకు ఏం సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతట వచ్చి, ఎం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయిస్సు అని అడిగాడు, అయితే ప్రజాపతి ఆయననకు ఒక్క సారి కళ్ళల్లో మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికెడులు కనిపించజేసాడు. భరద్వాజుడితో నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు దాన్ని ఆచరించు అని చెప్పాడు. కాబట్టి ఆయనకు తెలిసింది రామభక్తుని సేవ. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఈ సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయిష్యులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆండాళ్ తల్లి అలాంటి పేరు కల్గి ఉన్న పక్షిని చెబుతుంది అంటే అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు "పేయ్ ప్పెణ్ణే" పిచ్చిదానా అని లోపల ఉన్న గోప బాలికను అంటుంది. గోకులంలో గోపికలకు నిత్యకర్మ పెరుగులు చిలకడం, అది వారు భగవత్ ఆరాధనగా భావించి చేసేవారు. దానికి వారు స్నానం ఆచరించి, పువ్వులు దరించి ఇవన్నీ భగవత్ సేవ అని భావిస్తూ చేసేవారు. అక్కడి గోవులు కృష్ణ కర స్పర్శచే పెరిగినవి కావటంచే అవిచ్చే పాలు అంత చిక్కనివి, ఇక పెరుగు ఇంకా చిక్కగా ఉండేది, వీళ్ళకు పెరుగు చిలకడం కష్టంగా ఉండేది, ఇక కృష్ణ నామ స్మరణ చేస్తూ చేసేవాళ్ళు. వాళ్ళు పాలు కాచినా, పెరుగు చిలికినా, వెన్న దాచినా అన్నీ కృష్ణుడి కోసమే. కృష్ణుడు వెన్న దోంగిలించడం కూడా వారికి ఇష్టమే, ఒక్క రోజు కన్నయ్య వెన్న దోంగిలించకుంటే వారికి భాదగా ఉండేది, వెన్న దాచటం, కృష్ణుడు వెన్న దొంగిలించటం ఇవన్నీ వారికి ఒక సరదా. ఇవి తప్ప వారికి వేరే స్వార్థం కూడా ఏమి ఉండేది కాదు, కృష్ణుడి క్షేమం తప్ప వాళ్ళకంటూ ఏమి కోరేవారు కాదు. "కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు" గోపికలు వెన్న చిలుకుతుంటే దేహంపై ఉండే ఆభరణాలు గలగలా శబ్దం చేస్తున్నాయి, "వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్" గోపికల జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా పరిమళాన్ని విరజిమ్ముతున్నాయి. "మత్తినాల్ ఓ శై పడుత్త తయిర్ అరవం" కవ్వముతో పెరుగు చిలికే శబ్దం "కేట్టిలైయో" వినబడలేడా. "నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!" ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందర నడిచి మమ్మల్ని వెంట తీసుకెల్లాల్సినదానివి, హాయిగా నిద్ర పోతున్నావా అంటూ ఆక్షేపించసాగారు." నారాయణన్ మూర్ త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో" పెరుగులు చిలికే గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావేమి" అని అడుగుతున్నారు. ఏమిటా నామాలు అంటే "నారాయణ" సర్వ జగత్తును లోపల పెట్టుకున్న స్వామి, మరి అంతవాడు మనకేం అందుతాడు అనుకోకుండా, మూర్తీభవించిన అందమేనా అన్నట్టుగా ఉన్న చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన "మూర్తి" మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. కేవలం అందమైనవాడేనా! కాదూ, మనం కృష్ణున్ని సేవించుకోవడానికి వచ్చే అడ్డుకూడా ఆయనే తొలగించుకొని తనను మనకు ఇచ్చుకొనేవాడు, "కేశవన్" కేశి అనే గుఱ్ఱం రూపం లో ఉన్న రాక్షసున్ని సంహరించినవాడు. కృష్ణుడు ఆడుకుంటుంటే ఒక అసురుడు గుఱ్ఱంలా వచ్చి నోరు తెరిచాడు, తెరిచిన ఆ నోరులో చేతుపెట్టాడు కృష్ణుడు, చిన్న పిల్లాడు కదా ఆనందంతో ఉబ్బిపోయాడు. ఆయన తగ్గి పోగలడు, ఉబ్బిపోగలడు. తగ్గితే వామనుడయ్యాడు, ఉబ్బిపోతే త్రివిక్రముడయ్యాడు. అలా ఉబ్బిన చేయివల్ల ఆ అసురుడు సంహరింపబడ్డాడు. అలా మనకు ఉపకారం చేసే వాడి నామాన్ని పాడుతుంటే నీవు వచ్చి మాతో కల్సి పాడొచ్చుకదా. లోపల గోప బాలిక, తను లేచి వస్తే వీళ్ళెక్కడ నామాన్ని పాడటం ఆపేస్తారేమోనని కాబోలు లేవటం లేదు. కానీ ఆమె లోపలనుండి భగవత్ నామ స్మరణ చేయడంచే ఆమెలో ఒక తేజస్సు మన వాళ్ళకి కనిపించింది. "తేశం ఉడైయాయ్" భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా "తిఱవ్" రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అని ఆండాళ్ తల్లి పిలుస్తుంది . మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గమనించాలి. *ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం...🙏🙏 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 #ఆండాళ్ తిరుప్పావై పాశురం #ఆండాళ్ తిరువడిగలే శరణం #ఆండాళ్ #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు)
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.3K views
3 months ago
అజ్ఞానం నుంచి మేలుకొలుపు! ఆరో పాశురం PASURAM 6 🙏🙏🙏🙏🙏 పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచి వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం మెళ్ళ ఎళుంద్ వారి ఎన్జీన్జ పేరరవం ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్ ఆరవ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పిన వర్ణనలు ఉన్నాయి. పూర్వా చార్య సంప్రదాయానుసారం ఈ తొమ్మిది పాశురాలు ఆండాళ్ తన 'తండ్రులై'న ఆళ్వారులకు (మధురకవి ఆళ్వార్ కాకుండా) పాడిన మేల్కొలుపు (ఆల్వార్కళ్ తిరుపళ్ళియు లొచ్చి)గా పరి గణన పొందుతోంది. ఇంకా నిద్రపోతున్న మొట్టమొదటి భక్తురాలిని ఆండాళ్ ఈ పాశురంలో ఇలా నిద్ర లేపుతోంది: “పక్షుల కిలకిలారావాలు ఇంకా నీ చెవిని పడలేదా? ఆలయంలో గరుడారూఢుడైన భగవానుని సుప్రభాతసేవలో పూరించిన శంఖనాదం వినిపిం చటం లేదా? పూతనాసంహారం, శకటాసురభంజనం చేసి, ఆదిశేషునిపై యోగనిద్రలో ఉన్న పరమాత్ముణ్ణి మునులు, యోగిపుంగవులు తమ హృదయాలలో ప్రతిష్ఠించి ఏడు మార్లు గావిస్తున్న హరినామస్మరణ పవిత్రఘోష మాకు వినిపించి మేము నిద్ర మేల్కొన్నాం సఖీ, నువ్వూ నిద్ర లేచిరా!" విషాన్ని స్తన్యంగా ఇచ్చిన పూతన సంహారం, బండి రూపంలో చంపవచ్చిన రాక్షసుడిని పసికాలితో తన్ని చేసిన శకటాసురవధ శ్రీమద్భాగవతంలో తొట్టతొలిగా వర్ణించిన కృష్ణలీలలు. "ఈ లీలలను తలచుకొని ఉప్పొంగి పోతూ, 'హరీ, హరీ!' అని శేషసాయిని స్తుతిస్తూ సాధు జనులు నెమ్మదిగా.... తమ హృదయస్థుడైన పరమాత్మ నుంచి మనసు చెదరకుండా, అతి నెమ్మదిగా తమ యోగనిద్ర నుంచి మేల్కొని చేసే అఖండ నామోచ్చారణ గొప్ప మేఘనాదమై నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుంటే చెవినబడి మేము నిద్రలేచాం. చెలీ! నీవు కూడా లే!" అంటోంది ఆండాళ్. _అందరం ఆయన కింకరులం_ భగవద్- భాగవత అనుభవంలో ఏ మాత్రం అవగాహన లేని గోపికను ఆండాళ్ 'పిళ్ళాయ్!' అని సంబోధిస్తోంది. “నీకు భాగవతానుభవం కొత్త కాబట్టి అజ్ఞానమనే తన మాయ ముసుగులో నిద్ర మత్తు నిన్ను గట్టిగా బంధించింది. ఈ 'పిల్లతనమనే (అజ్ఞానం) నిద్రను విదిలించి, భాగవతా నుభవంలోని రసాన్ని రుచి చూడు. ఆ రసా స్వాదనలో విశేషజ్ఞురాలివి కావాలి. లే! భగవానుడు హంసావతారం దాల్చితే ఆచార్యవర్యులు ఆయన కృపావిశేషం వల్ల పరమహంస లైనారు. వారు మనకు ఉపదేశం ఇస్తున్నారు. "భోగాలు దుఃఖకారకాలు. మేల్కొనగానే 'హరి'ని తలుచుకుంటాం. నడయాడేటప్పుడు 'కేశవుని' స్మరిస్తాం. భుజించేటప్పుడు 'గోవింద' నామం జపిస్తాం, 'మాధవుని' తలచుకుంటూ నిద్రిస్తాం. మునులు, సాధువులు చేసే హరినామస్మరణ గొప్ప ఘోషగా ప్రతిధ్వనిస్తోంది” అంటూ ఆండాళ్ సఖిని మేల్కొల్పుతున్నది. ఆండాళ్ తిరువడిగళే శరణం🙏 #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు) #ఆండాళ్ తిరువడిగలే శరణం #ఆండాళ్ తిరుప్పావై పాశురం #ఆండాళ్ #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏