భక్తి...జ్ఞానం...ఆధ్యాత్మికత

🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
586 views
8 hours ago
*🌿🌼"పళని" గాలి పీల్చిన వారికి దోషాలు హరించుకు పోతాయని ప్రతీతి🌼🌿* తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే కలదు. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే అవి చాలా ఉన్నాయి. కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షన్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ - ఇలా ఎన్నో పేర్లు కలదు.🌼🌿 🌿🌼తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామి గల వైభవ ఆలయాలలో 'పళని' ప్రముఖమైంది. ఈ పుణ్య నామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురు ప్రియ పుత్రులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్తారు. వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివ దేవుడు జాలిపడి 'అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి 'ఫలం - ని'! నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు' అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన 'పళని' రూపు దిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!. పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది!. దీనిని 'మురుగన్ కొండ' అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై 'ఏరియల్ రోప్ - వే' ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణకోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!. మెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి.🌼🌿 ఓం శం శరవణభవ __________________________________________ HARI ✍🏻🙏 __________________________________________ #🌅శుభోదయం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #శ్రీ వల్లీ దేవా సమేత సుబ్రహ్మణ్యస్వామి #🕉️🙏శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః🙏🕉️
🌿♥️🌹🧿 యద్భావం తద్భవతి🧿🌿🌹♥️🧿
610 views
8 hours ago
*శ్రీ ఆదిశంకరాచార్య జయంతి* ఆది శంకరుల జన్మస్థలం కేరళ రాష్ట్రంలోని కాలడి. ఆయన క్రీ.పూ. 509వ సంవత్సరంలో నందన నామసంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద నక్షత్రంలో ఆర్యాంబ, శివగురు దంపతులకు జన్మించారు. శంకరుడంటే కారణజన్ముడు. జగద్గురువు. వివిధ దేవీదేవతలపై స్తోత్రాలు రచించారు కాబట్టి కేవలం కవి కాదు. వేదాంతానికి చెందిన ప్రకరణ భాష్యాలను ప్రవచించారు కాబట్టి పండితుడు, వైరాగ్య పూర్ణుడైన తత్వవేత్త మాత్రమే కాదు. ధర్మస్థాపకుడు. ఆసేతుశీతాచలం ఆర్యావర్తమంతా గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేసినవాడు. ఆ సిద్ధాంతాన్ని ఆదిశంకరులు స్తోత్రాలుగా, ఉపదేశాలుగా, ప్రకరణాలుగా, భాష్యాలుగా... ఇలా పలురకాలుగా విడమరిచారు. అద్వైతాన్ని ఒక జీవనవిధానంగా అలవాటు చేసేందుకు గానూ దేశానికి నాలుగువైపులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. కంచిలో మూలామ్నాయ శంకరపీఠాన్ని నెలకొల్పారు. భారతీయుల తత్త్వదర్శనాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లిన ఘనుడు. __________________________________________ HARI ✍🏻🙏 __________________________________________ #🌅శుభోదయం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతి #😃మంచి మాటలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
621 views
8 days ago
లలితాదేవి -- పంచ బ్రహ్మల అధిష్టాన శక్తి...........!! ​లలితాదేవి పటంలో కనిపించే దృశ్యం కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, అది శక్తి యొక్క అత్యున్నత రూపాన్ని సూచించే ఒక తాత్విక ప్రతీక. మీరు ఉదహరించిన **"లలితా సహస్రనామ స్తోత్రం"**లోని నామాలు దీనికి ఆధారాలు. ​"పంచ బ్రహ్మసనాసీనా": అంటే ఐదుగురు బ్రహ్మల (బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ) సింహాసనంపై కూర్చున్నది అని అర్థం. ఈ ఐదుగురు బ్రహ్మలు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన (లయం), మరియు అనుగ్రహం అనే ఐదు "పంచకృత్యాలను" నిర్వహిస్తారు. ​"పంచ ప్రేత మంచాధీశాయినీ": ఈ నామానికి ఐదుగురు మరణించిన వారి (పంచ ప్రేత) మంచంపై కూర్చున్నది అని అర్థం. ఇక్కడ పంచ ప్రేతలు అంటే తమ స్వంత శక్తులను ప్రదర్శించలేని ఐదుగురు బ్రహ్మలు. ​శివ-శక్తి అవిభాజ్యత............ ​ఇక్కడ చెప్పినట్లుగా, "శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం" అనే సూత్రం శివ మరియు శక్తి యొక్క అవిభాజ్య సంబంధాన్ని వివరిస్తుంది. శక్తి లేకపోతే శివుడు కూడా తన కార్యాలను నిర్వహించలేడు. లలితాదేవి పటంలో శివుడు సింహాసనంగా ఉండటం, మిగతా నలుగురు బ్రహ్మలు సింహాసనానికి కాళ్ళుగా ఉండటం ఆ పరాశక్తి యొక్క సర్వోన్నత స్థానాన్ని సూచిస్తుంది. ఈ ఐదుగురు బ్రహ్మలు ఆ పరాశక్తి సహాయంతోనే పంచకృత్యాలను నిర్వహిస్తారు. ​చిత్రణలోని అంతరార్థం....... ​ఇక్కడ చూసిన పటంలోని అంతరార్థం ఏమిటంటే: ​సింహాసనం: ఇది సృష్టిలోని అన్ని శక్తులపైన లలితాదేవికి ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. ​శివుడు: శివుడు పరాశక్తిని ధరించి, ఆమెకు ఆధారాన్ని ఇస్తున్నాడు. శక్తి లేకపోతే ఆయన కూడా నిర్గుణుడు, నిష్క్రియుడు. ​నలుగురు బ్రహ్మలు (బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర): వీరు సృష్టి, స్థితి, లయ, మరియు ఇతర కార్యాలను నిర్వహిస్తారు. వీరు లలితాదేవికి ఆధీనంలో ఉండి, ఆమె ఇచ్చే శక్తితో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు. ​ఈ పటం "శక్తియే మూలమైనది" మరియు శక్తి ద్వారానే సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి అనే సనాతన ధర్మాన్ని సూచిస్తుంది. #తెలుసుకుందాం #భక్తి...జ్ఞానం...ఆధ్యాత్మికత #మన ఆధ్యాత్మికత #☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #lalitha tripura sundari