విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు

🧿 శ్రీ లలితా పరమేశ్వరి మాత 🧿🙏
792 views
15 days ago
*🌿🌼 విష్ణు సహస్రనామం విశిష్టత 🌼🌿* ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా.. పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే .! సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. నామము అందరూ చెప్పవచ్చు. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు. దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్! కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!! విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ. పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. అది సంజీవనీ ఓషధి వంటిది. కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు. భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. పూజకు సమయంలేనప్పుడు.. కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ. వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. సర్వేజనా సుఖినోభవంతు #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌻" తొలి ఏకాదశి శుభాకాంక్షలు "🌻 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
🧿 శ్రీ లలితా పరమేశ్వరి మాత 🧿🙏
36.8K views
1 months ago
*పండరీపురం పాండురంగ ఉత్సవం* _పండరీపురం పాండురంగ ఉత్సవం_ *ఓం నమో పాండురంగాయ* *ఓం నమో పుండరీక వర్మయా* *ఓం నమో నారాయణాయ* *ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ* శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 ___________________________________________ #🕉️🙏యోగిని ఏకాదశి విశిష్టత 🌺☪️👩‍👩‍👧‍👦🌧️ #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌅శుభోదయం #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏