ట్రెడిషనల్

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
502 views
4 hours ago
శ్రావణమాసంలో మనం వేసేముగ్గులు లక్ష్మీ ప్రదం శ్రావణ మాసంలో మనము ఇంటి బయట తులసి కోట వద్ద మరియు ఇంటిలో వేసే ముగ్గులు మహాలక్ష్మికి ఆహ్వానం పలికినట్లు గా భావించి ఆ మహాలక్ష్మి మన ఇంటిలో కొలువుంటుంది. ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి! యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి! దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ,అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి. పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు! ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి! నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.5K views
7 days ago
🕉️ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడంలో ఉన్న విశేషం. 🕉️మన సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవించడం ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడింది. 🕉️ముఖ్యంగా ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. 🕉️ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక. 🕉️వివాహిత స్త్రీని "గృహలక్ష్మి" అని సంబోధిస్తారు. 🕉️ఆమె అడుగుపెట్టిన చోట మంగళం, శుభం, ఐశ్వర్యం కలుగుతాయని మన పెద్దలు విశ్వసించారు. 🕉️అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించి సత్కరించడం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని ఆరాధించినట్లుగా భావించారు. 🕉️నుదుటి మధ్య భాగాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్ర స్థానం అని పేర్కొన్నారు. 🕉️ఈ ప్రాంతంలో కుంకుమ ధరించడం మంగళానికి, శక్తికి, సౌభాగ్యానికి సంకేతంగా భావించబడింది. 🕉️పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు ప్రతీక కాగా, కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. 🕉️తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. 🕉️అందుకే ఈ మూడింటిని కలిసి సమర్పించడం ఒక మంగళకరమైన ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ఈ ఆచారం ద్వారా ఇంటికి వచ్చిన స్త్రీని గౌరవించడమే కాకుండా, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, మంగళం, ఐకమత్యం పెంపొందుతాయని మన సంప్రదాయం చెబుతోంది. 🕉️ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిలవాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ సత్కారాన్ని చేస్తారు. 🕉️శుక్రవారాలు, శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, దీపావళి, వివాహాలు, వ్రతాల ఉద్యాపనలు వంటి శుభసందర్భాల్లో ముత్తైదువులను ఆహ్వానించి పసుపు–కుంకుమలు సమర్పించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది. 🕉️ధర్మశాస్త్రాలు, గృహ్యసూత్రాలు, దేవీ ఉపాసనా సంప్రదాయాల్లో సువాసినీ పూజకు విశిష్ట స్థానం ఉంది. 🕉️అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని శ్లోకాలు నిజంగా స్కాంద పురాణం, దేవీ భాగవతం లేదా పద్మ పురాణంలోని యథాతథ శ్లోకాలేనా అనే విషయాన్ని ప్రామాణిక గ్రంథాల ఆధారంగా పరిశీలించి మాత్రమే పేర్కొనాలి. 🕉️అందువల్ల ఈ ఆచారం యొక్క మూలభావాన్ని మన సంప్రదాయ దృష్టితో అర్థం చేసుకోవడం సముచితం. 🕉️మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని గౌరవిద్దాం. ఆమెను గృహలక్ష్మిగా భావించి పసుపు, కుంకుమలతో సత్కరిద్దాం. 🕉️సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మనమే ఆచరిస్తూ, భావితరాలకు అందిద్దాం. 🙏॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥🙏🙏🙏🙏🙏🙏 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
691 views
8 days ago
🎻🌹🙏మ‌హిళ‌లు బంగారు ప‌ట్టీల‌ను కాదు వెండి ప‌ట్టీల‌ను ధ‌రించాలి. ఎందుకో తెలుసా..? 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి... 🌿మ‌హిళ‌లు పాదాల‌కు ప‌ట్టీలు ధ‌రించ‌డం అన్న‌ది మ‌న భార‌తీయ సంప్ర‌దాయాల్లో ఒక‌టి. మ‌న దేశంలో ఉన్న చాలా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. 🌸అయితే ఆ ప‌ట్టీలు వెండితో చేసిన‌వే అయి ఉంటాయి. మ‌హిళ‌లు వివాహం చేసుకున్న సంద‌ర్భంలో కాలివేళ్ల‌కు మెట్టెలు తొడుగుతారు. అదే ప‌ట్టీలు అయితే ఆడ‌పిల్ల పుట్టగానే త‌ల్లిదండ్రులు చిన్న‌ప్ప‌టి నుంచే వారి పాదాల‌కు ప‌ట్టీల‌ను తొడుగుతారు. 🌿ప‌ట్టీలు తొడుక్కుని ఆడ‌పిల్ల‌లు ఇంట్లో సంద‌డిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువుంటుంద‌ని పండితులు చెబుతారు. అయితే ప‌ట్టీల‌ను ఏ మ‌హిళ అయినా స‌రే.. వెండి లోహంతో చేసినవే ధ‌రించాలి. 🌸కానీ నేటి త‌రుణంలో చాలా మంది బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయ‌డం స‌రికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల ప‌రంగా కూడా కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే… 🌿సాధార‌ణంగా హిందూ పురాణాల ప్ర‌కారం.. బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌.. 🌸ఆ రంగులో వస్తువులు ఏవైనా స‌రే.. ఆఖ‌రికి ప‌ట్టీలు అయినా స‌రే.. పాదాల‌కు ధ‌రించ‌కూడ‌దు. ఇక ఈ విష‌యంలో సైన్స్ చెబుతున్న‌దేమిటంటే… 🌿వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. 🌸క‌నుక బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రిస్తే న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయ‌ట‌. 🌿అందుకోస‌మైనా మ‌హిళ‌లు వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రించాల్సిందే..!...స్వస్తి....🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
732 views
21 days ago
``` ఆషాడ మాసం సందర్భంగా...``` *గోరింటాకు చరిత్ర* ➖➖➖✍️``` తెలుసుకుందాం ..!!``` అసలు పేరు గౌరింటాకు…! గౌరి ఇంటి ఆకు…!! ``` గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈవింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాతు పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏ ఉపయోగం కలదు? అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినది అనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైనబాధా కలుగలేదు. పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా‌ ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో!! నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆ సందేహం చెప్పగా…. నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం ఔతాయి. ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడుకదా…. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టి తోనే చెబుతారండీ. అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్నివిధాలా ఆరోగ్యం ఆనందం. సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్ గోరింటాకు. (గౌరీ ఆకు) అంటే పార్వతి దగ్గరికి వెళ్లి ఆషాడం అంత ఉండి శ్రావణ మాసం లో వచ్చేస్తుంది.. ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట. అప్పుడు అమ్మ సరే అని వరము నొసగిందట. అందుకు ఆషాఢంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలి! పెట్టుకుంటారు కదూ...!! నేను పెట్టుకున్నా కూడా గోరింటాకు.✍️``` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* ➖▪️➖ #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
733 views
25 days ago
"అన్నదానం - కడుపు నింపడం కాదు, కర్మ కడగడం" నువ్వు చెప్పింది *100% ధర్మశాస్త్రం*. *అన్నం పారేస్తే అన్నదానం కాదు, ఆకలి తీరిస్తేనే అన్నదానం*. "దానం" అనే మాటకి *అర్హత* ఉండాలి. *1. అసలు అన్నదానం అంటే ఏంటి? శాస్త్రం ఏం చెప్పింది?* *మనుస్మృతి*: *"అతిథి దేవో భవ"* - *అతిథి* అంటే *"తిథి లేని వాడు"*, *ముందు చెప్పకుండా* వచ్చేవాడు. *ఆకలితో* వస్తే *వాడికి అన్నం* పెట్టడమే *అన్నదానం*. *3 నియమాలు:* 1. *పాత్రత*: *ఆకలితో ఉన్నవాడు, దారిన పోయే బాటసారి, అన్నార్తుడు, రోగి, ముసలి, అనాథ*. వీళ్లకి పెడితేనే *దానం*. *కడుపు నిండిన వాడికి* పెడితే అది *"విందు"*, *దానం కాదు*. 2. *దాత గుణం*: *"శ్రద్ధయా దేయం"* - *శ్రద్ధతో*, *నిస్వార్థంగా* పెట్టాలి. *"నేను పెడుతున్నా"* అనే *అహంకారం* ఉండకూడదు. *"పేరు కోసం, ఫోటో కోసం, పుణ్యం కోసం"* పెడితే అది *వ్యాపారం*. 3. *గ్రహీత గుణం*: *తీసుకునే వాడు* *నిజంగా అవసరం* ఉండాలి. *దుర్వినియోగం* చేస్తే *పాపం*. *ఫలితం*: *అన్నదానం* = *ఆకలి + అర్హత + శ్రద్ధ*. *3 లో ఒక్కటి* తప్పినా *దానం కాదు, "అన్న వృధా"*. *2. పూర్వం ఎందుకు గుళ్లో అన్నదానం చేశారు? ఇప్పుడు ఎందుకు తప్పు అవుతోంది?* *పూర్వం - 3 సందర్భాలు:* 1. *యాత్రికులు*: *కాశీ, తిరుపతి* కి *నెలల కొద్దీ* నడిచి వచ్చేవారు. *దారిలో హోటల్ లేదు, ATM లేదు*. *గుడి* ఒక్కటే *దిక్కు*. *సాయంత్రం దాకా* *పూజ, ఉపన్యాసం* విని *ఆకలితో* ఉంటారు. *వాళ్లకోసం* *దేవాలయం* *"సామూహిక వంటిల్లు"*. ఇది *ధర్మం*. 2. *ఆపద*: *వరద, కరువు, యుద్ధం* వస్తే *పంట* పండదు. *ఊరంతా* *ఆకలి* తో ఉంటుంది. *రాజు, గుడి* *"ధాన్యాగారం"* తెరిచి *అన్నదానం*. ఇది *రాజధర్మం*. 3. *బ్రహ్మచారులు, సన్యాసులు*: *వేదం* చదివే *విద్యార్థులు*, *తపస్సు* చేసే *సాధువులు* *అడుక్కునేవారు కాదు*. *గుడి* లో *"మాధుకరం"* - *అన్నదానం*. *సమాజం* *విద్య* ని, *ధర్మాన్ని* పోషించేది. *ఇప్పుడు తప్పు ఎక్కడ జరుగుతోంది?* 1. *కారు అన్నదానం*: *AC కార్* లో *ఆఫీస్* నుండి వచ్చి, *గుడి ఫ్రీ భోజనం* తిని, *డబ్బాలో ఇంటికి* పట్టుకెళ్లడం. *ఇంట్లో ఫ్రిజ్* లో *4 కూరలు* ఉన్నా *"ఫ్రీ కదా"* అని తినడం. *ఇది దానం కాదు, "దొంగతనం"*. *శాస్త్రం*: *"అయాచితం అనాహార్యం"* - *అడగకుండా, అర్హత లేకుండా* తింటే *దోషం*. 2. *వ్యాపార అన్నదానం*: *"1000 మందికి అన్నదానం"* అని *బోర్డు* పెట్టి, *ఫోటో* దిగి, *పొలిటికల్ మైలేజ్*. *అసలు ఆకలితో ఉన్నవాడు* *1%*, *మిగతా 99%* *"ఫంక్షన్ భోజనం"* లా వచ్చినవాళ్లు. *డబ్బు* *బ్లాక్* ని *వైట్* చేసుకోవడం. *ఇది పుణ్యం కాదు, "పాపం వాషింగ్ మెషిన్"*. 3. *ఆరోగ్య అన్నదానం*: *"గుడిలో తింటే రోగాలు రావు"* అని *నమ్మకం*. *కానీ* *వందల మంది* *ఒకే ప్లేట్* లో, *శుభ్రత* లేకుండా, *పాచిపోయిన కూర*. *అన్నదానం* పేరుతో *ఫుడ్ పాయిజన్*. *దేవుడు* *విషం* పెట్టమన్నాడా? *3. "వారి పాపాన్ని మీరు తింటారు" - ఇది నిజమేనా? పుణ్యం వస్తుందా?* *శాస్త్రం చాలా క్లియర్ గా చెప్పింది:* *భగవద్గీత 17.20*: *"దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే, దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్"* *అర్థం*: *దేశం, కాలం, పాత్రత* చూసి, *ప్రతిఫలం ఆశించకుండా* ఇస్తేనే అది *సాత్త్విక దానం*. *నీ కేసు లో:* 1. *పాత్రత లేదు*: *నీకు ఆకలి లేదు*, *నీకు డబ్బు ఉంది*. నువ్వు *"అపాత్రుడవు"*. *అపాత్ర దానం* = *దోషం*. 2. *దాత పాపం*: *దాత* *నల్ల డబ్బుతో*, *పేరు కోసం* పెడితే వాడి *పాపం* వాడికే. నువ్వు తింటే *నీకు అంటదు*. *కానీ* నువ్వు *"వీడు దొంగ డబ్బుతో పెడుతున్నాడు"* అని *తెలిసి* తింటే *"పాప భాగస్వామి"* అవుతావు. *"స్తేనస్య అన్నం"* - *దొంగ అన్నం* తింటే *బుద్ధి మందగిస్తుంది* అని *చాణక్య నీతి*. 3. *పుణ్యం వస్తుందా*: *లేదు*. *పైగా నష్టం 3 రకాలు*: - *ఆరోగ్య నష్టం*: *ఫ్రీ* అని *అతిగా* తింటే *షుగర్, BP, ఒబెసిటీ*. *గుడి అన్నం* = *హెల్త్ ఇన్సూరెన్స్* కాదు. - *కర్మ నష్టం*: *అర్హుడి నోటి కాడ ముద్ద* లాక్కున్నావు. *వాడి శాపం* నీకు తగులుతుంది. *"ఆకలితో ఉన్నవాడి కడుపు కొట్టి తింటే, వాడి ఆకలి బాధ నీ ఇంట్లోకి వస్తుంది"*. - *ధర్మ నష్టం*: *"ఉచితం"* అనే *బిచ్చగాడి బుద్ధి* అలవాటు అవుతుంది. *కష్టపడి సంపాదించడం* మానేస్తావు. *ఆత్మగౌరవం* చస్తుంది. *మరి పుణ్యం ఎప్పుడు వస్తుంది?* *నువ్వు* *గుడి* కి వెళ్లి, *లైన్* లో *ముసలాయన* *నిలబడలేక* ఉంటే *నీ ప్లేట్* ఆయనకి ఇచ్చి *నువ్వు పస్తు* ఉంటే - *అది పుణ్యం*. *"త్యాగం"* ఉంటేనే *పుణ్యం*. *4. మరి ఏం చేయాలి? అసలైన అన్నదానం ఎలా?* *3 సూత్రాలు పాటించు:* 1. *తినే ముందు ప్రశ్నించుకో*: *"నాకు నిజంగా అవసరమా? ఇంట్లో వండుకునే స్తోమత లేదా? నేను తినకపోతే ఆకలితో ఉన్న వాడికి అందుతుందా?"* *'లేదు'* అంటే *తినకు*. *దేవుడి ప్రసాదం* గా *చిన్న ముద్ద* తీసుకో, *చాలు*. 2. *దానం చేసేటప్పుడు*: *గుడి హుండీ* లో *డబ్బు* వేయకు. *రోడ్డు మీద* *నిజంగా అడుక్కునే ముసలి* కి, *అనాథ పిల్లలకి* *నీ చేత్తో* *అన్నం కొనిపెట్టు*. *వాడి కళ్లలో* *కృతజ్ఞత* చూడు. *అదే పుణ్యం*. *ఫోటో* తీయకు. 3. *గుడి యాజమాన్యానికి*: *"ఆధార్ కార్డ్ చూసి BPL వాళ్లకి మాత్రమే ఫ్రీ"* అని *రూల్* పెట్టండి. *మిగతా వాళ్లకి* *'కాస్ట్ టు కాస్ట్'* తీసుకోండి. *వచ్చిన డబ్బు* తో *ఇంకో పేదవాడికి* పెట్టండి. *"అన్నదానం"* ని *"అన్న విక్రయం"* చేయండి, *తప్పులేదు*. *ఫ్రీ* అనే సరికి *విలువ* పోయింది. *ముగింపు: అన్నం పరబ్రహ్మ స్వరూపం* *"అన్నం న నింద్యాత్"* - *అన్నాన్ని నిందించవద్దు* అని *ఉపనిషత్తు*. *అన్నాన్ని వృధా చేయడం, అర్హత లేకుండా తినడం* - రెండూ *అన్నాన్ని నిందించడమే*. *కారులో వచ్చి తినేవాడా, విను:* *నీకు* *పుణ్యం* రాదు, *పాపం* వస్తుంది. *ఆరోగ్యం* రాదు, *రోగం* వస్తుంది. *దేవుడు* *నిన్ను గుడి* కి *ఆకలి తీర్చుకోమని* పిలవలేదు, *అహంకారం తగ్గించుకోమని* పిలిచాడు. *నిజమైన అన్నదానం కావాలా?* *రాత్రి 11 కి* *రైల్వే స్టేషన్* కి వెళ్లు. *ప్లాట్‌ఫాం* మీద *ముసలి* వాడు *పేపర్* కప్పుకుని *ఆకలితో* వణుకుతూ ఉంటాడు. *వాడికి* *హోటల్* నుండి *వేడి అన్నం* కొని *నీ చేత్తో* పెట్టు. *వాడు* *"చల్లగా ఉండయ్యా"* అని దీవిస్తాడు. *ఆ దీవెన* కి *1000 గుళ్ల అన్నదానం* సరిపోదు. "ఆకలి ఎరిగిన వాడే అన్నం విలువ ఎరిగిన వాడు. అర్హత ఎరిగిన వాడే ధర్మం ఎరిగిన వాడు." 🕉️ 🕉️ #😃మంచి మాటలు #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
635 views
26 days ago
. *ఆషాఢ మాసము* . *━❀꧁🔆꧂❀━* ఆషాఢ మాసం ఇది సంవత్సరములో 4వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, దానం చేయడం శుభకరం. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహంతోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం. ఈ శూన్యమాసంలో… ‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాధ రధయాత్ర. ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము - సృమతి కౌస్తుభం’ ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి. ఆషాడ శుద్ధ సప్తమి - మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము. ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గచింతామణి. ఆషాడ శుద్ధ అష్టమి - మిహషఘ్ని పూజ, సృ్మతి కౌస్తుభం ఆషాడ శుద్ధ నవమి - ఐంద్రదేవి పూజ ఆషాడ శుద్ధ దశమి - శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము. ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం. ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాంతరాది దినము అంటారు. ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది. శూన్యమాసం అంటే? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది. సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని... ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాఢ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు. ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర, వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ చైత్ర, వైశాఖ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఆషఢ మాసం వర్షాకాల సమయం. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్తదంపతులకు కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
3.1K views
27 days ago
ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు అలా చేయకండి రెండు చేతులలోకి తుడుచుకోండి స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని పూలు అయితే పైటకొంగులోనే తీసుకోవాలి అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు అదే శాస్త్రం కూడా చెబుతున్నది తెలియని వారు ఇప్పుడైనా తెలుసుకుని నడుచుకుంటారుగా దేవుడి ప్రసాదం తీసుకుని ఎలా తినాలో తెలుసుకున్నారుగా #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
776 views
28 days ago
*బోన భాగ్యాలు* ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యా ధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం, కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మ వారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమై సమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకా ళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమ ర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాల పండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. *తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే!* మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆల యంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జ యినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్ దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండు గకు వీడ్కోలు పలుకుతారు. *పరమాత్మలో చేరే జీవాత్మ* బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమా త్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవు లను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం. బోన భాగ్యాలు ఆషాఢమాసమంటే వర్షాకాలం. అంటే అంటువ్యా ధులు వ్యాపించడానికి ఆలవాలమైన మాసం, కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మ వారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. పసుపు నీళ్లు, వేపాకులతో సాకలు పెట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు. భోజనము అనే శబ్దానికి గ్రామ్యరూపమే బోనము. మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి అందరూ సుఖ సంతోషాలతో పదికాలాలపాటు పచ్చగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా భాగ్యనగర వాసులు పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, గండిమై సమ్మ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, మాంకా ళమ్మ తదితర గ్రామ దేవతలను ఆడపడచులుగా భావించి వారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పసుపు కుంకుమలు పెట్టి, భోజన నైవేద్యాలను సమ ర్పించి చీరసారెలతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా వేడుక జరుపుతారు. ఈ పండుగకే బోనాల పండుగ అని పేరు. ఆంధ్రాప్రాంతంలో కూడా ఈ విధమైన పండుగలు ఉంటాయి కాని వీటికి వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లున్నాయి. *తొలి, తుదిబోనాలు గోల్కొండ జగదాంబికదే!* మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆల యంలో ఆరంభమవడం ఆచారం. ఈ మేరకు నేడు అమ్మ తొలిబోనం అందుకోనుంది. తర్వాత ఉజ్జ యినీ మహంకాళి ఆలయంలోనూ, ఆ తర్వాత లాల్ దర్వాజలోనూ, అనంతరం అన్నిచోట్లా బోనాల సంబురాలు జరుపుతారు. తుదిబోనం కూడా గోల్కొండ జగదాంబికకే సమర్పించి, బోనాల పండు గకు వీడ్కోలు పలుకుతారు. *పరమాత్మలో చేరే జీవాత్మ* బోనాలు సమర్పించడాన్ని జీవాత్మను పరమా త్మలో ఐక్యం చేయడంగా కూడా ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. విజ్ఞాన శాస్త్రపరంగా చూస్తే వేపాకు, పసుపు, నేలపైనా, గాలిలోనూ ఉండే సూక్ష్మజీవు లను నాశనం చేసి, వాతావరణాన్ని క్రిమిరహితం చేయడానికి దోహదపడతాయి. నృత్య విన్యాసాలు, బోనాల సంబురాలు ప్రజలందరినీ ఒక్కతాటిమీద నడిపిస్తాయి. ఇటువంటి వేడుకలను జరుపుకోవడం తామరాకుమీద నీటి బొట్టులా ఉండే పట్టణ వాసులకు ఎంతో అవసరం. #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు #💮బోనాలు ప్రారంభం🙏