🕉️ తిరుమల తిరుపతి దేవస్థానం 🙏

👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.4K views
7 days ago
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 🌹 శ్రీవారి గర్భగుడిలో ఎన్ని విగ్రహాలు పూజలందుకొంటాయి 🌹 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీవారి గర్భగుడిలో మూలవిగ్రహముతో పాటుగా కౌతుకబేరము, ఉత్సవబేరము, స్నపనబేరము, బలిబేరము అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. అంటే మొత్తముగా ఐదు విగ్రహాలుంటాయి. అవి (1) ద్రువబేరము (2) కౌతుకబేరము (3) స్నపనబేరము (4) ఉత్సవబేరము (5) బలిబేరము. ఈ ఐదు విగ్రహాలు వైష్ణవవైఖాసన ఆగమము ప్రకారం సందర్భోచితంగా పూజలందుకొంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి, అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్నే ప్రధానంగా పాటిస్తుంది. గ్రామశ్రేయస్సు కొరకు ద్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ద్రువబేరమంటే మరేమి కాదు మూలవిగ్రహమే. దీన్నే స్థిరమైన, చలింపని విగ్రహంగా భావిస్తారు కనుకనే "ధ్రువ" అనే పేరు వచ్చింది. వైఖానసనాగము ప్రకారము గర్భగుడిలోని దేవుడు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే బేరము, అంటే సాకారరూపమన్నమాట. రెండోది కంటికి కనబడని దేవుడు. ఈ దేవుడినే నిరాకారరూపుడని అంటారు. కనుక తిరుమలలోని తిరువెంగడనాథుని (శ్రీ వేంకటేశ్వరుని) రూపము సాకారమన్నమాట. మూలబేరాన్ని శిల, మట్టి, దారువు (కట్టె)లతో నిర్మించాలి. వీటికే నిత్యపూజలు వైఖాసన లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారము పూజలు జరపాలి. ద్రువబేరానికి అభిషేకముండదు, ఎందుకంటే మూలవిగ్రహం అత్యంత పవిత్రమైనదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడుతుంది. పాలు నేయి తేనె ఘృతం (పెరుగు) వంటి వాటితో తిరుమంజనసేవలు / అభిషేకాలు కౌతుకబేరానికి చేస్తారు. కౌతుకబేరమంటే దినసరిపూజకు ఏర్పాటుచేసిన బంగారు /వెండి/ పంచలోహాలతో చేసిన విగ్రహం. మూలవిగ్రహంలో వుండే శక్తిని కౌతుకబేరములోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి, సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మూలవిగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే ఉద్వాసనమంటారు. మూడవదైన విగ్రహము ఉత్సవవిగ్రహము. పుర ఊరేగింపునకు ద్రువబేరాన్ని తీసుకువెళ్ళటానికి వీలుకాదు కనుక ఉత్సవబేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమూర్తినే "మలయప్పస్వామి" అని పిలుస్తారు, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలలో వాహనసేవలకు ఈ మూర్తినే ఊరేగిస్తారు. స్నపనబేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్ళి చక్రవారి స్నానము చేయిస్తారు. ప్రతిదేవాలయంలోనూ ప్రధానమూర్తితో పాటు పరివారదేవతలుంటారు. వీరిని ఉపదేవాలయాలలో వుంచి పూజిస్తారు. గరుడ, నంది, వినాయక, శ్రీదేవి భూదేవి, భైరవ, పరశురామ, బలరామ, యక్షగంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. చివరిది ఐదవదైన బలిబేరాన్ని పరివారదేవతలకు బలి ఇవ్వటానికి ముందు అర్చిస్తారు. బలి ఇవ్వడమంటే జంతువధ చేయడం కాదు. బల్యాన్నాన్ని (బలి అన్నము) ను సమర్పించడమే. కొన్ని ఆగమవిధానాలలో మూలవిగ్రహానికి అభిషేకము కూడా చేస్తారు. నిరాకార రూపుడైన భగవంతునికి అకారపూజా విధులేమి వుండవు, భక్తిప్రవృత్తులే ఇక్కడ ప్రధానము. ఈ పంచబేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక, వైఖానస ఆగమాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటారు. ఏడుకొండలవాడా వెంకటరమణా ☆ \|/ ♧ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏 #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తెలుసుకుందాం
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
718 views
13 days ago
*🙏\|/తిరుమలలో తలనీలాలు ఎందుకు ఇస్తారు?తలనీలాలు ఇచ్చే ప్రాంతాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకంటారు\|/🙏* 🙏\|/శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది. కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది. 🙏\|/పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది. 🙏\|/నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. 🙏\|/అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట. 🙏\|/ఇదే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి... 🙏\|/వేంకటేశ్వరుడు బీబీనాంచారీని పెళ్ళి చేసుకొనేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్ళు తనవారని, గుండు చేయించుకున్నాక ముస్లీంలాగా తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్ళని ప్రేమపూర్వకంగా మాటిచ్చాడట. 🙏\|/తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానం. 🙏\|/జానపద విజ్ఞానం ప్రకారం చూస్తే తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌదర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశసంపద అని అంటారు. ఆరోజుల్లో ఎంత పొడవు కురులు ఉంటే అంత విలువ ఉండేది. అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి, పూలను అలంకరించుకునేవాళ్ళు. *🙏\|/* మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేనిమీదా చూపించడు. అద్దంలో చూసుకున్నా కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించడం గొప్ప విషయం. 🫐🫐🫐🫐🫐🫐🫐🫐🫐 #🕉️ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద🕉️ #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 #గోవిందా గోవిందా #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం