తిరుమల లడ్డు

P.Venkateswara Rao
616 views
5 months ago
#తిరుమల లడ్డు *ఇలాంటి నిర్ణయాలే అనుమానాలు పుట్టిస్తాయి❗* APRIL 3, 2026🎯 తిరుమలలో కల్తీనెయ్యి విషయంలో నిజానిజాల సంగతి ఎటుపోయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే కూటమి సర్కారు పావులు కదుపుతున్నదని అంతా అనుకుంటున్నారు. తొలుత విచారణకు సిట్ ఏర్పాటుచేసిన రాష్ట్ర సర్కారు దూకుడుకు సుప్రీం కళ్లెం వేసింది. ఆ సిట్ కాకుండా.. సీబీఐ సారథ్యంలో విచారణ జరిగేలా మరో సిట్ ఏర్పాటుచేసింది. వారు విచారణ పూర్తిచేసి నివేదికలు కూడా ఇచ్చేశారు. కేసు నడుస్తున్న కోర్టుకు చార్జిషీట్లు కూడా వేసేశారు. ఆ నివేదిక పట్ల రాష్ట్రప్రభుత్వం సంతృప్తి చెందలేదు. వారి నివేదికలో జంతువుల కొవ్వులు కలిశాయని ఏ ప్రచారమైతే ప్రభుత్వపెద్దలు సుదీర్ఘకాలం సాగించారో.. అలాంటి మాటలు ఆ నివేదికలో లేవు. దరిమిలా.. విశ్రాంత ఐపీఎస్ అధికారి దినేష్ కుమార్ సారథ్యంలో మరొక ఏకసభ్య కమిషన్ ను నియమించారు. తమాషా ఏమిటంటే.. ఆ ఏకసభ్య కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించడానికి గడువు పూర్తికావస్తోంది. ఇప్పు.. ఆ గడువును పొడిగించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పొడిగింపు ఉత్తర్వులే.. ప్రజల్లో కొత్త అనుమానాలకు కారణం అవుతున్నాయి. చూడబోతే.. ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం ఆశించే విధంగా తమ నివేదిక తయారు చేయలేకపోయిందేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. ఆల్రెడీ ఒకసారి నెలల తరబడి అనేక మంది నిపుణులతో కూడిన సిట్, సీబీఐ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారం జరిపిన వ్యవహారమే ఇది. అదనపు దర్యాప్తు చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేశారు. ఇప్పుడు వారికి గడువు పొడిగించారు. అయిపోయిన పెళ్లికి మేళమెందుకని సామెత. అయిపోయిన విచారణను మళ్లీ చేయడానికి 45 రోజుల గడువు ఇస్తే.. ఆ గడువు చాలదని మళ్లీ పొడిగించడమే తమాషా. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో అనుమానాలు కలిగిస్తాయి. సీబీఐ నివేదికే.. ప్రభుత్వానికి చేదుగా అనిపించి ఉండొచ్చు. జంతువులు కొవ్వు ప్రసాతం చేసిన నెయ్యిలో కలిపారంటూ ఎలాంటి అసహ్యమైన ఆరోపణలైతే వారు చేశారో.. ఆ ఊసు కూడా సీబీఐ నివేదికలో లేకపోవడం వారికి కంటగింపే. ఆ పరువు నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఏకసభ్య కమిషన్ అనే ప్రహసనం తెచ్చారా? అనే అనుమానాలూ ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా గడువు పొడిగిస్తున్నారంటే.. ఇప్పటికీ వారు కోరుకునే నివేదిక తయారు కాలేదేమో.. వారు కోరుకున్నట్టు నివేదిక తయారయ్యేదాకా గడువులు పొడిగిస్తూ ఉంటారేమో అని ఎవరికైనా అనుమానం పుడితే.. ఎలా తప్పుపట్టగలం?
P.Venkateswara Rao
623 views
6 months ago
#తిరుమల లడ్డు #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *జగన్ పై మతాస్త్రం.. లాభనష్టాలెవరికి❓* MARCH 7, 2026🎯 సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా తప్పుదారిలో పయనిస్తున్నారు. హిందువుల వ్యతిరేకిగా వైసీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ముద్ర వేసి రాజకీయంగా భారీ లబ్ధి పొందాలనేది చంద్రబాబు అండ్ కో వ్యూహం. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడంలో చంద్రబాబు దిట్ట. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు ఎత్తుకు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు లాంటి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులే చిత్తయ్యారు. చంద్రబాబు మాస్ లీడర్ కాదు. కానీ తెలివితేటలతో గత నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. బాబు వేసిన ఎత్తులకు మహామహులు చిత్తయ్యారు. అయితే వైఎస్ జగన్ దగ్గరికి వచ్చే సరికి, ఒక్కోసారి ఆయన వ్యూహాలు నిష్ఫలం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో దుష్ప్రచారంతో తమను ఓడించారని చంద్రబాబుపై వైఎస్ జగన్, వైసీపీ నాయకుల ఆరోపణల గురించి తెలిసిందే. కానీ వైసీపీకి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టాలన్న చంద్రబాబు శకుని పాచిక పారడం లేదు. చంద్రబాబు గొప్పతనం ఏమంటే, తన ప్రయత్నాల్ని ఎప్పుడూ విరమించరు. ప్రయత్నిస్తూ వుంటే, ఎప్పుడూ ఒకసారైనా సత్ఫలితాలు ఇవ్వకుండా వుంటుందా? అనే నమ్మకం ఆయనది. వైఎస్ జగన్పై కొన్నేళ్లపాటు సాగించిన అవినీతి ఆరోపణలకు కాలం చెల్లిందని చంద్రబాబు గుర్తించారు. దీంతో జగన్పై కొత్త అస్త్రాన్ని ప్రయోగించాలని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్పై మతాస్త్రాన్ని ప్రయోగించారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకు తీసుకెళ్లారు. తమపై విసిరిన మతాస్త్రాన్ని ఎదుర్కోవడంలో మొదట్లో వైసీపీ ఇబ్బంది పడింది. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట ప్రమాణంతో మొదలైన ఎదురు దాడి... క్రమంగా పెంచింది. చివరికి సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదికతో వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది. అయితే మతాస్త్రంతో రాజకీయంగా భారీ లబ్ధి పొందుతామని అనుకుంటే, బూమరాంగ్ కావడం టీడీపీ, జనసేన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులందరినీ మతం దృష్టితోనే చూడడం విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాలు జనంలో టీడీపీ, జనసేన పార్టీలపై వ్యతిరేకత తెచ్చి పెడుతున్నాయి. శాసన మండలిలో చైర్మన్ మోషేన్రాజును ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అంటూ అనవసరంగా కెలికారు. దీంతో మండలి చైర్మన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మతం గురించి మీరెలా చెబుతారని మోషేన్రాజు గట్టిగా నిలదీశారు. తాను హిందువని ఆయన తేల్చి చెప్పారు. దీంతో మండలిలో అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. మరోవైపు జగన్ క్రిస్టియనో, కాదో చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు అడ్డగోలు వాదన చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు చంద్రబాబునాయుడు మరోసారి మతం కేంద్రంగా కీలక కామెంట్స్ చేశారు. ఏసు ప్రభువుకు అపచారం జరిగిందంటే జగన్ క్షమాపణలు చెప్పారన్నారు. వెంకటేశ్వరస్వామికి కల్తీ చర్యలతో అపచారం చేస్తే దానికి సమాధానం చెప్పరా? క్షమాపణలు చెప్పరా? కనీసం పశ్చాత్తాపమైనా ఎందుకు ప్రకటించరని చంద్రబాబు నిలదీశారు. మతపరంగా ప్రభుత్వ పెద్దలు, మంత్రులు మాట్లాడే ప్రతి మాటనూ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని పరిగణలోకి తీసుకుని, మతపరమైన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనేది పాలకుల ఎత్తుగడ. అయితే జగన్ క్రిస్టియన్ కావడంతో ఏదో అపచారం చేస్తున్నారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితరులు చేసే నిందారోపణలు నమ్మి, హిందువులంతా వైసీపీకి దూరమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ పాలకుల ఆరోపణలతో క్రిస్టియన్, ముస్లిం తదితర మైనార్టీలంతా కూటమికి దూరం కావడం ఖాయం. అలాగే దళితులు, గిరిజనుల్ని కూడా వైసీపీకి చేరువ చేయడంలో కూటమి నేతలు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అంటే, చంద్రబాబు, పవన్ ఆడుతున్న మత వికృత క్రీడలో తామే రాజకీయంగా నష్టపోతున్నామనే గ్రహించలేకున్నారా? లేక మొండిగా ముందుకు వెళుతున్నారా? అనే విషయాలు వారికే తెలియాలి. తెలుగు సమాజం మతపరంగా విడిపోయేంత అజ్ఞానంలో లేదు. ఇటీవల కోవా బన్ వలీ విషయంలో హిందువులంతా ఆ పేద చిరు వ్యాపారికి ఎంత అద్భుతంగా అండగా నిలిచారో తెలిసిందే. అలాంటిది అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్పై చంద్రబాబు, పవన్కల్యాణ్ ఏ ఉద్దేశంతో మతాన్ని అడ్డం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో జనం లేరు. హిందువుల్లో జగన్పై వ్యతిరేకత రాకపోగా, రాజకీయ లబ్ధి కోసం ఇంతగా దిగజారి తమ మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడ్తారా అని చంద్రబాబు, పవన్పై హిందువులు ఆగ్రహించే పరిస్థితి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ కంటే, తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవనే ప్రజల్లో ఎక్కువగా అభాసుపాలయ్యారు. ఈ వాస్తవాన్ని పసిగట్టడం వల్లే చంద్రబాబు, పవన్లో ఓర్వలేనితనం పెరిగింది. తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు, మరిన్ని చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తెలుగు సమాజం మత వలకు చిక్కదని ఏపీ పాలకులు తెలుసుకోవాలి. వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కోడానికి మరో అస్త్రాన్ని ఎంచుకోవాలి. మరే అస్త్రాలు లేకపోవడం వల్లే మతాన్ని ఎంచుకున్నామని అనుకుంటే, అది పూర్తిగా తప్పుడు విధానం అని... ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత నుంచైనా తెలుసుకోవాలి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంపై జుగుప్స కలిగించే ఆరోపణల్ని ఆపాలంటూ ముక్త కంఠంతో తెలుగు సమాజం కోరుతున్నదంటే, మన మాటలు ఎంత వెగటు పుట్టించాయో ఒక్కసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్కు హిందువులు దూరం కాకపోగా, సానుభూతి పొందగలిగారు. అలాగే పదేపదే జగన్ మతం గురించి పాలకులు మాట్లాడుతుండడంతో దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలంతా వైసీపీకి మరింత దగ్గరయ్యారు. ఎందుకంటే, గత ఎన్నికల్లో వీళ్లలో మెజార్టీ కూటమి పక్షాన నిలిచింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మరోవైపు హిందువుల్ని తమవైపు తిప్పుకోలేకపోగా, వారిలో కూడా వ్యతిరేకతను కూటమి సంపాదించుకుంది. చేతులు కాలాక చంద్రబాబు, పవన్ ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? జరగాల్సిన నష్టం జరిగిపోయింది.