#నాడు - నేడు!!!
*ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం..
వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'🩺*
ప్రభుత్వ రంగంలో
వైద్య సేవలను వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించారు
అధికారంలో ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు
‘జీరో వేకెన్సీ’తో రెండేళ్లలోనే
సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారు
వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు..
మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు వేతనం..
విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో
ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు
టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు
ఇవి గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చాయి..
కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలను కాపాడారు
ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో
మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట
అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ దారి
చంద్రబాబు ప్రభుత్వంలో
వైద్య కళాశాలలు, పట్టణ పీహెచ్సీలు
లాంటివి ప్రైవేట్, అవుట్ సోర్సింగ్ పరం
జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా
వేగంగా నియామకాలు చేపట్టేందుకు
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు.
జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు.
పీజీ వైద్య విద్యార్థులందరికీ
తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు.
అన్ని పీహెచ్సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో
తగినంత మంది సిబ్బందిని నియమించారు.
ప్రతి పీహెచ్సీలో
ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది...
ప్రతి వీహెచ్సీలో
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు
ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు.
రెండేళ్లలోనే సుమారు
50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు.
ప్రజలు దూర ప్రాంతాల నుంచి
వైద్య నిపుణులను సంప్రదించేందుకు
టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు.
ఇది ముఖ్యంగా
గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది.
రోజూ 75,000కిపైగా
టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు.
దేశవ్యాప్తంగా
జాతీయ టెలికన్సల్టేషన్లలో
దాదాపు మూడింట ఒక వంతు
ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం
మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది.
ప్రతి పీహెచ్సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు.
ప్రతి వీహెచ్సీ పరిధిలో
2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి
(గిరిజన ప్రాంతాలలో
స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు).
4,345 కొత్త వీహెచ్సీలు,
88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు.
977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్సీలను పునరుద్ధరించారు.
హెల్త్ వెల్నెస్ సెంటర్లు
రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి.
అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం
స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ,
నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి
సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు.
2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా
రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్
నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు.
అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు,
14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో
మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు.
ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్
మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేశారు.
అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి
నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు.
వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా
ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను
అధికారికంగా 2023 ఏప్రిల్లో ప్రారంభించారు
(2022 అక్టోబర్లో పైలట్ దశ తర్వాత).
ఈ కార్యక్రమం కింద
మొబైల్ మెడికల్ యూనిట్తో సహా డాక్టర్
ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శించారు.
క్రమబద్ధమైన షెడ్యూల్తో
వైద్యులను ఇంటి వద్దకే పంపించారు.
కోవిడ్లో కాపాడారు..!
కోవిడ్ సమయంలో
10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు,
వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ
సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని
అందుబాటులో ఉంచారు.
జిల్లా, బోధనాస్పత్రులలో
ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్తో కూడిన పడకలు,
క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు.
100కు పైగా
ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు.
మారుమూల ప్రాంతాలకు
మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు.
గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల
ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స,
వ్యాక్సినేషన్ సకాలంలో
అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు.