P.Venkateswara Rao
605 views 1 months ago
#నాడు - నేడు!!! ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నాడు జగన్ పాలనలో నంబర్‌ 1 నేడు నంబర్‌ 8 *నీతి ఆయోగ్‌* ఇదీ బాబు మార్కు పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు.. నీతి ఆయోగ్‌ సాక్షిగా తేటతెల్లం పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు.. అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్‌బుక్‌ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు రాష్ట్రంలో అచ్చంగా నడుస్తోంది.. బినామీలకు అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే బాబు మార్కు సంపద సృష్టి ఇదే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయంటూ డప్పు హిందుస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ దగ్గర నుంచి ఆజాద్‌ ఇండియా మొబిలిటీ, జిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఇండెక్స్‌ 2026 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకులను నీతిఆయోగ్‌ (July 17 2026) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 36 రాష్ట్రాలకుగాను గుజరాత్‌ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా టాఫ్‌ ఫెర్ఫార్మెన్స్‌ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్‌ రన్నర్స్‌ రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ ఉన్నాయి. ఎనిమిది అంశాలను నీతి ఆయోగ్‌ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది కప్పం కట్టలేక పారిపోతున్న కంపెనీలు...! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో మొదటి ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్‌ ఇండియా మొబిలిటీ, 6వ ఎస్‌ఐపీబీలో ఆమోదించిన జ్యూపిటర్‌ రెన్యువబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఏడో ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన జిన్‌ఫ్రా ప్రెసిషన్స్‌ లాంటి పలు కంపెనీలు రాష్ట్రం నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాయి. హైదరాబాద్‌కు చెందిన ఐస్పేస్‌ టెక్నాలజీస్‌ విశాఖలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్‌ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 నవంబర్‌ 12న మధురవాడలో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకొని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ రూ.6,215 కోట్లకుపైగా ఉండటం రాష్ట్రంలో దిగజారిన పారిశ్రామిక వాతావరణం, టీడీపీ పెద్దల కప్పం వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది.
11 shares

More like this