More like this
- P.Venkateswara Rao#నాడు - నేడు!!! #జగన్ కి ముందు అమ్మఒడి లేదు.. #జగన్ వచ్చాక అమ్మఒడి అది ఇప్పుడు తల్లికి వందనం గా మారింది.. #జగన్ కి ముందు రైతుభరోసా లేదు.. #జగన్ వచ్చాక రైతుభరోసా అది ఇప్పుడు అన్నదాత సుఖీభవ గా మారింది.. #జగన్ కి ముందు సచివాలయాలు లేవు.. #జగన్ వచ్చాక సచివాలయాలు వచ్చి అవి ఇప్పుడు స్వర్ణ గ్రామాలుగా మారాయి.. #జగన్ కి ముందు వాలంటీర్ వ్యవస్థ లేదు.. జగన్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థ వచ్చింది అది ఇప్పుడు మోసపోయి కనుమరుగయింది.. #జగన్ కి ముందు రేషన్ బండ్లు లేవు.. #జగన్ వచ్చాక ఇంటివద్దకి రేషన్ బండ్లు వచ్చేవి అవి ఇప్పుడు షెడ్ కి పరిమితం అయ్యాయి.. #జగన్ కి ముందు ఇంటి వద్దకి పెన్షన్ వచ్చేది కాదు.. #జగన్ వచ్చాకే ఇంటి వద్దకి పెన్షన్ వచ్చింది అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది.. #జగన్ కి ముందు నాడు నేడు పధకం లేదు.. #జగన్ వచ్చాక నాడు నేడు తో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడ్డాయి ఆ పధకం ఇప్పుడు కనుమరుగైంది. #జగన్ కి ముందు గ్రీన్ కో ఎనర్జి ప్రాజెక్ట్ లేదు.. #జగన్ వచ్చాక గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చింది.. #జగన్ కి ముందు 4పోర్టులు 12షిప్పింగ్ హార్బర్ లు లేవు.. #జగన్ వచ్చాకే అవి పనులు మొదలెట్టాయి.. #జగన్ కి ముందు 17గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు లేవు.. #జగన్ వచ్చాకే రాష్ట్రానికి 17మెడికల్ కాలేజీ లు వచ్చాయి.. #జగన్ కి ముందు ATC టైర్స్ కంపెనీ, samasung AC పరికరాల తయారి కంపెనీ, ఆదాని డేటా సెంటర్ along with google, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ లు AP కి రాలేదు.. జగన్ వచ్చాకే అవి వచ్చాయి.. #జగన్ కి ముందు ఎడ్యుకేషన్ లో 15వ స్థానం లో ఉన్న మనం జగన్ వచ్చాక మొదటి స్థానం లో ఉన్నాం.. ఇప్పుడు మళ్ళీ 20వ స్థానానికి వెళ్ళాం #జగన్ కి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ లేదు.. జగన్ వచ్చాక భూములు సేకరించి అన్ని అనుమతులు తీసుకొని, కోర్ట్ కేసులు సాల్వ్ చేసి పనులు ప్రారంభించాం టైం డేట్ ఫిక్స్ చేసి కంప్లీట్ చేశాం.. గుమ్మడికాయ మాత్రం వేరే వాళ్ళు కొట్టారు..132
- P.Venkateswara Rao#నాడు - నేడు!!! *ప్రపంచ బ్యాంకు తేల్చిన నిజం.. వైఎస్ జగన్ హయాంలోనే 'ఆరోగ్య భాగ్యం'🩺* ప్రభుత్వ రంగంలో వైద్య సేవలను వైఎస్ జగన్ సమూలంగా సంస్కరించారు అధికారంలో ఉండగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ‘జీరో వేకెన్సీ’తో రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించారు వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు.. మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు వేతనం.. విలేజ్ క్లినిక్స్, పట్టణ క్లినిక్స్తో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు ఇవి గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చాయి.. కోవిడ్లో కీలక చర్యలతో ప్రజల ప్రాణాలను కాపాడారు ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించడంలో మాజీ సీఎం వైఎస్ జగన్ది ప్రభుత్వ రంగం బాట అయితే సీఎం చంద్రబాబుది ప్రైవేట్ దారి చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య కళాశాలలు, పట్టణ పీహెచ్సీలు లాంటివి ప్రైవేట్, అవుట్ సోర్సింగ్ పరం జీరో వేకెన్సీ’ విధానంలో భాగంగా వేగంగా నియామకాలు చేపట్టేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. జీతభత్యాలు, ప్రోత్సాహకాలను సవరించారు. పీజీ వైద్య విద్యార్థులందరికీ తప్పనిసరి గ్రామీణ సేవను ప్రవేశపెట్టారు. అన్ని పీహెచ్సీలు, వీహెచ్సీ (విలేజ్ హెల్త్ క్లినిక్)లలో తగినంత మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది... ప్రతి వీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంతో పాటు ఆశాలు సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్లలోనే సుమారు 50,000 మంది వైద్య ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించారు. ప్రజలు దూర ప్రాంతాల నుంచి వైద్య నిపుణులను సంప్రదించేందుకు టెలిమెడిసిన్ వేదికను ప్రారంభించారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన జనాభాకు ప్రయోజనం చేకూర్చింది. రోజూ 75,000కిపైగా టెలికన్సల్టేషన్లు, ప్రిస్క్రిప్షన్లు అందచేశారు. దేశవ్యాప్తంగా జాతీయ టెలికన్సల్టేషన్లలో దాదాపు మూడింట ఒక వంతు ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టింది. ప్రతి పీహెచ్సీని 12–13 వీహెచ్సీలకు మ్యాప్ చేశారు. ప్రతి వీహెచ్సీ పరిధిలో 2,500–4,500 మంది జనాభాకు సేవలందాయి (గిరిజన ప్రాంతాలలో స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు). 4,345 కొత్త వీహెచ్సీలు, 88 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేశారు. 977 గ్రామీణ, 184 పట్టణ పీహెచ్సీలను పునరుద్ధరించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్లు రెట్టింపు చేయడం ద్వారా 10,086కు చేరాయి. అధిక రక్తపోటు, మధుమేహం, సాధారణ క్యాన్సర్ల కోసం స్క్రీనింగ్, తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ నియంత్రణ, నోటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, అత్యవసర ప్రసూతి సంరక్షణతో కూడిన విస్తరించిన సేవలను అందించడానికి అవసరమైన పరికరాలు, సిబ్బందిని సమకూర్చారు. 2022–23లో నిర్వహించిన ఎన్సీడీ–2 సర్వే ద్వారా రాష్ట్ర జనాభాలో సుమారు 80 శాతం మందికి స్క్రీనింగ్ నిర్వహించి ప్రత్యేకంగా ఆరోగ్య గుర్తింపు కార్డు కేటాయించారు. అత్యవసర మందుల జాబితాలోని 105 ఔషధాలు, 14 ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యంతో మొబైల్ మెడికల్ యూనిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక రిజర్వ్ మొబైల్ మెడికల్ యూనిట్ను ఏర్పాటు చేశారు. అవసరమైనప్పుడు విధులు నిర్వర్తించడానికి నలుగురు అదనపు వైద్యులను కేటాయించారు. వైద్యుడితో పాటు ప్రతి యూనిట్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ను అధికారికంగా 2023 ఏప్రిల్లో ప్రారంభించారు (2022 అక్టోబర్లో పైలట్ దశ తర్వాత). ఈ కార్యక్రమం కింద మొబైల్ మెడికల్ యూనిట్తో సహా డాక్టర్ ప్రతి నెలా రెండు సార్లు విలేజ్ హెల్త్ క్లినిక్స్ను సందర్శించారు. క్రమబద్ధమైన షెడ్యూల్తో వైద్యులను ఇంటి వద్దకే పంపించారు. కోవిడ్లో కాపాడారు..! కోవిడ్ సమయంలో 10,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇన్ఫెక్షన్ నివారణ సామగ్రితో సహా కీలకమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. జిల్లా, బోధనాస్పత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు, ఆక్సిజన్తో కూడిన పడకలు, క్రిటికల్ కేర్ యూనిట్లను సిద్ధం చేశారు. 100కు పైగా ప్రయోగశాలలకు కోవిడ్ పరీక్షా సామర్థ్యాన్ని కల్పించారు. మారుమూల ప్రాంతాలకు మొబైల్ పరీక్షా యూనిట్లను పంపించారు. గ్రామీణ, అణగారిన వర్గాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని చికిత్స, వ్యాక్సినేషన్ సకాలంలో అందించి ప్రజల ప్రాణాలను కాపాడారు.86
- P.Venkateswara Rao#నాడు - నేడు!!!128
- P.Venkateswara Rao#నాడు - నేడు!!!1610
- P.Venkateswara Rao*నాడు నేడు..* ‼️ #నాడు - నేడు!!! చీకట్ల నుంచి వెలుగు లోకి వచ్చామా ? వెలుగు లోనుంచి చీకట్లోకి వచ్చామా ? కొన్ని మచ్చుకు.. 👏410
- P.Venkateswara Rao#నాడు - నేడు!!! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు జగన్ పాలనలో నంబర్ 1 నేడు నంబర్ 8 *నీతి ఆయోగ్* ఇదీ బాబు మార్కు పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు.. నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు.. అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్బుక్ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు రాష్ట్రంలో అచ్చంగా నడుస్తోంది.. బినామీలకు అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే బాబు మార్కు సంపద సృష్టి ఇదే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయంటూ డప్పు హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఆజాద్ ఇండియా మొబిలిటీ, జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే భూ కేటాయింపులను రద్దు చేసుకుని ఏపీలో పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఆంధ్రప్రదేశ్కే వచ్చాయంటూ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ 2026 ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించింది. 2026 సంవత్సరానికి సంబంధించి పెట్టుబడుల స్నేహపూరిత రాష్ట్రాల ర్యాంకులను నీతిఆయోగ్ (July 17 2026) శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 36 రాష్ట్రాలకుగాను గుజరాత్ 56.6 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 48.7 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, ఒడిశా టాఫ్ ఫెర్ఫార్మెన్స్ రాష్ట్రాల్లో నిలవగా ఫ్రంట్ రన్నర్స్ రాష్ట్రాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఎనిమిది అంశాలను నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని 131 మంది పారిశ్రామికవేత్తలను సర్వే చేసి సమాచారం సేకరించి మరీ ఈ ర్యాంకులను రూపొందించింది కప్పం కట్టలేక పారిపోతున్న కంపెనీలు...! చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు కేటాయించిన భూములను సైతం వదిలేసుకుని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో మొదటి ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన అజాద్ ఇండియా మొబిలిటీ, 6వ ఎస్ఐపీబీలో ఆమోదించిన జ్యూపిటర్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏడో ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన జిన్ఫ్రా ప్రెసిషన్స్ లాంటి పలు కంపెనీలు రాష్ట్రం నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలను విరమించుకుని వెనక్కి వెళ్లిపోయాయి. హైదరాబాద్కు చెందిన ఐస్పేస్ టెక్నాలజీస్ విశాఖలో రూ.119.18 కోట్ల పెట్టుబడితో 2,000 మందికి ఉపాధి కల్పించే ఐటీ క్యాంపస్ నిర్మాణ ప్రతిపాదనలను సైతం ఉపసంహరించుకుంది. 2025 నవంబర్ 12న మధురవాడలో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడం గమనార్హం. ఈ ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత కూడా వాటిని రద్దు చేసుకొని వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ రూ.6,215 కోట్లకుపైగా ఉండటం రాష్ట్రంలో దిగజారిన పారిశ్రామిక వాతావరణం, టీడీపీ పెద్దల కప్పం వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది.1112
- P.Venkateswara Rao#నాడు - నేడు!!!719
- P.Venkateswara Rao#నాడు - నేడు!!!179
- P.Venkateswara Rao#నాడు - నేడు!!! Both or not sem ❌ నాకు జగనన్న కట్టిన సచివాలయం బాగుంది మరి....మీకు???? 🙄🙄🙄 #AndhraPradesh29