సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏

PSV APPARAO
511 వీక్షించారు
1 రోజుల క్రితం
#నాగ స్తోత్రం 🐍 #నవ నాగ స్తోత్రం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *నవనాగ స్తోత్రం......!!* *ప్రతీరోజూ తప్పకుండా ఒక్కసారైనా ఈ మంత్రం భక్తి శ్రద్ధలతో పఠిస్తే మంచిది.* *నవనాగ స్తోత్రము అంటే తొమ్మిది మంది ప్రముఖమైన నాగ దేవతల పేర్లను పఠించటం.* *ఈ స్తోత్రాన్ని పఠించటం వలన విష భయం తొలగిపోతుందని నమ్ముతారు.* *కాలసర్పదోషం,నాగ దోషం ఉన్నవారు దీనిని రోజూ పఠించాలి.* *నవ నాగ స్తోత్రం..* అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలమ్ శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తధా ఫలశ్రుతి... ఏతాని నవ నామాని నాగానాంచ మహాత్మనాం సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్| సర్పసూక్తం - సుబ్రహ్మణ్య సూక్తం.... తైత్తిరీయ సంహితా - ౪.౨.౮ ఋగ్వేదము నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః | యే ౭ దో రోచసే దివో యే వా సూర్యస్య రశ్మిషు | యేషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతుధానానాం యే వా వనస్పతీగ్ంరను | యే వా ౭ పటేషు శేరతే తేభ్యః సర్పేభ్యో నమః || ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టం | ఆశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః | యే రోచసే సూర్యస్స్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామాశ్రేషా అనుయంతి కామం | తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జుహోమి || నిఘృష్వైరసమాయుతైః | కాలైర్హరిత్వమాపన్నైః | ఇంద్రాయాహి సహస్రయుక్ | అగ్నిర్విభ్రాష్టివసనః | వాయుశ్చేతసికద్రుకః | సంవథ్సరో విషూవర్ణైః | నిత్యాస్తే ౭ నుచరాస్తవ | సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం || ఇతి సర్ప సూక్తం..!! సర్ప స్తోత్రం.. భుజంగేషాయ విద్మహే క్షక్షు శివాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్! ఈ మంత్రం నాగ విగ్రహానికి పాలు పోస్తూ చెప్పుకొంటే ఎవ్వరికైన అనుకొన్నది జరుగుతుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
533 వీక్షించారు
2 రోజుల క్రితం
#సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #నాగ పంచమి *సర్ప రక్షకురాలు మానసాదేవి* త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి.. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తు న్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది. అందుకనే కాలసర్పదోష నివరణకు ఆ మాతను ప్రార్ధించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంప దలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి, ఆమెను జరత్కారువు అనే మహర్షి కిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరో పేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు ఆస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమేజయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీ క్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. ఋత్వికుల మంత్ర పఠనంతో భూమండలంమీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్ఠు డైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తికుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ. తండ్రి" బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపి వేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగల డని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన ఆస్తీకునికి జనమేజయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపి వేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమేజయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్ప సంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసాదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణ మిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగి పోతాయి. సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతాన ఫలం కలుగుతుంది. బిల్వ పర్వతంపై ఆలయం హరిద్వార్ లోని బిల్వ పర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, సుందర దృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్ని ధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడు కోవాలి. అమ్మవారి అభీష్ఠంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగి ఆలయాన్ని దర్శించుకోవాలి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
636 వీక్షించారు
2 రోజుల క్రితం
#శ్రావణ మాసం ప్రత్యేకత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #సర్ప రక్షకురాలు మానస దేవి... నాగుల చవితి / నాగ పంచమి 🙏 *నాగులచవితి* శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామివారిది సర్పరూపమే. వినాయకుడికి జందెం పాము. దుర్గాదేవి పరివారంలోకూడా సర్పజాతి ఉండటం విశేషం. చీనాబ్, రావి నదుల మధ్య, అస్సాం దక్షిణప్రాంతంలోని నాగాయ్ కొండలలో, కాశ్మీరంలో ఎప్పటి నుంచో నాగజాతివారు నివసిస్తున్నారు. అమరావతి, నాగార్జునకొండ శిల్పాలలో నాగరాజులూ, నాగినులూ, నాగాలూ కనబడతాయి. కటిభాగంపైన మానవరూపం, క్రిందిభాగం సర్పరూపంగా ఉన్న శిల్పాలు దర్శనమిస్తాయి. జ్యోతిషం ప్రకారం రాహుగ్రహం సర్పప్రతినిధి. రాహుదోషం కారణంగా సర్పదోషం కలిగి సంతానోత్పత్తికి అటంకం ఏర్పడుతుంది. అందుకే పిల్లలు లేనివారు, సంతాననష్టం కలిగినవారూ నాగప్రతిష్ఠ చేస్తారు. మనదేశంలో చాలాచోట్ల నాగప్రతిమలు కనిపిస్తాయి. శ్రీశైల ఆలయంలో ఉత్తరదిక్కున ఉన్న 'నాగులకట్ట' ఎంతో సుప్రసిద్ధమైనది. సనాతనధర్మంలో నాగబంధమనేది భార్యాభర్తల సంబంధానికి ఒక ప్రతీక. భార్యాభర్తలు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి జయం పొందడం దాని ధ్యేయం. నాగబంధమనేది కంటికీ, చెవికీ ఎలాంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది. యోగశాస్త్రం ప్రకారం మానవుని మానసికశక్తికి సర్పం ఒక గుర్తు. మానవశరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలున్నాయి. అయితే అనేక నాడులతో నిండి ఉన్న వెన్నుబాములోని కుండలినీశక్తి మూలాధారచక్రంలో సర్పాకారంతో నిద్రావస్థలో ఉండి కామక్రోధాది అరిషడ్వర్గాలను ప్రకోపింపచేస్తుంది. దానివల్ల మనలో ఉండే సత్త్వగుణం అడుగంటుతుంది. నిద్రావస్థలో ఉన్న కుండలినీశక్తిని మేలుకొలిపి, వెన్నెముక మధ్యన ఉండే సుషుమ్నానాడిగుండా సహస్రారం వరకూ తీసుకుపోవడమే సర్పాన్ని పూజించడంలోని ఆంతర్యం. అంతేకాదు వృశ్చికరాశిలోని జ్యేష్ఠానక్షత్రం సర్పనక్షత్రం. విషజంతువులవల్ల బాధలూ, మృత్యువూ కలగడానికి వృశ్చికరాశి అధిష్ఠానం. అందుకే ఈ సర్పనక్షత్రంలో సూర్యుడు. ప్రవేశించినప్పుడు ఈ పండుగ నాడు అంటే నాగులచవితి రోజున పాములను పూజించి, పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషతుల్యపు ఆలోచనలు శాంతిస్తాయని ఒక నమ్మకం. కుజదోషం, కాలసర్పదోషం ఉన్నవారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తూ, నాగుపాము ఉండే పుట్టకు పూజ చేస్తే కళత్రదోషాలు తొలగుతాయని ఒక విశ్వాసం. నాగులచవితి పండుగను దీపావళి అమావాస్య తరువాత, కార్తికమాసం శుక్లపక్ష చవితినాడు చేసుకుంటారు. కొందరు శ్రావణమాసంలో కూడా జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగను ముఖ్యంగా గ్రామీణప్రాంతాలలో ఉండేవారు ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, నూతన వస్త్రాలు కట్టుకొని, పూజామందిరంలో నాగదేవత విగ్రహాన్ని నెలకొల్పి పూజిస్తారు. లేదా పాముపుట్ట దగ్గఱకు పోయి అందులో పాలు పోసి, నువ్వుల ఉండలు, పప్పుతో చేసిన వంటకం, బియ్యపుపిండి -బెల్లంతో చేసిన తీపి పదార్థం నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. పూలు, ఆవుపాలు, పసుపు, కుంకుమ, అరటిపళ్లు, తాంబూలం సమర్పించి, పూజిస్తారు. *తరువాత ఆ పుట్టచుట్టూ ప్రదక్షిణం చేస్తూ -* 'సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్ జనమేజయ యాగాంతే ఆస్తీకవచనమ్ అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరసే నమ: నమోస్తు పద్మనాభాయ నాగనాంపతయే నమః అనంతో వాసుకిం శేషాం తక్షకః కాళియస్తథా' అని చదువుతూ. పుట్టమన్నును పుట్టబంగారంగా భావించి చెవిదోషాలు పోవడానికి చెవులకు ధరిస్తారు. వస్త్రాలను పుట్టమీద పెట్టి ధరిస్తే కోరికలు తీరతాయని ఒక నమ్మకం. ఈ పండుగను ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సుకోసం వివాహిత స్త్రీలు తప్పక జరుపుకుంటారు. ఆనాడు ఉపవాసం కూడా ఉంటారు. *నాగుల చవితి పూజామంత్రం కూడా పఠించడం ఒక ఆచారంగా కనబడుతుంది.* 'సర్వే నాగా: ప్రీయతాం మే యే కేచిత్ పృథ్వీతలే యే చ హేలిమరీచిస్థా యేయంతరే దివి స్థితా: యే నదీషు మహానాగా యే సరస్వతీగామినః యే చ పీతంగేషు సర్వేషు వై నమః' ("భువిలో, స్వర్గంలో, సరస్సులలో, బావులలో, గుంటలలో నివసించేపాములన్నీ మమ్ములను ఆశీర్వదించుగాకు వాటికి మేమంతా నమస్కరిస్తాం") 'అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా ఏతాని నవనామాని నాగానాం చ మహాత్మనామ్ సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః తస్యవిషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్' అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ అనే తొమ్మిది సర్వనామాలను ప్రతినిత్యం ఉదయం, సాయంకాలం చదివినవారికి విషభయం అనేది లేకుండా సర్వత్రా విజయం కలుగుతుంది. ఉదయం అయితే చాలా మంచిది అలాగే సర్పసూక్తం, నాగరాజగాయత్రీమంత్రం, నాగేంద్ర అష్టోత్తరశతం పఠిస్తే విశేషఫలితం పొందవచ్చు. అదేవిధంగా జానపదాలలో 'దిగు దిగు నాగా', 'నాగా నాగా యెన్నియలో', 'ఓం' నాగరాజాయ', 'శరణు శరణు నాగరాజా' వంటి భక్తిగేయాలు ఎన్నో కనబడతాయి. వాటన్నింటినీ భక్తితో చదువుకోవచ్చు. దేవతలూ, రాక్షసులూ అమృతంకోసం పాలసముద్రాన్ని మథించిన సందర్భంలో మందరపర్వతం కవ్వంగా, పామును తాడుగా ఉపయోగించబడింది. మొట్టమొదట ఆ సముద్రంనుండి హాలాహలం వెలువడింది. దానిని పరమేశ్వరుడు మ్రింగి నీలకంఠుడయ్యాడు. ఆ సమయంలో కొన్ని విషపు చుక్కలు నేలమీద పడ్డాయి. ఆ విషప్రభావంనుండి రక్షించుకోడానికి ప్రజలు సర్పారాధన నిత్యపూజాప్రక్రియగా ఆచరించేవారు. అదే క్రమంగా ఈ ఆరాధన సనాతన సంస్కృతిలో ఒక ఆచారంగా మారింది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*