More like this
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌺అద్భుతాల_మిళితం... లలిత సహస్రనామ స్తోత్రం - ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రం నుంచి తెలుసుకోబోయే అద్భుతమైన విశేషం ఏంటంటే... అమ్మవారి నామాలను చెబుతూ వసిన్యాది వాగ్దేవతలు, శ్రీమాత విశేషాలన్నీ ఒక కథ చెబుతున్నట్లుగా మనకి వివరించారు. ఇది మనకు దాదాపుగా ఏ ఇతర సహస్రనామ స్తోత్రాలలోనూ కనబడని, ఈ స్తోత్రానికే ప్రత్యేకమైన విశేషం. ఈరోజు ఆ తల్లి ఆవిర్భావ విశేషాల్లోని అద్భుతాలను చూద్దాం!!! 🙏 🌺 **అమ్మ ఎవరు?** ముందుగా, అమ్మవారు ఎవరు అనే విషయం తోనే ఈ స్తోత్రాన్ని మొదలుపెట్టారు. "శ్రీమాతా" అనే సంబోధనతో మొదలుపెట్టారు ఈ స్తోత్రాన్ని. శ్రీకారంతో మంగళకరంగా మొదలుపెట్టి, "అమ్మా" అంటూ ఆప్యాయంగా పిలిచారు. ఆ తర్వాతనే ఆవిడని మహారాణి అని, మహా సింహాసనేశ్వరి అని గౌరవంగా సంబోధించడం జరిగింది. అంటే ఆవిడ మహారాణిగా పరిపాలిస్తున్నది తన బిడ్డలనే అన్న విషయాన్ని మొట్టమొదలుగానే మనకి గోచరమయ్యేలా చేశారు. ముందుగా ఆవిడ జగన్మాత... ఆ తరువాతనే ఏదైనా అన్న భరోసా ఇచ్చారు మనకి!!! 🌺 **అమ్మ ఎందుకు ఆవిర్భవించింది?** మొదటి శ్లోకం, రెండవ పాదంలో అమ్మవారి ఆవిర్భావానికి కారణం చెప్పారు. ఆది అంతాలు లేని ఆ మహాతల్లి (భండాసురుడిని వధించి) దేవతల కార్యాన్ని సిద్ధింప చేయడానికి, చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది అంటున్నారు వసిన్యాది దేవతలు. మనందరి రక్షణ కోసం కూడా, ఆ తల్లి అవతరించింది. ఎందుకంటే భండాసురుడి బాధలతో చిక్కి శల్యమైన ఆ దేవతలు మరెవరో కాదు, మనలోని రాక్షస గుణాల ధాటికి అసలు రూపాన్ని పోగొట్టుకున్న మన మనసులే!! 🌺 **ఎలా ఉన్నది ఆ తల్లి?** ఆవిర్భవించినప్పుడు ఆ తల్లి రూపాన్ని వర్ణిస్తున్నారు రెండవ శ్లోకంలో!! కోటి సూర్యతేజంతో అమ్మ వారు ఉద్భవించింది. నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు... 🔸 ఒక చేత క్రోధాన్ని సంహరించగల అంకుశం, 🔸 మరో చేతిలో రాగాన్ని అణచగల పాశం, 🔸 ఇంకొక చేతిలో మన మనసనే చెరుకు ధనస్సు (ఆ తల్లి చేతిలో పెట్టగానే వేప చెక్క వంటి మన మనసు చెరుకు ముక్క అయిపోయింది), 🔸 నాలుగవ చేతిలో పంచతన్మాత్రలనే పూల బాణాలను పట్టుకొని ఉన్నది అమ్మ. ఆ తల్లి శరీరం నుండి ఎర్రటి కాంతులు ప్రవాహంలా ఊబికి వస్తూ ఉంటే, అందులో ఈ బ్రహ్మాండ మండలాలన్నీ తేలి ఆడుతున్నాయిట!! వసిన్యాది వాగ్దేవతలు చేసిన అమ్మవారి ఆవిర్భావ వర్ణన చదువుతుంటే మన హృదయమే చిదగ్నికుండం లాగా, దాని నుంచి ఎర్రటి కాంతులు ప్రవాహమై ఉప్పొంగుతున్నట్లు, వాటి నుంచి అనంత భాను తేజంతో అమ్మవారు ఆవిర్భవిస్తున్నట్లు అనుభూతి కలుగుతోంది కదా!! మనలోని భండాసురుని సంహరించమని ఆ తల్లిని పదే పదే ప్రార్థించుకుందాం!! ఇక్కడి నుంచి అమ్మవారి శిఖ నఖ పర్యంతం సాగే సౌందర్య వర్ణనలోని అద్భుతమైన విశేషాలతోటి మరొక భాగంలో కలుసుకుందాం!! 🙏🙏🌹🌹 🌹🙏 శ్రీ మాత్రే నమః 🙏🌹 #తెలుసుకుందాం1414
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣"లక్ష్మీదేవికి తామర పువ్వుతో పూజ ఎందుకు చేస్తారు" 🪷🪷🪷🙏🏻పురాణాల ప్రకారం దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని అంటే పాలసముద్రాన్ని మథిస్తున్నప్పుడు ఆ సముద్రం నుండి అఖండమైన కాంతితో చేతిలో వికసించిన తామర పువ్వును పట్టుకుని ఒక పెద్ద తామర పువ్వుపై ఆసీనురాలై లక్ష్మీదేవి ఆవిర్భవించింది, అందుకే అమ్మవారిని పద్మప్రియ, పద్మాసని అని పిలుస్తారు పుట్టుకతోనే తామరతో ముడిపడి ఉండడం వల్ల అమ్మవారికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రతిరోజూ లక్ష్మీదేవికి తామర పూలు తెచ్చి పూజ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు అందుకే శాస్త్రాలలో ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం చెప్పారు, తామర పువ్వు ఎండిపోయిన తర్వాత వచ్చే గింజలతో తయారుచేసే తామర గింజల మాల సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం, తామర గింజల మాలతో లక్ష్మీ పూజ చేస్తే నిరంతరం అమ్మవారికి తామర పూలతో అర్చన చేసినంత ఫలితం దక్కుతుంది, తామర గింజలకు మనసును ప్రశాంత పరిచే గుణం ఉంది లక్ష్మీదేవి చంచలమైనది ఒకచోట స్థిరంగా ఉండదు కానీ ఈ మాల ఉన్నచోట అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, తామర గింజలను కుబేర విత్తనాలు అని కూడా అంటారు, తామర పువ్వు ప్రత్యేకత ఏంటంటే బురదలో పుట్టినా దానికి అంటుకోకుండా నిర్మలంగా వికసిస్తుంది అదే విధంగా మనిషి కూడా లోకంలో జీవిస్తూ చెడు గుణాలకు లోనుకాకుండా పవిత్రంగా జీవించాలని ఈ పుష్పం సూచిస్తుంది.లక్ష్మీదేవి ఎవరిని వరించింది? లక్ష్మీదేవి ఒక్కసారి అందరి వైపు చూసింది. ఇంద్రుడికి అహంకారం ఉంది. రాక్షసులకు క్రూరత్వం ఉంది. బ్రహ్మకి సృష్టి బాధ్యత ఉంది. కానీ ఒక్క విష్ణుమూర్తి మాత్రం ప్రశాంతంగా, చిరునవ్వుతో, శాంత స్వరూపుడై కనిపించాడు. లక్ష్మీదేవి వెంటనే ఆ తామర పువ్వు మీద నుండి లేచి, చేతిలో ఉన్న "వరమాల" విష్ణుమూర్తి మెడలో వేసింది. అప్పటి నుండి లక్ష్మీనారాయణులు అయ్యారు. లోకానికి ధనం, ఐశ్వర్యం, సంతోషం పంచడం మొదలుపెట్టారు. 🌷 మరి కలువ పువ్వు కథ ఏంటి ? లక్ష్మీదేవికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అంటారు: "జ్యేష్ఠా దేవి" = దరిద్రం, "అలక్ష్మి". లక్ష్మి పగలు తామర పువ్వులో ఉంటే, రాత్రి పూట జ్యేష్ఠా దేవి తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు రాత్రి పూట "నీలి కలువ" పువ్వు లక్ష్మీదేవికి పెడతారు. అర్థం: "అమ్మా, చీకటి పడింది. జ్యేష్ఠా దేవి వస్తుంది. నువ్వు ఈ కలువ పువ్వులో కూర్చుని మా ఇంటికి కాపలా ఉండు. దరిద్రాన్ని రానివ్వకు." కలువ రాత్రి వికసిస్తుంది కదా? అంటే లక్ష్మి రాత్రి కూడా మేలుకుని మనల్ని కాపాడుతుంది అని. తామర పగలు వికసిస్తుంది = పగలు కష్టపడి పనిచేసే వాళ్లకి ధనం ఇస్తుంది. తామర = "స్థిర లక్ష్మి" - ఇంట్లో నిలిచి ఉండే ధనం. 2. కలువ = "చంచల లక్ష్మి" - వ్యాపారం, రాకపోకల వల్ల వచ్చే లాభం. రెండూ నీళ్లలో పుడతాయి. నీళ్లు ఎప్పుడూ ఒకచోట నిలవవు కదా? అలాగే డబ్బు కూడా. కానీ ఆ నీళ్లలోనే తామర, కలువ స్థిరంగా ఉంటాయి. అంటే: "అమ్మా, డబ్బు చేతులు మారినా, నా దగ్గర నిలకడగా ఉండేలా చెయ్" అని అర్థం. #మహాలక్ష్మి #శుక్రవారంపూజ #తామరపువ్వు🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శ్రీ మహాలక్ష్మి దేవి #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏1217
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣వారసత్వం అంటే ఒకరి నుండి ఒకరికి వచ్చేది అది తల్లిదండ్రుల నుండి కావచ్చు గురువుల నుండి కావచ్చు లేదా ఇతరులను చూసి అనుసరించేది కావచ్చు ఏదైనా సరే మనం అనుసరించేది ఏదైనా ఇతరులనుండి నేర్చుకున్నదే కొందరు తల్లిదండ్రుల ఆస్తికి వారసులవుతారు కొందరు తల్లిదండ్రుల వ్యాధులకు వారసులు అవుతారు కొందరు తల్లిదండ్రుల ఆశయాలకు వారసులవుతారు కొందరు ఇతరుల ఆస్తికి వారసలవుతారు కొందరు గురు పీఠానికి వారసులు అవుతారు కొందరు తీవ్రవాదులకు వారసులు అవుతారు కొందరు తత్వ జ్ఞానానికి వారసులవుతారు అలాగే సమాజంలో తిరుగుతున్నప్పుడు కొందరి ఆలోచనలు నచ్చి వారికి వారసులు అవుతారు కొందరి గుణము నచ్చి వారికి వారసులవుతారు కొందరిది భక్తి నచ్చి వారికి వారసులవుతారు కొందరి నాస్తిక భావం నచ్చి వారికి వారసులు అవుతారు కొందరి విప్లవ భావాలు నచ్చి వారికి వారసులవుతారు ఇలా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో వింటాం చూస్తాం చదువుతాం అలాంటప్పుడు వారిలా ఉండాలి అనుకుంటాం వారిలా ప్రవర్తిస్తాం అలా ఉండాలి అనుకున్నప్పుడు ప్రవర్తించినప్పుడు అనుసరించినప్పుడు వారికి వారసులు అయినట్లే కద లేదా మనం కొత్త ట్రెండు సృష్టిస్తే మనని ఇతరులు అనుసరిస్తే వారు మనకు వారసులవుతున్నట్లు లెక్క ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక దానికి వారసుడే. అయితే వారసత్వం అంటే కేవలం తల్లిదండ్రుల ఆస్తి మాత్రమే కాదు. మనం స్వీకరించే ఆలోచనలు, అలవాట్లు, విలువలు, జ్ఞానం, సంస్కారం, జీవన విధానం, ఆశయాలు ఇవన్నీ కూడా వారసత్వాలే. మనిషి జన్మతో ఒక కుటుంబానికి వారసుడు కావచ్చు. కానీ తన ఆలోచనలతో, తన ఎంపికలతో, తన ప్రవర్తనతో ఇంకెన్నో విషయాలకు వారసుడవుతాడు. అందుకే 1 జీవితంలో ఎవరిని చూస్తున్నాం? 2 ఎవరిని అనుసరిస్తున్నాం? 3 ఎవరి మాటలు వింటున్నాం? 4 ఎవరి బుక్స్ చదువుతున్నాం? 5 ఎవరి సిద్ధాంతాన్ని అనుకరిస్తున్నాం? 6 ఎవరి ప్రభావంలో జీవిస్తున్నాం? 7 ఎవరి మాయలో పడుతున్నం ? 8 ఎవరితో తిరుగుతున్నాం? అనేది చాలా ముఖ్యమైన విషయం. 1. వ్యసనాలు నేర్చుకుంటే వాటికి వారసులు మద్యం, ధూమపానం, జూదం, మాదకద్రవ్యాలు వంటి చెడు అలవాట్లు ఉన్న వారితో తిరిగి, వారినే ఆదర్శంగా తీసుకుంటే, వారి వ్యసనాలకు వారసులవుతారు. ఆ వారసత్వం సంపదను కాదు, బాధలను ఇస్తుంది. 2. మంచి అలవాట్లు నేర్చుకుంటే వాటికి వారసులు ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, సమయపాలన, పరిశుభ్రత, క్రమశిక్షణ వంటి మంచి అలవాట్లు ఉన్న వారిని అనుసరిస్తే, ఆరోగ్యవంతమైన జీవితానికి వారసులవుతారు. 3. ఆస్తిని అనుభవిస్తే ఆస్తికి వారసులు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన భూములు, ఇళ్లు, ధనం పిల్లలకు వస్తాయి. వారు ఆ ఆస్తికి వారసులు. అయితే ఆస్తిని నిలబెట్టే బాధ్యత కూడా వారిదే. 4. అప్పులను స్వీకరిస్తే అప్పులకు కూడా వారసులే కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు అప్పులు కూడా వస్తాయి. అందుకే వారసత్వం అంటే లాభం మాత్రమే కాదు, బాధ్యత కూడా. 5. ఆశయాలను కొనసాగిస్తే వారికి వారసులు ఒక వ్యక్తి సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేస్తే, అతని తరువాత అదే సేవను కొనసాగించే వారు అతని ఆశయాలకు వారసులు. 6. గురువును ఆశ్రయించి జ్ఞానం సంపాదిస్తే గురువు ఇచ్చిన విద్యను కేవలం పరీక్షల కోసం కాకుండా జీవితంలో ఆచరిస్తే, ఆ గురువు జ్ఞాన సంపదకు నిజమైన వారసులవుతారు. 7. తల్లిదండ్రుల సంస్కారాలకు వారసులు పెద్దలను గౌరవించడం, అతిథులను ఆదరించడం, సత్యం మాట్లాడడం, వినయం కలిగి ఉండడం వంటి సంస్కారాలు తల్లిదండ్రుల నుండి వస్తాయి. వాటిని పాటించే పిల్లలే వారి నిజమైన వారసులు. 8. కోపాన్ని అనుసరిస్తే కోపానికి వారసులు ఎప్పుడూ కోపంతో, ద్వేషంతో జీవించే వారిని అనుసరిస్తే మన జీవితంలో కూడా శాంతి ఉండదు. కోపమే మన వారసత్వమవుతుంది. 9. ప్రేమను అనుసరిస్తే ప్రేమకు వారసులు ప్రేమ, క్షమ, దయ, కరుణతో జీవించే వారిని అనుసరిస్తే, మన కుటుంబం, సమాజం కూడా ప్రేమతో నిండిపోతుంది. 10. సేవను నేర్చుకుంటే సేవకు వారసులు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బలహీనులకు తోడుగా నిలవడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం నేర్చుకుంటే, సేవాగుణానికి వారసులవుతారు. 11. నిజాయితీని స్వీకరిస్తే నిజాయితీగా జీవించిన వారి మార్గంలో నడిచేవారు నమ్మకానికి ప్రతీకలవుతారు. 12. ధైర్యాన్ని స్వీకరిస్తే కష్టాల నుంచి పారిపోకుండా ఎదుర్కొనే వారి జీవితం చూసి నేర్చుకున్నవారు ధైర్యానికి వారసులవుతారు. 13. వినయాన్ని స్వీకరిస్తే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అహంకారం లేకుండా జీవించడం నేర్చుకుంటే, వినయమే మన గొప్ప ఆభరణమవుతుంది. 14. కష్టపడే స్వభావాన్ని స్వీకరిస్తే శ్రమను గౌరవించే వారిని అనుసరిస్తే విజయానికి వారసులవుతారు. 15. దురాశను అనుసరిస్తే ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశపడే వారిని అనుసరిస్తే, మనశ్శాంతిని కోల్పోతాం. 16. జ్ఞానాన్ని పంచితే జ్ఞానాన్ని దాచుకునేవాడు పండితుడు కావచ్చు; జ్ఞానాన్ని పంచేవాడు గురువు అవుతాడు. అలాంటి గురువును అనుసరించే వారు జ్ఞాన వారసులు. 17. ప్రకృతిని గౌరవిస్తే చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, జీవజాలాన్ని కాపాడడం నేర్చుకుంటే భూమిని రక్షించే వారసులవుతారు. 18. ధర్మాన్ని అనుసరిస్తే సత్యం, న్యాయం, కర్తవ్యం, కరుణ—ఇవి ధర్మపు స్తంభాలు. వీటిని పాటించే వారే ధర్మ వారసులు. 19. మంచి స్నేహితులను అనుసరిస్తే మంచి స్నేహితులు మంచి మార్గంలో నడిపిస్తారు. వారి ప్రభావం జీవితాన్ని నిర్మిస్తుంది. 20. చెడు స్నేహితులను అనుసరిస్తే చెడు స్నేహం మనిషిని నెమ్మదిగా పతనానికి తీసుకెళ్తుంది. అలాంటి వారసత్వం జీవితాన్ని నాశనం చేస్తుంది. అసలైన వారసత్వం ఏమిటి? బంగారం కాలంతో కరిగిపోవచ్చు. ఆస్తి తరాలు మారితే చేతులు మారుతుంది. అందం వయసుతో తగ్గిపోతుంది. అధికారం శాశ్వతం కాదు. కానీ మంచి ఆలోచన, మంచి జ్ఞానం, మంచి సంస్కారం, మంచి పేరు, మంచి ఆశయం ఇవి తరతరాలకు నిలిచే వారసత్వాలు. అందుకే ప్రతి మనిషి తనను తాను ఒక ప్రశ్న వేసుకోవాలి "నేను ఎవరి వారసుడిని?" వ్యసనాల వారసుడినా? ద్వేషానికి వారసుడినా? ఆస్తికి మాత్రమే వారసుడినా? లేక జ్ఞానానికి, ధర్మానికి, ప్రేమకు, సేవకు, నిజాయితీకి, మానవత్వానికి వారసుడినా? ఈ ప్రశ్నకు మన జీవితం ఇచ్చే సమాధానమే మన అసలు గుర్తింపు. ఆస్తిని పొందడం గొప్ప కాదు. ఆలోచనను పొందడం గొప్పది. సంపదను వారసత్వంగా పొందడం అదృష్టం. జ్ఞానాన్ని, ధర్మాన్ని, మానవత్వాన్ని వారసత్వంగా పొందడం మహాభాగ్యం. #తెలుసుకుందాం #😃మంచి మాటలు1913
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣హరిహరసుతుడు అయ్యప్ప - 🐅🙏🏻అయ్యప్ప స్వామి కథ + నల్ల బట్టల సీక్రెట్ పూర్వం మహిషి అనే రాక్షసి ఉండేది. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు - "శివుడు, విష్ణువుకి పుట్టినవాడు తప్ప నిన్ను ఎవ్వరూ చంపలేరు". ఆడ మగ కలిస్తేనే పిల్లలు పుడతారు కదా, శివుడు మగ, విష్ణువు మగ. "ఇక నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు" అని లోకాలన్నీ పీడించడం మొదలుపెట్టింది. దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు మోహినీ అవతారం ఎత్తాడు. ఆ మోహిని అందానికి శివుడు ముగ్ధుడయ్యాడు. శివుడు-మోహినీ కలయికతో ఒక తేజస్సు పుట్టింది. ఆ తేజస్సే మన అయ్యప్ప స్వామి. అందుకే స్వామిని హరిహరసుతుడు అంటారు. హరి {విష్ణువు} + హర {శివుడు} = అయ్యప్ప. ఆ పిల్లవాడిని పంపా నది ఒడ్డున వదిలేశారు. పందళ దేశ రాజు రాజశేఖరుడికి పిల్లలు లేరు. వేటకి వెళ్లినప్పుడు నది ఒడ్డున ఏడుస్తున్న పిల్లవాడు కనిపించాడు. మెడలో మణి ఉంది. దాంతో మణికంఠుడు అని పేరు పెట్టి, అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. మణికంఠుడు 12 ఏళ్ల వయసులో గురుకులం నుంచి అన్ని విద్యలు నేర్చుకుని వచ్చాడు. అప్పుడు రాణికి సొంత కొడుకు పుట్టాడు. రాజ్యం మణికంఠుడికి దక్కకుండా చెయ్యాలని, రాణి నాటకం ఆడింది. "నాకు తలనొప్పి, పులి పాలు తెస్తేనే తగ్గుతుంది" అని అబద్ధం చెప్పింది. మణికంఠుడు "సరే అమ్మా" అని అడవికి బయలుదేరాడు. అడవిలో మహిషి రాక్షసిని చూశాడు. "నువ్వేనా నన్ను చంపేది?" అని ఆమె నవ్వింది. మణికంఠుడు ఒక్క బాణంతో ఆమెను సంహరించాడు. చనిపోతూ మహిషి "స్వామీ, నాకు శాప విమోచనం ఇచ్చావు" అని కృతజ్ఞత చెప్పింది. ఆమె ఆత్మ ఒక అందమైన స్త్రీగా మారి "నన్ను పెళ్లి చేసుకో" అని అడిగింది. అప్పుడు స్వామి "ఈ కలియుగంలో నన్ను చూడటానికి కన్నెస్వాములు రానంత వరకు నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని మాట ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ ప్రతి సంవత్సరం లక్షల మంది కన్నెస్వాములు శబరిమల వస్తారు. మహిషిని చంపిన తర్వాత ఇంద్రుడు పులి రూపంలో, దేవతలు పులుల రూపంలో వచ్చారు. స్వామి ఆ పులిమీద స్వారీ చేస్తూ పందళ రాజ్యానికి వచ్చాడు. అది చూసి రాజు, రాణి భయపడ్డారు. "నేను దేవుడ్ని. నా కోసం అడవిలో గుడి కట్టించు" అని చెప్పి, శరం వదిలాడు. ఆ బాణం పడిన చోటే శబరిమల. "నేను కలియుగంలో భక్తుల కష్టాలు తీర్చడానికి ఇక్కడే ఉంటాను" అని చెప్పి, చిన్ముద్ర పట్టి, యోగ పట్టంతో కూర్చున్నాడు. అదే మనం ఇప్పుడు చూసే అయ్యప్ప రూపం. 🖤 భక్తులు నల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? స్వామిని చూడాలంటే 41 రోజులు మండల దీక్ష చెయ్యాలి. దీక్షలో నియమాలు: 1. నల్ల బట్టలు = శని దోషం పోవడానికి అయ్యప్ప శనీశ్వరుడి గురువు. నలుపు శని రంగు. 41 రోజులు నలుపు కడితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధలు తొలగిపోతాయి. శని అనుగ్రహం వస్తుంది. 2. నల్ల బట్టలు = అందరూ సమానం శబరిమలకు కోటీశ్వరుడు వచ్చినా, కూలి పని చేసేవాడు వచ్చినా డ్రెస్ ఒక్కటే - నలుపు. అక్కడ కులం లేదు, డబ్బు లేదు. ఉన్నది ఒక్కటే - "స్వామి". అందరూ స్వాములే. అందుకే గుడి ముందు "తత్వమసి" = నీవే అది అని రాసి ఉంటుంది. 3. నల్ల బట్టలు = వైరాగ్యం రంగు రంగుల బట్టలు = కోరికలు, ఆడంబరం. నలుపు = అన్ని రంగులు కలిపితే వచ్చేది = నాకు ఏ కోరికా లేదు, స్వామి చాలు అని అర్థం. "నేను సన్యాసిని" అని చాటి చెప్పడమే. 4. నల్ల బట్టలు = శరీరానికి వెచ్చదనం దీక్ష డిసెంబర్-జనవరి చలిలో ఉంటుంది. శబరిమల కొండల్లో వణికించే చలి. నలుపు ఎండ వేడిని పీల్చుకుంటుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. 5. నల్ల బట్టలు = మనసుకి కంట్రోల్ నల్ల చొక్కా వేసుకోగానే మనసుకి అనిపిస్తుంది - "నేను దీక్షలో ఉన్నాను. తిట్టకూడదు, అబద్ధం ఆడకూడదు, చెడు ఆలోచన రాకూడదు." ఆ బట్టలే మనల్ని కాపాడతాయి... #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #అయ్యప్ప #ayyappa swamy #ayyapp swami saranam ayyappa🙏🙏🔯🕉🔯🐆🔯🐅🐅1518
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣. *ఆషాఢ మాసము* . *━❀꧁🔆꧂❀━* ఆషాఢ మాసం ఇది సంవత్సరములో 4వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, దానం చేయడం శుభకరం. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది. వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహంతోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, ఎవరికీ జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం. ఈ శూన్యమాసంలో… ‘ఆషాఢ శుద్ధ విదియనాడు’ పూరీ జగన్నాధ రధయాత్ర. ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’గా ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము - సృమతి కౌస్తుభం’ ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి. ఆషాడ శుద్ధ సప్తమి - మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము. ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గచింతామణి. ఆషాడ శుద్ధ అష్టమి - మిహషఘ్ని పూజ, సృ్మతి కౌస్తుభం ఆషాడ శుద్ధ నవమి - ఐంద్రదేవి పూజ ఆషాడ శుద్ధ దశమి - శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము. ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం. ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాంతరాది దినము అంటారు. ఈ మాసంలో జగన్నాథుని రథయాత్ర, స్కంద పంచమి, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి లాంటి ప్రత్యేకమైన విశిష్ట పండుగలతో పాటుగా, ‘దక్షిణాయన పుణ్యకాలం’ కూడా ప్రారంభమవుతుంది. శూన్యమాసం అంటే? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశులలోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది. సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని... ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాఢ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు. ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర, వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ చైత్ర, వైశాఖ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఆషఢ మాసం వర్షాకాల సమయం. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్తదంపతులకు కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. #తెలుసుకుందాం #పల్లెటూరి సాంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #🌾మన సప్రదాయాలు🌾 #మనసాంస్కృతిసంప్రదాయాలు1413
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣దశావతారాలు - మూడో రోజు: శ్రీ వరాహ అవతారం 🐗 విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైన వరాహ స్వామి, భూదేవిని విశ్వ సముద్రం నుండి రక్షించడానికి ఒక అడవి పంది రూపం ధరించాడు. శాపం: ఈ కథ వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ, విజయులతో మొదలవుతుంది. కుమారులు అని పిలువబడే మునులను అడ్డుకోవడంలో వారి అహంకారం కారణంగా, వారు భూమిపై అసురులుగా జన్మించమని శపించబడ్డారు. వారు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా అవతరించారు. అపహరణ: హిరణ్యాక్షుడు అపారమైన శక్తిని పొందడానికి కఠోర తపస్సు చేసి, తదనంతరం స్వర్గాన్ని జయించాడు. తన అహంకారంతో, అతను భూదేవిని రసాతలం అనే విశ్వ సముద్రం అడుగుకు లాక్కెళ్లాడు. విశ్వ వరాహం: భూమి కుంగిపోతుండగా, బ్రహ్మదేవుడు మరియు భూదేవి మోక్షం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణువు బ్రహ్మ ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న వరాహం రూపంలో ఉద్భవించాడు, అది త్వరలోనే ఒక భారీ, విశ్వమంత పరిమాణానికి పెరిగింది. యుద్ధం మరియు రక్షణ: భూమిని తిరిగి తీసుకురావడానికి వరాహుడు ఆదిమ జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అతడిని సవాలు చేయగా, వెయ్యి సంవత్సరాల పాటు భీకర యుద్ధం జరిగింది. చివరకు వరాహుడు ఆ రాక్షసుడిని ఓడించి, భూమిని తన దంతాలపై సమతుల్యం చేసి, తిరిగి దాని యథాస్థానానికి చేర్చాడు. ప్రాముఖ్యత: 1. తిరుమల ఆది వరాహ క్షేత్రం: తిరుమల కొండలపై శ్రీవారి కంటే ముందు నుంచే వరాహ స్వామి ఉన్నాడు. శ్రీవారు స్థలం అడిగితే వరాహ స్వామే ఇచ్చాడు. అందుకే మొదటి దర్శనం, మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహ స్వామికే. తిరుమల యాత్ర వరాహ దర్శనంతోనే పూర్తవుతుంది. 2. భూమాత రక్షకుడు: మనం ఎంత కష్టాల్లో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినా వరాహ స్వామి కోరలే మనకు ఆధారం. ఈ కథ చదివిన మీ ఇంట్లో భూమి, ఇల్లు, పొలం, ఆస్తి సమస్యలు తొలగి సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ ఆది వరాహాయ నమః 🙏 #🙏విష్ణుమూర్తి దశావతారాలు 🙏# #విష్ణుమూర్తి దశావతారాలు ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం4692
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#వేమన శతకం 📖 #vemana padyalu #😃మంచి మాటలు #తెలుసుకుందాం1924
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌿 శాకంబరీ దేవి అంటే ఎవరు?🥕🥦🫑🥬🫛🍐🥒🫒🍋🟩🍋🍍🥭🍆 విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢమాసంలో శాకంబరీ దేవి అలంకారం ఎంతో విశిష్టత 🌿🥒🍆🥕🥬 పూర్వం దుర్గమాసురుడు 100 ఏళ్లు వర్షాలు లేకుండా చేశాడు 🙏 భూమి మీద తినడానికి తిండి లేక అందరూ ఆకలితో అల్లాడారు 🙏శాకం" అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, "అంబరీ" అంటే ధరించిన తల్లి. పురాణాల ప్రకారం, ఒకసారి దుర్గమాసురుడు వేదాలను అపహరించడంతో వర్షాలు పడలేదు. భూమిపై కరువు ఏర్పడి ప్రజలు, పశువులు ఆకలితో బాధపడ్డారు. అప్పుడు జగన్మాత శాకంబరీ దేవి రూపంలో అవతరించి, తన శరీరం నుంచే వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉద్భవింపజేసి సృష్టిని రక్షించింది. 🌾🥒🍅🥕🍆 🔸 ఆషాఢమాసంలో ప్రకృతి పచ్చగా మారుతుంది. 🔸 రైతులు పండించిన తొలి కూరగాయలు, పంటలను అమ్మవారికి సమర్పిస్తారు. 🔸 సర్వలోకాలకు అన్నం, ఆహారం ప్రసాదించే తల్లిగా కనకదుర్గమ్మను శాకంబరీ రూపంలో అలంకరిస్తారు. 🔸 అమ్మవారికి వేలాది కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అద్భుతమైన అలంకారం చేస్తారు. 🌸 శాకంబరీ అలంకార విశిష్టత 🌿 అన్నపూర్ణ స్వరూపిణి. 🥒 కరువు, ఆకలి, దారిద్ర్యం తొలగుతాయని విశ్వాసం. 🍅 ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, పంటల సమృద్ధి కలుగుతుందని నమ్మకం. 🥬 వ్యవసాయం చేసే వారికి ప్రత్యేక కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. 🍇 కుటుంబంలో సుఖశాంతులు, ధాన్య సమృద్ధి పెరుగుతాయని చెబుతారు. 🙏 భక్తులు ఏమి సమర్పిస్తారు? 🥒 దోసకాయలు 🍆 వంకాయలు 🥕 క్యారెట్లు 🥬 ఆకుకూరలు 🌽 మొక్కజొన్న కంకులు 🍅 టమాటాలు 🌶️ మిరపకాయలు 🍋 నిమ్మకాయలు 🥭 మామిడిపండ్లు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి దర్శించుకుంటారు. 🌺 శాకంబరీ దేవి దర్శనం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. 🙏🌿🌾 అప్పుడు అమ్మవారు తన 100 కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకుంది 🙏 ఆ కన్నీళ్లే వర్షాలుగా మారి నదులు అయ్యాయి 🙏 తన ఒంటి నుండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పుట్టించి ప్రపంచానికి అన్నం పెట్టింది 🙏 అందుకే ఆమె శాకంభరీ అయ్యింది 🙏 శాకం అంటే కూరగాయల తల్లి అని 🙏 ఆషాడం అంటే రైతులకు పంటల నెల 🙏 పంటలు బాగా పండాలని, కరువు రాకూడదని, ఎవరికీ ఆకలి బాధ ఉండకూడదని మన కనకదుర్గమ్మను శాకంభరీగా అలంకరిస్తారు 🙏 ఈ అలంకారం చూస్తే అర్థం ఏంటంటే - తిండిని వృధా చేయొద్దు, ప్రకృతిని కాపాడండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అని 🙏 #శాకంబరీదేవి 🌿 #విజయవాడకనకదుర్గమ్మ 🙏🌺🍀🌿⚜️💗🧿 #తెలుసుకుందాం #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ59173
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣తిరుమలకు వెళ్లే ముందు తిరుచానూరు ఎందుకు వెళ్లాలి? లక్ష్మీదేవే స్వయంగా తామర పువ్వులో పద్మావతిగా వెలసిన క్షేత్రం తిరుచానూరు. ఆకాశరాజు యజ్ఞ భూమిలో దొరికిన ఆ తల్లి కోసమే శ్రీనివాసుడు 12 ఏళ్లు తపస్సు చేశాడు. అమ్మను చూడకుండా అయ్యను చూస్తే ఫలం లేదు! ఓం శ్రీ పద్మావత్యై నమః 🙏 తిరుచానూరు - అలమేలుమంగాపురం పేరు ఎలా వచ్చింది? అమ్మవారు బంగారు తామర పువ్వు మీద వెలిసింది కాబట్టి ఈ ఊరికి అలర్ మేల్ మంగాపురం అని పేరు వచ్చింది. అలర్ అంటే తామర, మేల్ అంటే పైన, మంగ అంటే దేవి. ఇదే తిరుచానూరు. తిరుమలకు వెళ్లే ప్రతి యాత్రికుడు ముందుగా ఇక్కడ పద్మావతి అమ్మను దర్శించుకుంటేనే యాత్ర ఫలిస్తుందని నమ్మకం. ఈ పురాణానికి 2 పెద్ద కథలు ఉన్నాయి బ్రో: కథ 1: ఆకాశరాజు యజ్ఞభూమిలో దొరికిన బిడ్డ పూర్వం పుండరీక అనే బ్రాహ్మణుడికి కొడుకు మాధవుడు పుట్టి, దారి తప్పి పాపాలు చేసి, తిరుమల కొండల్లో సుదర్శన సరస్సులో స్నానం చేయగానే పాపాలు పోయి, తొండమండల రాజు మిత్రవర్మకు ఆకాశరాజు గా జన్మించాడు. ఆకాశరాజు పెరిగి ధరణీదేవిని పెళ్లాడి సంతానం లేక బాధపడుతూ, పూజారి చెప్పగా యజ్ఞం కోసం భూమి దున్నుతుండగా, నాగేటి చాలులో వెయ్యి రేకుల బంగారు కమలంలో ఒక పసిపాప దొరికింది. "ఈ బిడ్డను ప్రేమతో పెంచండి" అని ఆకాశవాణి వినిపించింది. పద్మం (తామర) లో దొరికింది కాబట్టి ఆమెకు పద్మావతి అని పేరు పెట్టారు. ఆమె పెద్దయ్యాక శ్రీనివాసుడిని వెతుక్కుంటూ వచ్చి వైభవంగా కళ్యాణం చేసుకున్నాడు. కథ 2: భృగు మహర్షి వల్ల లక్ష్మీదేవి అలిగి రావడం ఒకసారి త్రిమూర్తులలో గొప్పవారెవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి వైకుంఠం వెళ్లి, విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. విష్ణువు కోపగించకపోగా అతని కాలు పట్టుకున్నాడు. ఇది చూసి నా నివాసమైన వక్షస్థలాన్ని తన్నినా ఊరుకున్నారని లక్ష్మీదేవికి కోపం వచ్చి, వైకుంఠం వదిలి భూలోకానికి వచ్చి స్వర్ణముఖి నది ఒడ్డున పద్మసరోవరం తవ్వి 12 ఏళ్లు తపస్సు చేసింది. 13వ ఏట కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి రోజున ఆ సరోవరం మధ్యలో ఉన్న బంగారు కమలం నుండి శ్రీ పద్మావతిగా తిరిగి అవతరించింది. అందుకే అక్కడి కోనేటిని పద్మసరోవరం అంటారు. ఆమెను లక్ష్మీ అనుమతితోనే శ్రీనివాసుడు పెళ్లాడాడు. ఆ సరోవరం మధ్యలో బంగారు కమలంపై మహాలక్ష్మిగా ఉద్భవించింది కాబట్టే ఈ ప్రదేశం పవిత్రమైంది. గుడిలో అమ్మ ఎలా ఉంటుంది? గర్భగుడిలో అమ్మ పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. నాలుగు చేతులు, రెండు చేతుల్లో పద్మాలు, రెండు చేతులు వరద, అభయ ముద్రలతో ఉంటుంది. అందుకే ఆమెను అలమేలు మంగ అంటారు అలివేలు మంగమ్మా - అలరిన నవ్వులమ్మా పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా పద్మసరోవరములో పుట్టిన పద్మమ్మా తిరుచానూరులో వెలసిన తల్లీ మా ఇలవేల్పా నీ చూపు సోకితే చాలు కరుణ కురిపే అమ్మా చరణం 1: బంగారు తామరలో బాలగా దొరికినావే ఆకాశరాజు ఇంట ఆనందమైనావే నాగేటి చాలులోన నవ్వులు చిందినావే సిరులిచ్చు దేవతవై సిరివెలుగైనావే పల్లవి: అలివేలు మంగమ్మా.. అలరిన నవ్వులమ్మా చరణం 2: భృగుముని కోపమునకు అలిగి వచ్చినావే స్వర్ణముఖి తీరమున తపము చేసినావే పంచమి నాడు వచ్చి పద్మమై పూసినావే శ్రీనివాసుని మనసు దోచిన రాణివమ్మా చరణం 3: నీ కనుల కాంతిలో కరుణే ఉన్నదమ్మా నీ కరము చాపితేనే కష్టాలు తీరునమ్మా అప్పుల బాధలన్నీ తీర్చే అమ్మవమ్మా అలమేలు మంగమ్మా మా ఇంట నిలువమ్మా ముగింపు: తిరుమల స్వామి కన్నా ముందు నిన్ను చూస్తే చాలు జన్మ జన్మ పుణ్యమంతా ఒకటై చేరునమ్మా ఓం శ్రీ పద్మావతీ.. అలివేలు మంగమ్మా మా గుండెల్లో కొలువై ఉండిపో అమ్మా ఓం శ్రీ పద్మావతియే నమః 🪷🙏🏻🪷 #తిరుచానూరు #అలివేలుమంగమ్మ #పద్మావతిఅమ్మవారు #తెలుసుకుందాం #శ్రీ అలివేలు మంగమ్మ 🚩 #అలివేలు మంగమ్మ అందాలు గోవిందా శ్రీ గోవిందా #🛕తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు🕉️ #పద్మావతి అమ్మవారు1226
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#శ్రీ వరాహ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఓం శ్రీ వరాహాయ నమః 🙏 సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వరాహ స్వామిని ప్రార్థిద్దాం. #వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి #కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. #అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. #తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. #అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. #అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. #తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. #ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది #తెలుసుకుందాం #తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తిరుపతి తిరుమల #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు721