ShareChat
click to see wallet page
search
శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి - సంపూర్ణ స్థల పురాణం & చరిత్ర కోనసీమ తిరుపతి | ఎర్రచందన స్వరూపుడు | శివ-కేశవ క్షేత్రం 7 శనివారాలు ఏడు ప్రదక్షిణలు ఏడేడు జన్మల పుణ్యఫలం క్షేత్ర పరిచయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కి.మీ దూరంలో, పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమీ పాయ నందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని "కోనసీమ తిరుపతి" అని కూడా పిలుస్తారు. 2. మూలవిరాట్టు - ఎర్రచందన స్వరూపుడు శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టు "ఎర్రచందనం"తో మలచబడిన స్వయంభూ విగ్రహం. ఇది రాతి విగ్రహం కాదు. శంఖు, చక్ర, గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. ప్రపంచంలో అతి అరుదైన ఎర్రచందన వెంకటేశ్వర స్వామి. అందుకే "ఎర్రచందన రూపుడు", "గంధపు వెంకన్న" అని పిలుస్తారు. సుందరమైన విగ్రహం: వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలోని మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు. 3. స్థల పురాణం - నారద తపోఫలం పూర్వం సనకసనందాది మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగి పోతున్నాయని, వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు కలియుగంలో అర్చా స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశంలో లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో చేరుకుంటానని పలుకుతాడు. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. గతంలో నాసికా త్రయంబకేశ్వర నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా, నారద మహర్షి స్వామి వారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. నారదుని వల్ల తెలిసిన విశేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు. నారదుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి మొదట "నారదపల్లి" అని పిలిచేవారు. అదే కాలక్రమేణా "వాడపల్లి"గా మారింది. 4. చందన పేటికలో స్వామి వారు కొద్దిరోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్లిన వాళ్లకు అది మాయమై పోతుండేది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ శుచిగా గౌతమీ నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందన పేటిక దొరుకుతుందని చెప్తాడు. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేయగా చందన పేటికలో శంఖ, చక్ర, గదాయుధుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు సంతోషించి ఆ అర్చావతార రూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించుట ప్రారంభిస్తారు. 5. ఆలయ చరిత్ర & పునర్నిర్మాణం పూర్వపు ఆలయం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పల్లవరాజు పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియ వంశానికి చెందినవారు నిర్మించారు. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప సంపన్నులు అయినారు. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారాయి. ఆ సమయంలో భక్త వరదుడు అయిన వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవ సేవలతో పునీతుడవై వైకుంఠం చేరుతావు అని పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడు అని గుర్తించి, ఆ ఆలయంలో పూజాదికాలు ఆర్థిక భారం లేకుండా స్వామి వారి నిత్య కైంకర్యాలకు 1759వ సంవత్సరంలో తన సొంత ఆస్తి 270 ఎకరాలు స్వామివారికి సమర్పించారు. 6. క్షేత్ర మహత్యం - ఏడు శనివారాల వ్రతం వాడపల్లి ఆలయంలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడు పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల నమ్మకం. ఏడు ప్రదక్షిణలు చేస్తే ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి పూజలు చేస్తారు. ఎంతటి కష్టాలు అయినా సరే స్వామి వారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. వాడపల్లి ఆలయంలో ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం. 7. క్షేత్ర విశిష్టత 1. స్వయంభూ క్షేత్రం: కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. 2. పశ్చిమాభిముఖుడు: స్వామి తిరుమల శ్రీవారికి అభిముఖంగా ఉంటాడు. అందుకే "అపర తిరుపతి", "కోనసీమ తిరుపతి" అని కూడా పిలుస్తారు. 3. దక్షిణ ద్వార దర్శనం: దక్షిణ ద్వారం గుండా దర్శిస్తే అపమృత్యు దోషం తొలగుతుంది. 4. శివ-కేశవ క్షేత్రం: ఆలయ ప్రాంగణంలోనే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం ఉంది. దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు. ఒకే చోట హరి-హరుల దర్శనం. భక్తులు మొదట శివుడిని, తర్వాత వెంకన్నను దర్శిస్తారు. 5. కోరికల కొంగు బంగారం: సొంత ఇల్లు, స్థలం, వివాహం, సంతానం, ఋణ విముక్తి కోసం మొక్కుకుంటే శీఘ్ర ఫలితం. మూల మంత్రం: ఓం నమో వెంకటేశాయ! వాడపల్లిలో ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి + శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మాత్రమే. నేను ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేశాను నా కోరిక కూడా తీరింది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్లాలా అనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు చాలా మహిమగల స్వామి చందన స్వరూపుడు ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻❤️🛕👣🌺వాడపల్లి వెంకన్న సన్నిధిలో మహా అన్నదానం 🙏 కోనసీమ తిరుపతిలో ప్రతి రోజూ వేలాది మంది భక్తులకు ఉచిత భోజనం. అన్నదాత సుఖీభవ! గోవిందా గోవిందా! 🍛 గుడికి వెళ్లే వాళ్ళు 7 కాయిన్స్ ఒక్కో ప్రదక్షణకు ఒక్కొక్క కాయను హుండీలో వెయ్యాలి. మన కోరిక ప్రకారం స్వామివారి మహిమ మూడో వారంలోనే తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏 ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#పురాణాలూ_కథలు - ShareChat