More like this
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం –* *కుబేరుని వద్ద తీసుకున్న అప్పు – హుండీ రహస్యం* *శ్రీనివాసుడు–పద్మావతి దేవి దివ్యకళ్యాణం వైభవంగా జరగడానికి సమయం ఆసన్నమైంది. ఈ కళ్యాణం సాధారణ రాజవివాహం కాదు. దేవతలు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ పాల్గొనే మహాదివ్యోత్సవం. అందువల్ల అన్ని ఏర్పాట్లు అత్యంత వైభవంగా ఉండాలని శ్రీనివాసుడు సంకల్పించాడు.* *పురాణాల ప్రకారం, ఈ దివ్య కళ్యాణానికి అవసరమైన అపారమైన సంపద కోసం శ్రీనివాసుడు ఐశ్వర్యాధిపతైన కుబేరుడి వద్దకు వెళ్లాడు. తన వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ధనాన్ని అప్పుగా ఇవ్వాలని కోరాడు. కుబేరుడు భక్తితో ఆ వినతిని అంగీకరించి, కావలసిన సంపదను సమర్పించాడు.* *అప్పుడు శ్రీనివాసుడు ఒక వాగ్దానం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. "కలియుగం ముగిసే వరకు నా భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఈ అప్పును తీర్చుకుంటాను" అని ఆయన* *చెప్పాడని విశ్వసిస్తారు.* *అందుకే నేటికీ తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే ప్రతి రూపాయి, ప్రతి కానుకను కేవలం విరాళంగా కాకుండా, స్వామివారికి తమ ప్రేమ, కృతజ్ఞత, భక్తికి గుర్తుగా భావిస్తారు. కొందరు తమ మొదటి సంపాదనను సమర్పిస్తారు. మరికొందరు కోరిక నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకుంటారు. ఇంకొందరు ఎలాంటి కోరిక లేకుండానే, కేవలం కృతజ్ఞతతో సమర్పిస్తారు.* *ఈ కథలో దాగి ఉన్న అసలు సందేశం అప్పు గురించి కాదు. భగవంతుడు తన భక్తులకు త్యాగం, దానం, కృతజ్ఞత అనే గొప్ప విలువలను నేర్పించడమే ప్రధాన ఉద్దేశం. మనం సమర్పించేది భగవంతునికి అవసరం కాదు. కానీ ఇచ్చే మనసు, పంచుకునే గుణం, వినయం మనలో పెరగాలని ఈ మహత్యం తెలియజేస్తుంది.* *తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు హుండీలో కానుక వేస్తూ, "స్వామీ! ఇది నా భక్తికి చిన్న గుర్తు. నాపై మీ కరుణ ఎల్లప్పుడూ ఉండాలి" అని మనసారా ప్రార్థిస్తాడు. భక్తితో సమర్పించిన చిన్న కానుకైనా, అది స్వామివారికి అమూల్యమైనదే.* *నీతి: దానం అనేది ధన పరిమాణంతో కాదు, మనసు విశాలతతో కొలవబడుతుంది. భక్తితో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతునికి ఎంతో ప్రీతికరమైనది.* #తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి ##పురాణాలూ_కథలు #కుబేరుడు #Kubera💰1921
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣నేటితో ముగింపు ఆషాడ మాసం బోనాల పండుగ...🙏💐🌹 మహంకాళి అమ్మవారి బోనాలతో అత్యంత వైభవంగా ముగుస్తున్నాయి. ఈ పండుగలో భాగంగా మహిళలు మట్టి కుండలలో వండిన అన్నం, పాలు, బెల్లంతో కూడిన నైవేద్యాన్ని తలపై మోస్తూ అమ్మవారికి సమర్పిస్తారు. బోనం అనగా భోజనం. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కుండను పసుపు, కుంకుమ, వేపాకులు మరియు దీపంతో అలంకరిస్తారు. తొలుత గోల్కొండ కోట వద్ద ప్రారంభమై, సికింద్రాబాద్ లష్కర్ మరియు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వివిధ ఆలయాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యం తలపై పెట్టుకుని ఆలయాలకు వెళ్తారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఈ పండుగ ప్రత్యేకత. బోనాల ముగింపు రోజున భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. #తెలుసుకుందాం #🪔బోనాల చివరి రోజు🙏2112
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣#శ్రీ వరాహ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఓం శ్రీ వరాహాయ నమః 🙏 సర్వ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వరాహ స్వామిని ప్రార్థిద్దాం. #వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి #కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే. #అంతే కాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. #తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది. #అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. #అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. #తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. #ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది #తెలుసుకుందాం #తిరుమల తిరుపతి దేవస్థానం #TTD తిరుపతి తిరుమల #hindu temples #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు24255
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు అంటే ఎవరు?🙏📚 విద్య, జ్ఞానం, జ్ఞాపకశక్తి, వాక్పటుత్వానికి అధిదేవతగా ఆరాధించబడే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు. శ్రీమహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం అత్యంత విశిష్టమైనది. గుర్రం ముఖం, మానవ శరీరంతో దివ్యరూపంలో దర్శనమిస్తూ, తన కరుణాకటాక్షంతో భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 🌺 స్వామివారి విశిష్టత: పురాణాల ప్రకారం మధు–కైటభ రాక్షసులు అపహరించిన వేదాలను తిరిగి సంపాదించి బ్రహ్మదేవునికి అందించిన జ్ఞానస్వరూపుడు హయగ్రీవుడు. అందుకే ఆయనను సర్వవిద్యల ఆధారమూర్తిగా భావిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, పరిశోధకులు, కళాకారులు భక్తితో హయగ్రీవ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విజయాన్ని ప్రసాదిస్తాడని విశ్వాసం. 🕉️ 1. హయగ్రీవ ధ్యాన శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ । ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ॥ 🌺 అర్థం: జ్ఞానం, ఆనందం స్వరూపుడై, నిర్మలమైన స్ఫటికంలా ప్రకాశించే, సమస్త విద్యలకు ఆధారమైన శ్రీ హయగ్రీవ స్వామిని నేను భక్తితో ఉపాసిస్తున్నాను. 🕉️ 2. విద్యా ప్రసాద శ్లోకం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ । తస్య నిస్సరతే వాణీ జాహ్ను కన్యా ప్రవాహవత్ ॥ 🌺 అర్థం: ఎవరు భక్తితో "హయగ్రీవ" నామాన్ని జపిస్తారో, వారి మాటలు గంగానది ప్రవాహంలా స్పష్టంగా, మధురంగా ప్రవహిస్తాయి. 🕉️ 3. విద్యా సిద్ధి శ్లోకం శ్రీమాన్ హయగ్రీవో మే సన్నిధత్తాం సదా హృది । విద్యాం బుద్ధిం బలం చైవ దేహి మే కరుణానిధే ॥ 🌺 అర్థం: ఓ కరుణాసాగరుడా! నా హృదయంలో ఎల్లప్పుడూ నివసించి నాకు విద్య, బుద్ధి, బలం ప్రసాదించు. 🕉️ 4. జ్ఞాన ప్రాప్తి శ్లోకం విద్యానాం దేవతం వందే హయగ్రీవం దయానిధిమ్ । యస్య ప్రసాదాత్ సర్వజ్ఞం భవేత్ మానవ జీవనం ॥ 🌺 అర్థం: సమస్త విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవ స్వామిని నమస్కరిస్తున్నాను. ఆయన అనుగ్రహంతో జ్ఞానం, వివేకం, విజయాలు లభిస్తాయి. 🕉️ 5. ప్రార్థన ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః॥ 🌺 అర్థం: విద్య, జ్ఞానం, బుద్ధి ప్రసాదించే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామికి నమస్కారం. 📖 పిల్లలు ప్రతిరోజూ ఉదయం లేదా చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకాలను భక్తితో చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ధైర్యం, విద్యలో పురోగతి కలుగుతాయని విశ్వాసం. 🙏🌸 🕉️ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారు 🙏 📍 స్వామివారు ఎక్కడ ఉంటారు? శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి: 📍 తిరువహీంద్రపురం (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి అత్యంత ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ ఊషధగిరి కొండపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 📍 నంగనల్లూరు, చెన్నై (తమిళనాడు) – శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి ప్రసిద్ధ ఆలయం. 📍 బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (తెలంగాణ) – ఇక్కడ కూడా హయగ్రీవ స్వామివారిని విద్యాప్రదాతగా ఆరాధిస్తారు. #తెలుసుకుందాం #హయగ్రీవ స్వామి #లక్ష్మీ హయగ్రీవ స్వామి #🕉️ శ్రీ హయగ్రీవ 🙏 #హయగ్రీవ16153
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*_ఇంటి పూజలు_* *ప్రదర్శన కోసం కాదు, భక్తి కోసం.* *వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, లక్ష్మీ పూజ, రుద్రాభిషేకం, సత్యనారాయణ వ్రతం వంటి గృహపూజలు కేవలం ఒక కార్యక్రమం కాదు*. ఇవి మన సంప్రదాయంలో భక్తి, శ్రద్ధ, నియమం, ఆత్మశుద్ధి, కుటుంబ క్షేమం కోసం నిర్వహించే పవిత్రమైన ఆచారాలు. పూజను ఇతరులు చూడకూడదని కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు, ఆహ్వానితులు, భక్తులు పాల్గొనడం సందర్భానుసారం సహజమే, *అయితే పూజను ప్రదర్శనగా మార్చాల్సిన అవసరం లేదు.* *ఈ రోజుల్లో పూజా కార్యక్రమం కంటే దాని అలంకరణ, ఫోటోలు, వీడియోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఎక్కువగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది*. కానీ పూజ యొక్క అసలు ఉద్దేశం — మనసును భగవంతునిపై నిలపడం, సంకల్పాన్ని శ్రద్ధతో నిర్వహించడం, మంత్రాలను భక్తితో జపించడం, నైవేద్యాన్ని సమర్పించడం, ప్రసాదాన్ని స్వీకరించడం. పూజ ఎంత గొప్పగా కనిపించింది అనేది ముఖ్యమేమీ కాదు; *ఎంత భక్తితో నిర్వహించామన్నదే ముఖ్యమైనది.* *పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచడం, పూజకు ముందు శరీర – మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోవడం, పూజా సమయంలో అనవసరమైన మాటలు, హడావుడి, ఫోన్ వినియోగం, ఫోటోలు–వీడియోలపై అధిక శ్రద్ధ తగ్గించడం — ఇవన్నీ పూజలో ఏకాగ్రతను పెంచుతాయి.* అలంకరణలు చేయడం తప్పు కాదు. పూలు, తోరణాలు, దీపాలు, రంగవల్లులు, కలశాలు ఏర్పాటు చేయడం కూడా భక్తి వ్యక్తీకరణలో భాగమే. కానీ అవి భగవంతుని ఆరాధనకు సహాయకాలుగా ఉండాలి; మన ప్రదర్శనకు సాధనాలుగా మారకూడదు. *ఇతరులు మన పూజను చూస్తే తప్పు, వారి చూపు వల్ల పూజ ఫలితం నశిస్తుంది అని భయపెట్టాల్సిన అవసరం లేదు.* అయితే అసూయ, పోటీ, ఆడంబరం, ఇతరుల ప్రశంస కోసం చేసే ప్రదర్శన వంటి భావాలకు దూరంగా ఉండటం మంచిది. మన పూజ మన అంతరంగాన్ని భగవంతుని వైపు తిప్పాలి. *ఇతరుల దృష్టిని ఆకర్షించే విధంగా కాకుండా, మన దృష్టిని భగవంతునిపై నిలిపే విధంగా ఉండాలి.* సార్వజనిక పూజలు — అందరి క్షేమం కోసం. ~ *“సర్వేజనా సుఖినో భవంతు”* అనే సంకల్పంతో చేసే సామూహిక పూజలు, హోమాలు, భజనలు, ధార్మిక కార్యక్రమాలు సమాజ క్షేమాన్ని ఉద్దేశించినవి. అందువల్ల దేవాలయాలు, మండపాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం సహజమైన విషయం. అక్కడ కూడా ప్రధాన ఉద్దేశం ప్రచారం కాదు — ప్రజల శ్రేయస్సు. వ్యక్తిగత గృహపూజ అయినా, సామూహిక ధార్మిక కార్యక్రమమైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి: *పూజ ప్రదర్శన కోసం కాదు — పరమాత్మ స్మరణ కోసం.* *అలంకారం చూపించడానికి కాదు — భక్తిని వ్యక్తపరచడానికి*. *ప్రశంస కోసం కాదు — ఆత్మశుద్ధి కోసం.* *ప్రచారం కోసం కాదు — ధర్మాచరణ కోసం.* *చివరగా ~* *పూజను దాచాల్సిన అవసరం లేదు — ప్రదర్శించాల్సిన అవసరం లేదు.* *భక్తిని నిరూపించాల్సిన అవసరం లేదు — ఆచరించాలి.* అలంకరణను చూపించాల్సిన అవసరం లేదు — ఆరాధనలో ఆనందించాలి *భగవంతుని కోసం చేసిన పూజ, భగవంతునికే అర్పణగా ఉండాలి*. *కర్మను కర్మగా చేయండి.* పవిత్రమైన ఆచారాన్ని ఆడంబరంగా మార్చవద్దు. భగవంతుని ముందు మన భక్తి కనిపించాలి — మన ప్రదర్శన కాదు. #తెలుసుకుందాం #😃మంచి మాటలు16109
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣*ఏది ముందు కావాలి?* 💥💥💥💥💥💥💥 అది ఒక చిన్న కొండ. ఆ కొండ మీద ఓ పూరిగుడిసె!ఓ ముసలిభార్యాభర్తా, వారికొడుకూ కోడలూ ఆఇంట్లో ఉంటున్నారు. అంతాబాగానే ఉంది. పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది, ఎదురుగుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు. కొండ కింద ఉన్న ఊరిలోకి ఈ ఇంటి పెద్దాయనా, ఆయన కొడుకూ పనికి వెళ్తారు. రోజంతా ఒళ్లు వంచి పనిచేసి, మర్నాటికి సరిపడా సంపాదించుకొని ఇంటికి చేరతారు. ఓ రోజు తండ్రీకొడుకులు ఎప్పటిలాగే పనికి వెళ్ళారు. ఆ సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులు వచ్చారు.చారెడు మీసాలు, బారెడు గడ్డంతో వారంతా చాలా చిత్రంగా ఉన్నారు. కానీ వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ‘ఎవరయ్యా మీరు! పాపం దారి తప్పి వచ్చినట్లున్నారు. రండి కాసిని మంచినీళ్లు తాగండి. మాతో కలిసి భోంచేయండి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి,’ అంటూ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది. ఇంటావిడ మాటలకు ఆ నలుగురూ చిరునవ్వు నవ్వి ‘మరేం ఫర్వాలేదు. మేము ఈ అరుగు మీదే కూర్చుంటాము. మీ ఇంట్లోవారంతా వచ్చిన తర్వాతే మేము ఇంట్లోకి వస్తాము,’ అని చెప్పారు. మరికాసేపటికి తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికి చేరుకోనే చేరుకున్నారు. ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది. వెంటనే ఆ ఇంటి పెద్దాయన బయటకు వెళ్లి- ‘ఇంట్లో వారమంతా వచ్చేశాము. దయచేసి లోపలకి రండి,’ అంటూ ఆహ్వానించాడు. ‘మేము నలుగురమూ ఒకేసారి లోపలకి రావడం కుదరదు. మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి, మరొకరు విజయానికి సూచన, ఇంకొకరు డబ్బుకి చిహ్నం, నేను ప్రేమకు ప్రతిరూపాన్ని. మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి,’ అని వారిలో ఒకరు చెప్పారు. వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయం చెప్పాడు- ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది? ముందు డబ్బుని లోపలకి రమ్మనండి. ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను,’ అన్నాడు కొడుకు. ‘అబ్బే డబ్బుదేముంది! ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కీర్తి శాశ్వతం కదా. ముందు ఆ కీర్తిని లోపలకు రమ్మని పిలవండి,’ అని చెప్పింది కోడలు. ‘ఇన్నాళ్లూ నేను జీవితంలోని ప్రతి సందర్భంలోనూ ఓడిపోతూనే ఉన్నాను. ఇప్పటికైనా నేను విజయాలను అందుకోవాలని అనుకుంటున్నాను. నేను విజయాన్నే లోపలకు పిలుస్తాను’ అన్నాడు తండ్రి. ‘భలేవారే!మనం అరాయించుకోలేనంత డబ్బు, డప్పు కొట్టుకొనేంత కీర్తి, తలపొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్లూ సుఖంగా ఉన్నామా లేదా! అందుకు కారణం మన మధ్య ఉన్న ప్రేమే! ఆ ప్రేమ మన జీవితాలలో లేకపోతే... తతిమావి ఏవుండి మాత్రం ఏం లాభం? నా మాట విని వెళ్లి ఆ ప్రేమను లోపలకు పిలవండి,’ అని గట్టిగా చెప్పింది భార్య. ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది. వెంటనే వెళ్లి ‘మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా రండి!’ అని పెద్దాయన పిలవగానే అందులో ఒకరు లేచి లోపలకి అడుగుపెట్టారు. విచిత్రం! ప్రేమ లోపలకు అడుగుపెట్టగానే మిగతావారు కూడా ఆయన వెంటనే లోపలకు వచ్చేశారు. ‘మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా, మిగతా ముగ్గురూ తిరిగి వెళ్లిపోయేవారు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది. విజయం ఉన్నచోట డబ్బు, కీర్తి ఉంటాయి. మిగతా లక్షణాలు అలా కాదు! ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు!’ అన్నాడు విజయానికి ప్రతినిధిగా ఉన్నవాడు. అప్పటి నుంచీ వారి జీవితాల్లోనూ, మనసుల్లోనూ ఏ లోటూ లేకుండా పోయింది.. 💥💥💥💥 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #🗣️జీవిత సత్యం #తెలుసుకుందాం1225
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣🌿 శాకంబరీ దేవి అంటే ఎవరు?🥕🥦🫑🥬🫛🍐🥒🫒🍋🟩🍋🍍🥭🍆 విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఆషాఢమాసంలో శాకంబరీ దేవి అలంకారం ఎంతో విశిష్టత 🌿🥒🍆🥕🥬 పూర్వం దుర్గమాసురుడు 100 ఏళ్లు వర్షాలు లేకుండా చేశాడు 🙏 భూమి మీద తినడానికి తిండి లేక అందరూ ఆకలితో అల్లాడారు 🙏శాకం" అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, "అంబరీ" అంటే ధరించిన తల్లి. పురాణాల ప్రకారం, ఒకసారి దుర్గమాసురుడు వేదాలను అపహరించడంతో వర్షాలు పడలేదు. భూమిపై కరువు ఏర్పడి ప్రజలు, పశువులు ఆకలితో బాధపడ్డారు. అప్పుడు జగన్మాత శాకంబరీ దేవి రూపంలో అవతరించి, తన శరీరం నుంచే వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉద్భవింపజేసి సృష్టిని రక్షించింది. 🌾🥒🍅🥕🍆 🔸 ఆషాఢమాసంలో ప్రకృతి పచ్చగా మారుతుంది. 🔸 రైతులు పండించిన తొలి కూరగాయలు, పంటలను అమ్మవారికి సమర్పిస్తారు. 🔸 సర్వలోకాలకు అన్నం, ఆహారం ప్రసాదించే తల్లిగా కనకదుర్గమ్మను శాకంబరీ రూపంలో అలంకరిస్తారు. 🔸 అమ్మవారికి వేలాది కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అద్భుతమైన అలంకారం చేస్తారు. 🌸 శాకంబరీ అలంకార విశిష్టత 🌿 అన్నపూర్ణ స్వరూపిణి. 🥒 కరువు, ఆకలి, దారిద్ర్యం తొలగుతాయని విశ్వాసం. 🍅 ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, పంటల సమృద్ధి కలుగుతుందని నమ్మకం. 🥬 వ్యవసాయం చేసే వారికి ప్రత్యేక కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. 🍇 కుటుంబంలో సుఖశాంతులు, ధాన్య సమృద్ధి పెరుగుతాయని చెబుతారు. 🙏 భక్తులు ఏమి సమర్పిస్తారు? 🥒 దోసకాయలు 🍆 వంకాయలు 🥕 క్యారెట్లు 🥬 ఆకుకూరలు 🌽 మొక్కజొన్న కంకులు 🍅 టమాటాలు 🌶️ మిరపకాయలు 🍋 నిమ్మకాయలు 🥭 మామిడిపండ్లు 🍌 అరటిపండ్లు 🥥 కొబ్బరికాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి దర్శించుకుంటారు. 🌺 శాకంబరీ దేవి దర్శనం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ధాన్య సమృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. 🙏🌿🌾 అప్పుడు అమ్మవారు తన 100 కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకుంది 🙏 ఆ కన్నీళ్లే వర్షాలుగా మారి నదులు అయ్యాయి 🙏 తన ఒంటి నుండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పుట్టించి ప్రపంచానికి అన్నం పెట్టింది 🙏 అందుకే ఆమె శాకంభరీ అయ్యింది 🙏 శాకం అంటే కూరగాయల తల్లి అని 🙏 ఆషాడం అంటే రైతులకు పంటల నెల 🙏 పంటలు బాగా పండాలని, కరువు రాకూడదని, ఎవరికీ ఆకలి బాధ ఉండకూడదని మన కనకదుర్గమ్మను శాకంభరీగా అలంకరిస్తారు 🙏 ఈ అలంకారం చూస్తే అర్థం ఏంటంటే - తిండిని వృధా చేయొద్దు, ప్రకృతిని కాపాడండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి అని 🙏 #శాకంబరీదేవి 🌿 #విజయవాడకనకదుర్గమ్మ 🙏🌺🍀🌿⚜️💗🧿 #తెలుసుకుందాం #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి #కనక దుర్గమ్మ2K3K
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣వరలక్ష్మీ అవతారాలు.............!! వరలక్ష్మీ ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి. తన కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిలాల్లని వనితలు కోరుకోవడం అత్యాశేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మీమాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలూ తీరుతాయి. వరలక్ష్మి అవతారాలు అనేకం. ఆమెను ‘అష్టలక్ష్మీ స్వరూపం’గా ఆరాధిస్తే అన్ని వరాలూ దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీకృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. అందుకే లక్ష్మీతత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి, జీవితాన్ని సుఖమయం చేసుకోవడం, జన్మకు సార్థకత సాధించడం వీలవుతుంది. పురాణ ప్రాశస్త్యం.. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జగన్మాత అయిన పార్వతీదేవి ఓ సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ, ‘స్త్రీలు సర్వ సుఖాలు పొంది, పుత్రపౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం ఆచరించాలో చెప్పాల’ని కోరుతుంది. అందుకు పరమేశ్వరుడు- ‘వనితలకు సకల శుభాలు దక్కాలంటే ‘వరలక్ష్మీ వ్రతం’ పేరిట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలం’టూ సమాధానమిచ్చాడు. ఈ వ్రతానికి సంబంధించి ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం మగధ రాజ్యంలోని కుండినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది. భర్త, కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది. రోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి, అత్తమామలను సేవిస్తూ, మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణతో ఆమె కాలం గడిపేది. ఓ రోజు చారుమతి కలలో- లక్ష్మీమాత ప్ర త్యక్షమై, అనుకున్న ఆశలన్నీ ఫలించాలంటే వరలక్ష్మీదేవిని ఆరాధించమని చెబుతుంది. లక్ష్మీదేవి చెప్పినట్లే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు- శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది. చారుమతి తన కలలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారిచేత కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వేనోళ్ల కొనియాడతారు. మహాశివుడు పార్వతికి ఉపదేశించిన ఈ కథను ఆ తర్వాత సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పడంతో విశేష ప్రాచుర్యం పొందింది. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి ఇలాంటిదే మరో కథ పురాణాల్లో మనకు కనిపిస్తుంది. స్వర్గలోకంలో పార్వతీ పరమేశ్వరులు ఓ రోజు కాలక్షేపం కోసం సరదాగా చదరంగం ఆడుతుంటారు. ప్రతి ఆటలోనూ పార్వతి విజయం సాధిస్తుంటుంది. తాను గెలిచి తీరుతానంటూ సాంబశివుడు ఆమెలో ఆతృత రేకెత్తిసుంటాడు. ఈ దశలో ‘చిత్రనేమి’ అనే వ్యక్తిని ఆటలో పెద్దమనిషిగా ఉండమని పార్వతి కోరుతుంది. చిత్రనేమి నిజానికి శివుడి సృష్టే. అందుకే అతడు చదరంగం ఆటలో శివుడి పక్షాన నిలబడతాడు. అతడి వైఖరి పార్వతికి ఎంత మాత్రం నచ్చదు. పక్షపాతం లేకుండా బాధ్యతలను నిర్వహించడంలో విఫలుడై తనకు మానసిక క్షోభ పెట్టాడన్న ఆగ్రహంతో చిత్రనేమిని పార్వతి శపిస్తుంది. ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధికి లోనవుతాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని అతడు పార్వతిని పరిపరి విధాలా వేడుకుంటాడు. చివరకు ఆమె కరుణించి, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతుంది. ఆ విధంగానే అతడు వరలక్ష్మిని ఆరాధించి శాపవిముక్తడవుతాడు. ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదమతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరి పాలయమామ్ (1) ధాన్యలక్ష్మి ఆయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయమామ్ (2) ధైర్యలక్ష్మి జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరి పాలయమామ్ (3) గజలక్ష్మి జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వ ఫలప్రద శాస్త్రమయే రధగజ తురగ పదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయమామ్ (4) సంతానలక్ష్మి అయిగజ వాహిని మోహిని చక్రణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే గుణగణ వారిధి లోక హితైషిణి, సప్తస్వర భూషిత గాన నుతే | సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుగే జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయమామ్ (5) విజయలక్ష్మి జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞాన వికాసని గానమయే అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | కనకధరాస్తుతి వైభవ వందిత, శంకర దేశిక మాన్యపదే జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయమామ్ (6) విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారత భార్గవి, శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ, శాంతి సమావృత హాస్యముఖే | నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హాస్యయుతే జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ పరిపాలయమామ్ (7) ధనలక్ష్మి ధిమి ధిమి ధింధిమి ధింధిమి, దుంధుభి నాద పూర్ణమయే ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యమతే | వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయమామ్ (8) ఫలశృతి శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని శ్లో|| శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే జయః | జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్ || #తెలుసుకుందాం #💐వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు🌼 #🔱లక్ష్మిదేవి కటాక్షం #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️3022
- 👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣గ్రహాలను ప్రసన్నం చేసుకునే ఉపవాస పద్ధతి.......!! సనాతన సంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇష్టదైవానుగ్రహం కోసం ఉపవాసం ఉంటుంటారు. కొందరు పరమేశ్వరుని ప్రీత్యర్థం సోమవారం, వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం శనివారం ఇలా వారానికి ఒకట్రెండు రోజులు ఉపవాసం ఉంటారు. ఇంకొందరు ఏకాదశి వంటి పవిత్ర తిథులయందు ఉపవాసం ఆచరిస్తారు. అయితే ఈ ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలు చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. ఉపవాసం అంటే ఉప ఆవాసం. అంటే దేవుడికి దగ్గరిగా ఉండటం అన్నమాట. భగవధ్యానమే సంపూర్ణ ఉపవాసం. ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు ఎలాంటి ఆహారం తీసుకోరు. రాత్రిపూట ఫలహారంగా పళ్లు, అటుకులు, మురుమురాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారు. ఇలా వారానికోసారి, పక్షానికోసారి ఉపవాసం ఉండటం ఆరోగ్యానికీ మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఉపవాసం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతంది. రక్త శుద్ధి కూడా అవుతుందని చెబుతారు. అయితే వారంలో వరుసగా రెండు, మూడు రోజులు ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత వుంది. దాని ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో మన పూర్వీకులు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం.రోజుకో దేవతారాధనతో, ఉపవాసంతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు. ఆదివారం: అనారోగ్య నివారణకు, చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి. వ్రతవిధానం: ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. సోమవారం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేకరాష్టకంతో సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి. వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, చంద్రశేకరాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపురంగు వస్తువులను దానం చేయాలి. మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం గాని సుబ్రమణ్య అష్టకమ్ గాని పఠించి మంగళవార వ్రతం ఆచరించాలి. వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్దిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, ఋణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరాన్నిలేదా మూలమంత్రం పఠించాలి. బుధవారం: స్థితికారకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు మదురాష్టకాన్ని భక్తితో పఠిస్తూ ఈ వ్రతాచరణ చేయాలి. వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసే వారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో వుండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్ధాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి. గురువారం: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివౄఎద్దిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రే యుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గురువార వ్రతం చేయాలి. వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ళపాటు చేయాలి. స్నానా నంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచు లోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిసిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకపూట తప్పనిసరిగా ఉపవాసం వుండి, స్వామికి నివేదించిన పదార్ధాలను స్వీకరించాలి. శుక్రవారం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాతా, గాయత్రి తదితర దేవతల అనుగ్ర హాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్త్రణామం శుక్రవార పూజకు శ్రేష్ఠమైనది. వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లప క్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి. శనివారం: శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహువు, కేతువు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు నవగ్రహా స్తోత్రంతో శనివార వ్రతం చేయాలి. వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమా సంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచ రణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వు లనూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి. #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯1114