నేటితో ముగింపు ఆషాడ మాసం బోనాల పండుగ...🙏💐🌹 మహంకాళి అమ్మవారి బోనాలతో అత్యంత వైభవంగా ముగుస్తున్నాయి. ఈ పండుగలో భాగంగా మహిళలు మట్టి కుండలలో వండిన అన్నం, పాలు, బెల్లంతో కూడిన నైవేద్యాన్ని తలపై మోస్తూ అమ్మవారికి సమర్పిస్తారు. బోనం అనగా భోజనం. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కుండను పసుపు, కుంకుమ, వేపాకులు మరియు దీపంతో అలంకరిస్తారు. తొలుత గోల్కొండ కోట వద్ద ప్రారంభమై, సికింద్రాబాద్ లష్కర్ మరియు హైదరాబాద్ నగరవ్యాప్తంగా వివిధ ఆలయాలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యం తలపై పెట్టుకుని ఆలయాలకు వెళ్తారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ఈ పండుగ ప్రత్యేకత. బోనాల ముగింపు రోజున భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. #తెలుసుకుందాం #🪔బోనాల చివరి రోజు🙏
11 likes
21 shares

More like this