కొన్ని ఆలయాల గోడలపై మైథున శిల్పాలు ఎందుకు ఉంటాయి..... ఇది చాలా లోతైనా ప్రశ్న మరియు కొత్త గా మతం మారిన వాళ్ళు మనల్ని అడిగే ప్రశ్న.. కాకపోతే వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే అలాంటి మైథున శిల్పాలు అన్ని ఆలయాల పై ఉండవు కానీ తమ పూర్వ దర్మం పై నిందలు వేయడం లో ఉత్సహం కొద్ది 🐑🐑 లు ఈ ప్రశ్న కావాలనే మనల్ని అడుగు తారు. కాకపోతే ఇలాంటి లోతైన విషయాల పై అందరికి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వాటికి సమాధానం ఇవ్వలేరు. ఇప్పుడు ఆ సమాధానం నేను మీకు ఇస్తున్న. మన సనాతన ధర్మం లో 6 రకాల పూజా పద్ధతులు ఉన్నాయ్. ఆవి 1: దక్షిణా చారం 2: మధ్యమా చారం. 3: వామా చారము 4 : కౌలా చారం. 5: సమయాచారం. 6: సిద్ధాంతా చారం. విటీలో దక్షిణా చారం అనేది సాధారణం గ ప్రతి వారు చేసే పూజా విధి.ఈ ఆచారం ప్రకారం దేవతల ను సాత్విక పద్దతిలో పూజిస్తారు. ఈ విధానం అత్యుత్తమైనది. దేవతలు కూడ ఈ పూజా విధి నే ఇష్ట పడతారు. ఈ విధానం లో ఎలాంటి హింస ఉండదు. అసలు రక్తం అనే దానికి ఇందులో అవకాశం లేదు. ఇక మధ్యమా చారం అంటే ఇందులో కొంత వరకు బలులకు అనుమతి ఉంటుంది. అదికూడా కోడి,మేక,గొర్రె ఇంకా అరుదుగ దున్నపోతు ను బలి ఇస్తారు.ఇలాంటి వాటి వరకే ఈ పూజ లు సాధారణంగ గ్రామ దేవతలకు చేస్తారు. ఈ గ్రామ దేవతలను సాత్విక పూజల ద్వారా కూడ పూజించవచ్చు కానీ పామరులు తమ వద్ద ఉన్న వాటిలో శ్రేష్ఠ మైనవి తమను కాపాడే దేవతకు ఇవ్వాలి అనే ఉద్దేశం తో ఇచ్చేవే జంతు బలులు. బలి అనే పదానికి నిజమైన అర్థం జీవ హింస కాదు. దేవత కు అర్పించిన దానినే బలి అంటారు. అందుకే మనకు సాధారణ ఆలయాల్లో కూడ బలి పిఠాలు ఉంటాయి. వాటి పై భగవంతునికి నివేదన చేసిన ప్రసాదాన్ని ఉంచుతారు. ఆ ప్రసాదాన్ని బలి అన్నము అంటారు. ఆ బలి అన్నం పక్షులు, కీటకాలు తినడం కోసం ఉంచుతారు. అందులోను దేవుని ప్రసాదాన్ని మొదట బలి పీఠం పై ఉంచిన తరువాత నే భక్తులకు ఇస్తారు. కాబట్టి మన పూజా విధానం లో పక్షులు, కీటకాలను కూడ గౌరవించే సంప్రదాయం మనది. ఇక చివరి రెండూ ఐన సమయాచారం, సిద్ధాంతాచారం అనేవి పూర్తిగా యోగులు, సిద్ధులు పాటించే పద్ధతులు. ఐతే మూడు, నాలుగు పద్ధతులు ఐన వామాచారం, కౌలాచారం అనేవి మాత్రం ఒకప్పుడు బాగా ప్రాచుర్యం లో ఉండి ఇప్పుడు మరుగున పడిన ఆచారాలు. ఇవి పూర్తిగా తాంత్రిక పద్ధతులు ఇందులో దేవతలను పంచ మకారాలతో పూజిస్తారు. ఆ పంచ మకారాలు యేవో చూద్దాం. 1: మద్యం 2:మాంసం 3: మస్త్యం 4: ముద్ర 5:మైథునము. వీటిలో ప్రతిధి పవిత్రము గానే భావిస్తారు. మైథునం అనేది కూడ పూజా విధానం లో భాగం గానే చూస్తారు తప్ప కోరిక తో చెయ్యరు. ఇలాంటి అచారాలు 5 వ శతాబ్దం నుండి 10, 11 శతాబ్దముల మధ్య ఉచ్చ స్థితి లో ఉన్నాయ్. అందులో కూడ కౌలాచారం పద్ధతి లో పూజలు చేసే ఆలయాల గోడల పై మాత్రమే ఇలాంటి మైథున శిల్పాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి పూజలకు కజురహో ఆలయం మూల కేంద్రంగా ఉండేది కాబట్టి ఆ ఆలయం లో మనకు మైథున శిల్పాలు కనిపిస్తాయి. ఈ పద్ధతులలో దశ మహా విద్యలలో నీ కొందరు తాంత్రిక దేవతలను మాత్రమే ఆరాధిస్తారు. తరువాత కాలం లో ఈ విధానం మరుగున పడిపోయింది కానీ బౌద్ధం లో కొన్ని శాఖ లు ఇప్పటికి ఈ పద్ధతులలో రహస్యం గ పూజలు చేస్తుంటారు. ఆ పద్ధతులలో పూజలు అందుకునే దేవతలు కూడ చాలా ఉగ్ర స్వరూపం కలిగి ఉంటారు. పూజలు లో చిన్న పొరపాటు జరిగిన కూడ తీవ్ర మైన శిక్ష లు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు హిందూ ధర్మం లో దక్షిణ, మధ్యమ అచారాలలో మాత్రమే పూజలు జరుగుతాయి. కాబట్టి అన్ని ఆలయాల గోడల పై ఇలాంటి మైథున శిల్పాలు ఉండవు.విటినీ మైథున శిల్పాలు అనాలి అదే సరైన పదం. శృంగార శిల్పాలు అనడం సరైన పదం కాదు అనేది నా అభిప్రాయం. ఇంకా కొన్ని గ్రామ దేవతలు లేద రాజసిక గుణం కలిగిన దేవతల ఆలయాల గోడల పై ఒక బొమ్మను మాత్రం పెడతారు. నిజానికి అది గుడి కీ వచ్చే భక్తుని చిత్తాన్ని పరీక్షించే ఉద్దేశం లో ఒక భాగం కూడ కావచ్చు. #తెలుసుకుందాం
3 shares

More like this