👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
491 views • 20 hours ago
*రామాయణం - శ్రీ రామనామ విశిష్టత*
ఏ నామం అయినా పలికితే
నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు.కానీ అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం పొరపాటు
శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అదెలాగో చద్దాం
రామ అంటే రాముడు పలుకుతాడు.
రామ అనే నామం ఉన్న చోట
అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ హనుమంతుడే
శ్రీ అంటే లక్ష్మిదేవి.
రా అంటే విష్ణువు { ఓం నమో నారాయణాయ ) అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు.
మ అంటే శివుడు
{ ఓం నమః శివాయ } అనే నామంలో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు.
శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు.ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని అపుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట.
మరి రామ అన్నపుడు హనుమ వస్తే పార్వతీ కూడా వచ్చింది కదా...
రాముడు,హనుమంతుడు,
లక్ష్మి,విష్ణువు,శివుడు,పార్వతీ.
ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. అలాంటి నామ పారాయణం చేయడం మరువకండి. రామాయణం పఠించడం వలన కలిగే ప్రయోజనములు
ప్రాచీనకాలంలో దేవతల జీవన విధానం వారు అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పవిత్ర పురాణ గ్రంథాలు ఎన్నో వున్నాయి.
వాటిని పఠించడంగానీ లేదా వినటం గానీ చేస్తే మన సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో వున్న కష్టాలు తొలగిపోయి. లాభాల పంటలు పండుతాయని ఆనాటి ఋషువులు పేర్కొన్నారు.
అటువంటి పవిత్ర గ్రంథాల్లో వాల్మీకి రచించిన రామాయణం ఎంతో మహోన్నతమైంది.24,000 శ్లోకాలతో కూడిన రామాయణం హిందూ చరిత్ర సంస్కృతి ఆచారాలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగి వుంది.
అందులో వున్న పాత్రల ద్వారా మంచి-చెడు మధ్య భేదాలు ఆదర్శ జీవిన విధానం గౌరవ అగౌరవాలు వంటి విషయాలను ఎన్నో నేర్చుకోగలగుతాము. ముఖ్యంగా అందులో వున్న పాత్రలు మనకెంతో తోడ్పడుతాయి.
బంధాలు, బంధువుల పట్ల ఎలా వ్యవహరించాలి.మన జీవితానికి సార్థకత ఏంటిఅన్న వాటి గురించి క్లుప్తంగా విశదీకరిస్తుంది.
ఆదికావ్యం రామాయణం వాల్మీకి రామాయణాన్ని చదవడం ద్వారా మన దోషాలను నివారించుకుంటూ శత్రువులను కూడా జయించవచ్చు. ఆటుపోట్లను ఎదుర్కుంటూ విజయాలబాట వైపు అడుగులు వేయొచ్చు.
పెళ్లయిన స్త్రీలు రామాయణాన్ని చదివినాగానీ విన్నాగానీ వారికి రాముడువంటి మంచి కుమారుడు జన్మిస్తాడు.
పెళ్లికాని కన్యలకు శ్రీరాముడు వంటి సద్గుణాలు కలిగిన మంచి భర్త లభిస్తాడు.
రామాయణాన్ని నిత్యం పఠించడం ద్వారా మానవ శరీరంలో వున్న సమస్త రోగాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యవంతుడిగా వెలుగుతాడు. మృత్యుదోషాలు తొలిగిపోతాయి. దీర్ఘాయుష్షును పొందుతాడు.
అలాగే సంకల్ప సిద్ధి దైవానుగ్రహం కూడా కలుగుతాయి నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు.
నిర్వహించుకునే ప్రతి కార్యక్రమంలోనూ మంచి ఫలితాలను పొందుతారు.
జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతారు అంతేకాదు మానవ జీవితంలో అవసరమయ్యే విషయాలు అన్నీ సమకూరుతాయి.
శ్రీరామ అతులిత మధురం రామ నామము శ్రీమన్నారాయణ మంత్రములో రా జీవమును
శివ పంచాక్షరి మంత్రములోని మ జీవాన్ని కలిపి రామ అనే నామముతో దశరథ సుతాగ్రజునికి నామకరణం చేసారు వశిష్ఠ మహర్షుల వారు.
సృష్టిలోని తీయదనము దివ్యత్వము అంతా కలిపి ఆ దివ్యనామములోనే ఉందేమో
రామా అన్న చాలు హరియించును సర్వ పాతకములు జన్మ జన్మలలోని దోషాలన్నీ హరించి పోతాయి.
ఈ నామ సంకీర్తనము ద్వారా అందుకే మన కంచెర్ల గోపన్న గారు
ఓ రామ నీ నామ మెంత రుచిరా అని పాడి రామదాసు అయిపోయారు.
ఎందరో మహా భక్తులు రామ నమ మహితాత్మక శక్తి చేత ధన్యులయ్యారు.
రాతిని నాతిని చేసిన పరమ పావనమీ దివ్య నామము
కరకు బోయ తిరగేసి పలికితే
కవిగా చేసిన నామమీ దివ్య నామమని మన ఆరుద్ర వారు చెబుతారు.
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే !*
*సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే |!*
#తెలుసుకుందాం #sri rama #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #జై శ్రీరామ
12 shares