👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
517 views • 18 hours ago
*శ్రీకృష్ణుడు జన్మించిన రాత్రి జరిగిన ఈ అద్భుత సంఘటనలు*
*నిద్రలోనే వసుదేవుడు చేసిన మహత్తర కార్యం*
*శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కారాగారంలోని సైనికులందరూ యోగమాయ ప్రభావంతో గాఢనిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత కారాగార ద్వారం తనంతట తానే తెరుచుకుంది. ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తోంది. వసుదేవుడు బాలకృష్ణుడిని ఒక బుట్టలో ఉంచి, ఆ భారీ వర్షంలోనే బుట్టను మోసుకుంటూ కారాగారం నుంచి బయటకు వచ్చారు. వసుదేవుడు మథుర నుంచి నందగావుకు చేరుకున్నారు. అయితే ఈ సంఘటనల గురించి ఆయనకు ఎలాంటి జ్ఞాపకం లేదు.*
*ఉప్పొంగుతున్న యమునా జలం శాంతించింది*
*శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వసుదేవుడు బాలకృష్ణుడిని బుట్టలో ఉంచుకుని యమునా నదిలోకి ప్రవేశించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. యమునా జలాలు బాలకృష్ణుని పాదాలను తాకగానే, నది జలం రెండు* *భాగాలుగా విడిపోయి, ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. అదే మార్గం గుండా వసుదేవుడు గోకులానికి చేరుకున్నారు.*
*దేవి వింధ్యవాసిని అవతరణ*
*వసుదేవుడు నందబాబా ఇంట్లో జన్మించిన ఆడశిశువు, అంటే యోగమాయను తీసుకుని నిశ్శబ్దంగా తిరిగి మథుర కారాగారానికి చేరుకున్నారు. అనంతరం దేవకీకి ఎనిమిదో సంతానం జన్మించిన విషయం కంసుడికి తెలియడంతో అతడు కారాగారానికి వచ్చాడు. ఆ నవజాత ఆడశిశువును రాతిపై విసిరి చంపాలని కంసుడు ప్రయత్నించగానే, ఆ బాలిక అకస్మాత్తుగా కంసుడి చేతుల నుంచి తప్పించుకుని ఆకాశంలోకి చేరింది.*
*అక్కడ ఆమె తన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించి, కంసుడి వధ గురించి ముందుగానే ప్రవచించింది. అనంతరం ఆమె వింధ్యాచల పర్వతానికి తిరిగి వెళ్లింది. నేటికీ ఆమెను వింధ్యాచల దేవిగా భక్తులు పూజించి, ఆరాధిస్తున్నారు.*
*పిల్లల మార్పిడి విషయం ఎవరికీ తెలియలేదు*
*వసుదేవుడు శ్రీకృష్ణుడిని యమునా నది అవతలి ఒడ్డున ఉన్న గోకులంలోని తన మిత్రుడు నందగోపుడి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నందుడి భార్య యశోదాదేవి ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోదాదేవి పక్కన పడుకోబెట్టి, అక్కడ ఉన్న ఆడశిశువును తనతో పాటు తీసుకుని తిరిగి మథురకు వచ్చారు.*
*నందరాయుడు స్వాగతం పలికాడు*
*కథనం ప్రకారం, నందరాయుడి ఇంట్లో ఆడశిశువు జన్మించిన సమయంలోనే వసుదేవుడు శ్రీకృష్ణుడిని తీసుకుని వస్తున్న విషయం ఆయనకు తెలిసింది. దీంతో నందరాయుడు తన ఇంటి ద్వారం వద్ద నిలబడి వసుదేవుడి కోసం ఎదురుచూడసాగాడు.*
*వసుదేవుడు అక్కడికి చేరుకోగానే, నందరాయుడు తన ఇంట్లో జన్మించిన ఆడశిశువును చేతుల్లోకి తీసుకుని వసుదేవుడికి అప్పగించాడు. అయితే ఈ సంఘటన అనంతరం నందరాయుడు, వసుదేవుడు ఇద్దరూ జరిగిన విషయాలన్నింటినీ మరచిపోయారు. ఇదంతా యోగమాయ ప్రభావంతోనే జరిగిందని పురాణ కథనం.*
##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #హరే కృష్ణ
13 shares