లక్ష్మీకటాక్షం కోసం ఏలక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవి అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ సాక్షాత్తు ధ‌నానికి అధిప‌తి. ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా, ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలు పూజిస్తారు. కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనం రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో...అలాగే వెళ్ళి పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి . గుడ్లగూబపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదు. దీంతో అంతా అశుభమే జరుగుతుంది.ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది. శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుంది. అదే తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో గాని కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోనుగాని పూజించాలి. దీనివల్ల ఐశ్వర్యం లభిస్తుంది. మహావిష్ణువు విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే, దాంతో లక్ష్మీ దేవి మ‌రింత సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుంది. గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. లక్ష్మీదేవితో పాటు మహావిష్ణువుని కూడా పూజించాలి అలా పూజించకపోతే మహాలక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. పాదరసంతో తయారుచేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయి. ధనం కూడా బాగా సమకూరుతుంది. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మీ మనీ లాకర్‌లో పెట్టాలి. దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. లక్ష్మీ నారాయణ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలి. దీంతో అనుకున్నది జరుగుతుంది. దీపావళి రోజున లక్ష్మీ దేవిని కనకధారా స్తోత్రం తో 108 సార్లు పూజించినందువల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుంది. #తెలుసుకుందాం #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి
12 likes
6 shares

More like this