P.Venkateswara Rao
669 views 27 days ago
#ముద్రగడ పద్మనాభం గారు 💐💐 *'కులం కోసం నేను’ అనే నేత ఇక లేరు, రారు..❗* ముద్రగడ పద్మనాభం ఇక లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు కులస్తుల సంక్షేమం కోసమే పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చరిత్రలో మిగిలిపోతారు. ఇదివరలో ఎందరు నాయకులైనా తమ తమ కులాల ఎదుగుదలకు పనిచేసి ఉండొచ్చు. భవిష్యత్తులో కూడా కులాలను నమ్ముకునే రాజకీయ నాయకులు పుట్టవచ్చు.. కనుమరుగైపోవచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం తరహాలో.. కాపు కుల సంక్షేమం మినహా తనకు మరొక ఎజెండా లేదని బాహాటంగా చెప్పగల మరొక నాయకుడు వస్తారని మనం ఆశించలేం. ఆ రకంగా చూసినప్పుడు.. రాష్ట్రంలోనే కాపుకులానికి ముద్రగడ పద్మనాభం మరణం పెద్ద లోటు అని చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో కులరాజకీయాలు శాసిస్తూ ఉంటాయనేది అందరికీ తెలిసిన సత్యం. తమ తమ కులాల ఓటు బ్యాంకులను పదిలంగా కాపాడుకోవడానికి .. దాదాపుగా ప్రతి నాయకుడు కూడా నానా వ్యూహాలు, కుట్రలు పన్నుతుంటారు. అనేక వక్రమార్గాలు అనుసరిస్తుంటారు. తమ తమ కులాల్లోని కొందరు పెద్దలతో తమ కులస్తులందరితో రహస్య/ బహిరంగ భేటీలు నిర్వహింపజేస్తూ కులం మొత్తాన్ని తమ రాజకీయాలకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగిస్తుంటారు. పైకి చెప్పుకోవడానికి మాత్రం.. తమది సొంత కులానికి ప్రాధాన్యం ఇచ్చే రకం కాదని రంగు పులుముకోవడానికి వల్లించే నీతులు వేరే స్థాయిలో ఉంటాయి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల్లో ఈ కులం ప్రాధాన్యం చాలా ఎక్కువ. పార్టీని స్థాపించిన అగ్రనేత ఏ కులానికి చెందిన వాడైతే ఆ పార్టీ మీద కలకాలం ఆ కులం ముద్ర ఉండిపోతుంది. తెలుగుదేశం- కమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్- రెడ్డి, జనసేన- కాపు, భారత రాష్ట్ర సమితి- వెలమ పార్టీలు అని ప్రజలు ముద్రవేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పార్టీలు మాత్రం ‘తమకు అందరూ సమానమే’ అని సంకేతాలు ఇస్తున్నట్టుగా.. అన్ని కులాల ప్రతినిధుల్ని పార్టీ కమిటీలో పెట్టుకుంటూ.. లోలోపల కులరాజకీయాలు నడిపిస్తుంటారు. ఇది చాలా కామన్ గా మారిన సమాజం మనది. కానీ పైకి ఒక రకంగా, లోపల ఒకరకంగా వ్యవహరించకుండా.. తనకు కాపు కులం తప్ప మరొక ప్రాధాన్యం లేనే లేదని విస్పష్టంగా ప్రకటిస్తూ రాజకీయాలు చేసిన వ్యక్తి ముద్రగడ. కాపులకు బీసీ కేటగిరీ గుర్తింపు సాధించడానికి ఆయన సాధించిన సుదీర్ఘమైన పోరాటం ఫలించకుండానే ఆయన కన్నుమూశారు. కేవలం కాపు కులం తప్ప తనకు మరొకటి ఏదీ అనవసరం అనుకున్న ధోరణి వల్ల.. ఆయన విస్తృతంగా దక్కగల అనేక అవకాశాల్ని కూడా కోల్పోయారని చెప్పాలి. భవిష్యత్తులో ఒక్కో కులాల ప్రతినిధులుగా అనేకమంది నేతలు రావొచ్చు. కానీ.. నా కులమే నా ఏకైక ప్రయారిటీ అని ఓపెన్ గా చెప్పేంతటి నిజాయితీ గల నాయకులు మాత్రం రారు. ముద్రగడ మరణం పట్ల కాపు కులం మొత్తం సంతాపం తెలియజేస్తోంది.
8 likes
19 shares

More like this